• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్స్ 5వ ఏడాది చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 7, 9 తేదీలలో ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు.

December 28, 2024 / 04:21 AM IST

నేడు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సెలవు

SKLM: ఎచ్చర్లలో గల డా.బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ.. శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ రజిని తెలిపారు. విశ్వవిద్యాలయంతో పాటు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు కూడా సంతాప దినంగా శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

December 28, 2024 / 04:17 AM IST

జాబ్ మేళాలో 18 మందికి ఉద్యోగాలు

PLD: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద (APSSDC) ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలోని ఎస్స్కే బీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాకు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 4 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. 34 మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరవ్వగా అందులో 18 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

December 28, 2024 / 04:10 AM IST

భీమవరంలో నేడు జాబ్ మేళా

W.G: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, నేషనల్ కెరీర్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ తెలిపారు. ఈ మేళాలో 90 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులన్నారు.

December 28, 2024 / 04:04 AM IST

FLASH: హాల్ టికెట్లు విడుదల

TG: TET పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 2 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే పలు సాంకేతిక సమస్యల వల్ల జనవరి 11 ఉదయం, 20న మార్నింగ్, మధ్యాహ్నం సెషన్లకు హాజరుకానున్న అభ్యర్థుల హాల్ టికెట్లు రేపటి వరకు అందుబాటులో ఉండనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. 

December 27, 2024 / 02:02 PM IST

స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 5  ఐపీఓలు

ఐపీఓకు వచ్చిన ఐదు కంపెనీలు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అందులో మమతా మెషినరీ 147% ప్రీమియంతో రూ.600 వద్ద లిస్ట్ అవగా.. ఇష్యూ ధర రూ.243. ట్రాన్స్ రైల్ లైటింగ్ 37% ప్రీమియంతో రూ.590 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా.. ఇష్యూ ధర రూ.432. కాగా.. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ 39%, సనాతన్ టెక్స్‌టైల్స్ 32%, కాంకర్డ్‌ ఎన్విరో 18% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.

December 27, 2024 / 12:22 PM IST

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోల్చితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరగటంతో రూ.78,000 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.71,500 ఉంది. కాగా.. కిలో వెండి ధర లక్ష రూపాయలు ఉంది.

December 27, 2024 / 11:05 AM IST

విశాఖలో ఈనెల 28న జాబ్ మేళా

విశాఖ నగరంలోని మహారాణిపేట ఎన్ఎసీ కేంద్రంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళా రాష్ట్ర నైపుణ్యం అభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పలు ప్రైవేటు కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని తెలిపారు.

December 27, 2024 / 09:59 AM IST

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 409 పాయింట్లు బలపడి 78,881 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 23,883 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 85.34గా ఉంది. కాగా, అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నా.. మదుపర్ల కొనుగోళ్ల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

December 27, 2024 / 09:58 AM IST

రేపు జిల్లాలో మెగా జాబ్ మేళా

KMM: జిల్లాలోని బొమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ఛైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 16కంపెనీల బాధ్యులు పాల్గొని ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఈమేరకు 2020 నుండి ఇప్పటి వరకు బీటెక్, బీ పార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన పాల్గొనవచ్చని తెలిపారు. 

December 27, 2024 / 09:47 AM IST

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

HYD: జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో నేడు యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలకు కూడా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.

December 27, 2024 / 09:21 AM IST

నేడు జరిగే సెమిస్టర్ పరీక్ష వాయిదా!

KNR: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి మొదటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు.

December 27, 2024 / 08:56 AM IST

KU డిగ్రీ రీఅడ్మిషన్‌కు మరో అవకాశం: ప్రిన్సిపల్

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్య అభ్యసిస్తూ విద్యా సంవత్సరం పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసిన విద్యార్థులు 2, 4, 6వ సెమిస్టర్లలో రీ అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. జనవరి 3లోగా కళాశాలలో సంప్రదించి కాకతీయ విశ్వవిద్యాలయం రీ అడ్మిషన్ అనుమతి పొంది విద్యను కొనసాగించవచ్చన్నారు.

December 27, 2024 / 06:53 AM IST

28న కైకలూరులో ఉద్యోగ మేళా

W.G: కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్.జితేంద్ర గురువారం తెలిపారు. వరుణ్ మోటార్స్, మెడ్స్ ఫార్మసీ వంటి సంస్థల్లో 100 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. పదో తరగతి ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఫార్మశీ అర్హులు.

December 27, 2024 / 06:49 AM IST

‘పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధకనబరచాలి’

PPM: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మండల విద్యా శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ ఎంఈవోలతో సమీక్షించారు. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణతలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని అన్నారు.

December 27, 2024 / 06:48 AM IST