కియా మోటార్స్ 2024 జనవరిలో కొత్త ‘సోనెట్’ లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన కేవలం 11 నెలల్లో ఏకంగా లక్ష కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను పొందింది. కియా సోనెట్ మొత్తం అమ్మకాల్లో పెట్రోల్ మోడల్స్ 76 శాతం కాగా.. 24 శాతం మంది డీజిల్ కార్లు ఉన్నాయి. మరో 34 శాతం మంది ఆటోమాటిక్ IMT వేరియంట్స్ కొనుగోలు చేశారు.
యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 3 నుంచి 16 వరకు ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులపై ఫొటో, బార్కోడ్ లేకపోతే మరోసారి డౌన్లోడ్ చేసుకోవాలని యూజీసీ సూచించింది. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
NTR: మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. టెక్నో టాస్క్, బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు పాల్గొంటాయన్నారు.
KRNL: పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అభ్యర్థులకు సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా, డిసెంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు PMT/PET పరీక్షలు జరగనున్నాయి.
NGKL: పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అతిథి అధ్యాపకులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఎస్ఓ సువర్ణ తెలిపారు. ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించేందుకు ఆసక్తి ఉండి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. బీఈడీ, సంబంధించిన సబ్జెక్టుల్లో పీజీ పూర్తి చేసిన వారు అర్హులని ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవలన్నారు.
MBNR: ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు ఫిబ్రవరి 1వ తేదీ లోపు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సంక్షేమ అధికారులు తెలిపారు. 2025-26 సంవత్సర 5వ తరగతి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు గానూ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.100 చెల్లించాలని తెలిపారు.
E.G: జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో రాజానగరంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీన ఉద్యోగమేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరిచంద్రప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పెరుమాళరావు శనివారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో మూడు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. వివరాలకు నెంబర్9988853335 ద్వారా సంప్రదించాలన్నారు.
JN: జిల్లాలోని ఏబీవీ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల దరఖాస్తుల గడువును పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్, పొలిటికల్ సైన్స్ బోధించేందుకు 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ATP: మాజీ సైనికుల పిల్లలకు ప్రధానమంత్రి ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించినట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి. తిమ్మప్ప తెలిపారు. దరఖాస్తు గడువును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని ప్రిన్సిపల్ వీకే గీతాలక్ష్మి తెలిపారు. జనవరి 18న ఉదయం 11 గంటలకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9951091988 నంబరును సంప్రదించాలని సూచించారు.
ప్రకాశం: యర్రగొండపాలెం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిరుద్యోగులు గమనించి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఎంఫార్మసీ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ఈ నెల 27న రాష్ట్రప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఆ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను తిరిగి ఈ నెల 31వ తేదీన పెట్టనున్నారు.
ఖమ్మం: వృత్తి శిక్షణ కోసం జిల్లాలో అర్హులు జనవరి 6లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందించే శిక్షణకు 18-35 ఏళ్ల వయసు కలిగి ఉండి, ఇంటర్ ఆపైన చదివినవారు అర్హులన్నారు. హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జికూటివ్ రంగాల్లో 3 నెలల శిక్షణ ఉంటుందన్నారు.
NLG: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిఘా నీడలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ప్రతిపాదనలను వెంటనే బోర్డుకు పంపాలని ఈనెల 23న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 290 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ఫిబ్రవరి మొదటివారం ప్రారంభంకానున్నాయి.
ఖమ్మం: వైద్యారోగ్యశాఖలో ఎంఎల్ హెచ్ పి-19, బీడీకే మెడికల్ ఆఫీసర్-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ డాక్టర్ కళావతిబాయి తెలిపారు. తాత్కాలిక, కాంట్రాక్టు, ఒప్పంద పద్ధతిలో నియమించే ఈ పోస్టులకు జనవరి 3లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు.