KRNL: 2 వారాలుగా విద్యార్థులకు వర్చువల్ ద్వారా విద్యాబోధన జరుగుతోందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణతా శాతం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు.
WNP: కళాశాల విద్య కమిషన్ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధించుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 వరకు బయోడేటాతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం నియామకాలు జరుగుతాయన్నారు.
WNP: ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులకు హైదరాబాదులోని ఐఐసీటీలో ఉద్యోగాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మన్ సివిల్ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు http://www.iict.res.in వెబ్సైట్లో ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NLG: ITI కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం డిప్లొమా కోర్సు (బ్రిడ్జి కోర్సు)లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలికల న్యూ ITI ప్రిన్సిపాల్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్లు ITI (ఇంజనీరింగ్ (NCVT) కోర్సు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు ఈ నెల 18 నుంచి జనవరి 30వ తేదీ వరకు కాలేజీలో సంప్రదించాలన్నారు.
WGL: హనుమకొండలోని కేడీసీ మైక్రో బయాలజీ విభాగంలో అతిథి అధ్యాపకుడి నియామకానికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. సంబంధిత పీజీ కోర్సులో 55 శాతం మార్కులు కలిగి ఉండి నెట్, సెట్, పీహెచ్ డీ అర్హతలు కలిగిన అభ్యర్థులు నేడు కళాశాలకి సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
KMM: రంపచోడవరంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీల్లో ఆయాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈనెల 20 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారిణికి లేదా పోస్ట్ ద్వారా సమర్పించాలని చెప్పారు.
ఈ నెలలోనే బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 26, 27న మిజోరం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. డిసెంబర్ 28, 29 తేదీల్లో నాల్గవ శనివారం, ఆదివారం కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 30న మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా సందర్భంగా సెలవు.
TG: టెన్త్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్, 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.
SDPT: జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యా యులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట 9 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు చదువులకు దూరంగా గడుపుతున్నారు. పాఠశాలలో విద్యార్థినులకు రక్షణగా ఉపాధ్యాయులు లేక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హెల్త్కేర్ టెక్నాలజీ కంపెనీ ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. NSEలో 43% ప్రీమియంతో రూ.1900 వద్ద, BSEలో 39.65 శాతం లాభంతో రూ.1,856 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. లిస్టింగ్ నేపథ్యంలో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.32,977కోట్లకు చేరింది. కాగా, రూ.2,498 కోట్ల సమీకరణ లక్ష్యంగా IPOకి వచ్చిన ఈ కంపెనీ ధరల శ్రేణిని రూ.1,265-1,329గా నిర్ణయించింది.
ఈ ఏడాది అక్టోబర్లో కొత్తగా 17.80 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు కార్మిక రాజ్య బీమా సంస్థ(ESIC) తెలిపింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన ఉద్యోగాల కంటే 3శాతం అధికమని పేర్కొంది. వీరిలో 3.5 లక్షల మంది మహిళలు, 42 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మరింత మందికి ఉద్యోగాలు కల్పించేలా 21,588 కొత్త సంస్థలను ESIC పరిధిలోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది.
వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ పసిడి ధరలు బాగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గటంతో రూ.77,130గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.70,700కు చేరింది. కాగా.. కిలో వెండి ధర ఏకంగా రూ.1000 తగ్గటంతో రూ.99,000 ఉంది.
NLG: నల్గొండలోని డాన్ బోస్కో పాఠశాలలో కొనసాగుతున్న చండూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో హెల్త్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. BSC నర్సింగ్, GNM, MPH, అర్హత గలవారు అర్హులని తెలిపారు. వేతనం రూ.14 వేలు చెల్లిస్తారన్నారు. ఈనెల 19వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.
NLG: ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్న సైన్స్ ఎగ్జిబిషన్ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డీఈఓ బి.బిక్షపతి తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మంత్రి కోమటిరెడ్డితో ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం లేనందున సైన్స్ ఎగ్జిబిషన్ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని డీఈఓ తెలిపారు.
ADB: గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 20, 21 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ, ఎంపీసీ, బీజెడ్సీ, బీకామ్ కంప్యూటర్స్ మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.