CTR: APSSDC ఆధ్వర్యంలో చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి. పద్మజ తెలిపారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా ప్రకటించారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రకాశం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఏఎన్ఎం గ్రేడ్-3లకు ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న ఉద్యోగోన్నతుల కౌన్సె లింగ్ను వాయిదా వేశామని డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు చెప్పారు. కౌన్సెలింగ్ ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తామన్నారు. తేదీ మార్పును అభ్యర్థులు అందరూ గమనించాలని ఆయన సూచించారు.
ATP: గుత్తిలోని కేంద్రీయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ మల్కి సాబ్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీలోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయం వెబ్ సైట్ను ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
పల్నాడు: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈనెల 17 నుంచి టెన్త్ దూర విద్య హాల్టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్ల ద్వారా పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మన మిత్ర వాట్సప్ నంబర్ ద్వారా కూడా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్ హాల్టికెట్ల వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.
ADB: జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్ నగర్లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2025 అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 1వ తరగతి, బాల్వాటిక 1 నుంచి 3 స్థాయిల్లో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 7న ప్రారంభమైంది. మార్చి 21 రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అర్హత కలిగిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులు KVS అధికారిక వెబ్సైట్ kvsangathan.nic.inను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.
VSP: నేటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు రీజినల్ అధికారి మురళిదర్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ మహిళ కాలేజీలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సంస్కృతం పేపర్ మూల్యాంకనం చేయనున్నారు. వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
SKLM: జిల్లాలో ఉన్న శాఖా గ్రంథాలయాలలో సిబ్బంది గ్రంథాలయ సెస్ వసూలకు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.కుమార్ రాజు అన్నారు. గురువారం లావేరు శాఖా గ్రంధాలయాలో వార్షిక తనిఖీ నిర్వహించారు. గ్రంథాలయ సెస్సు వసూలులతోపాటు పాటు గ్రంథాలయంలో ధరావత్తుల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు.
NDL: డోన్ పట్టణంలోని మోడల్ స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఓసీ, బీసీ విద్యార్థుల రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.
VZM: ప్యాసింజర్ వాహనాలపై పలు రకాల టాక్స్లు వేస్తూ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ భారీగా పెంచి డ్రైవర్ల రక్తాన్ని పిల్చేస్తూ రక్తమాంసాలతో కూటమి పాలకుల దాహం తీర్చుకుంటారాని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మోటార్ కార్మికులు ఇచ్చిన పిలుపుతో మంగళవారం మయూర జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.
NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 8 ,9 తరగతుల బాలికలకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. ఈ నెల 4న పాఠశాల స్థాయిలో, 5న మండల స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు.
నెల్లూరు: మర్రిపాడు మండలం నందవరంలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. అర్హులైన వారు మార్చి 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.
AP: రాష్ట్రంలో ఈరోజు నుంచి ఇంటర్ సెకండ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు 1,535 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రాల టాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ATP: ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2 పరీక్ష జరగనుంది. జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,960 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పదో తరగతి అర్హతతో GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అనంతపురం డివిజన్లో 66, హిందూపురం డివిజన్లో 50 ఉద్యోగాలు ఉన్నాయి. 18-40ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. ఈ నెల 3లోపు దరఖాస్తు చేసుకోవాలి. https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేయొచ్చు.