సైన్యంలో పనిచేసిన సిబ్బందికి కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగాల్లో మాజీ సైనికులు, అగ్నివీర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నారు. మాజీ సైనికులకు లెవెల్-1 పోస్టుల్లో 20%, లెవెల్-2 ఆ పైస్థాయి పోస్టుల్లో 10%, రిటైర్డ్ అగ్నివీర్లకు లెవెల్-1 పోస్టుల్లో 10%, లెవెల్-2 ఆ పైస్థాయి పోస్టుల్లో 5% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,160 పెరిగి రూ.1,64,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,900 పెరిగి రూ.1,51,000 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
DEiEd, DPSE కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన DEECET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఆసక్తి గలవారు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 21, 22 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మార్చి 5 నుంచి వెబ్సైట్లో ఉంటాయని కన్వీనర్ రమేష్ తెలిపారు. పరీక్ష ఫీజు రూ.500. SC/ST/PwDలకు రూ.450.
అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4 శాతంతో పోలిస్తే 0.4 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.6 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా వేసింది. అలాగే జులై-సెప్టెంబర్ త్రైమానికానికి వృద్ధి రేటును 8.2 శాతం నుంచి 8.4 శాతానికి పెంచింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBIలో క్లర్క్ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్ 21న మెయిన్ పరీక్ష జరిగింది. ఈ పోస్టులకు ఎంపికైన వారి రోల్ నంబర్లతో ప్రొవిజినల్ జాబితాను SBI అధికారులు తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
మీరు చేసే ప్రతి పెద్ద లావాదేవీపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్లు, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటివి పరిమితి దాటితే బ్యాంకులు ఐటీ శాఖకు సమాచారం ఇస్తాయి. మీ ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకపోతే ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండి, రిటర్న్స్ సక్రమంగా దాఖలు చేయడం మంచిది.
ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి SC కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. బోర్వెల్ సౌకర్యం లేకపోవడంతో నివాసితులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారంగా బోర్వెల్ ఏర్పాటు చేయాలని MLA హరీశ్ బాబును కోరారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారా మెడికల్ పోస్టులు పరీక్ష తేదీలను సవరించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మార్చి 10 నుంచి 12 వరకు జరగాల్సి ఉన్నాయి. కానీ, తాజా ప్రకటన ప్రకారం ఈ పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, 4 రోజుల ముందు అడ్మిట్ కార్ట్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని దక్కించుకునే రేసు నుంచి నెట్ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది. కొనుగోలు ఆఫర్ మొత్తాన్ని పెంచేందుకు నెట్ఫ్లిక్స్ ఆసక్తి చూపకపోవడంతో ఈ డీల్ నిలిచిపోయింది. దీంతో, ట్రంప్తో అనుబంధం ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థతో ఈ ఒప్పందం ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో కూడిన ఈ డీల్ ఇప్పుడు మీడియా రంగంలో హాట్ టాపిక్గా మారింది.
అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించనుందని ‘షెల్ ఇండియా’ ఓ నివేదిక విడుదల చేసింది. 2040ల్లో అమెరికాను, 2060ల్లో చైనాను ఇంధన గిరాకీలో భారత్ అధిగమించగలదని అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో సహజ వాయువు, LNG కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. వీటి గిరాకీ 50% లేదా అంతకంటే ఎక్కువ పెరగొచ్చని పేర్కొంది.
మాజీ సైనికులు, అగ్నివీరులకు అండగా నిలిచేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సేవలో రిటైర్డ్ అయిన సైనికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో భారత సైన్యంతో ఒక కొత్త సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, తక్షణమే 5,000 మందికి పైగా మాజీ సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో ‘పాయింట్స్మెన్’గా నియమించుకోనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, ‘బ్లాక్’ సీఈవో జాక్ డోర్సే కీలక ప్రకటన చేశారు. ఏఐ బూమ్ నేపథ్యంలో తమ కంపెనీలో 4000 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 40 శాతంగా ఉంది. ఈ నిర్ణయం చాలా కఠినమైనదని ఎక్స్లో పోస్ట్ చేశారు.
అమెరికా డిమాండ్స్కు ఆంథ్రోపిక్ నో చెప్పింది. ఏఐ టూల్ క్లాడ్ నుంచి రక్షణలను తొలగించమని ఆంథ్రోపిక్ సీఈవో వెల్లడించారు. యూఎస్ బెదిరింపులు తమ నిర్ణయాన్ని మార్చలేవని స్పష్టం చేశారు. కాగా, సైనిక ప్రయోజనాల కోసం ఎలాంటి షరతులు లేకుండా ఏఐ సాంకేతికతకు యాక్సెస్ ఇవ్వాలని అమెరికా రక్షణ మంత్రి గడువు విధించారు. లేకపోతే కాంట్రాక్ట్ నుంచి బయటకు వస్తామని హెచ్చరించారు.
AP: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్, తొమ్మిదో తరగతి విద్యార్థులకు SA-2 పరీక్షలు మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను RJDలు, డీఈవోలు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.