• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

కేజీబీవీలో ప్రవేశాల దరఖాస్తులు ఆహ్వానం

KRNL: దేవనకొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 6వ తరగతి, 11వ తరగతుల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

March 29, 2025 / 04:57 PM IST

వాట్సాప్ స్టేటస్‌కు పాట ఎలా యాడ్ చేయాలంటే?

వాట్సాప్ స్టేటస్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకునే కొత్త ఆప్షన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, యాడ్ స్టేటస్‌పై క్లిక్ చేసి.. నచ్చిన ఫొటోను ఎంచుకోవాలి. దీంతో స్క్రీన్‌పై క్రాప్, స్టిక్కర్, టెక్స్ట్, ఎడిట్ ఆప్షన్లతో పాటు మ్యూజిక్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి నచ్చిన పాటను ఎంచుకోవచ్చు. అయితే ఫొటోకు 15 సెకన్లు, వీడియోకు 60 సెకన్ల వరకు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు.

March 29, 2025 / 11:21 AM IST

MBA,MCA పరీక్ష ఫలితాలు విడుదల

కృష్ణా: KRU పరిధిలో ఇటీవల నిర్వహించిన MBA,MCA కోర్సుల 1,3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలపై అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని KRU సూచించింది. రీవాల్యుయేషన్‌కై ఏప్రిల్ 15లోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 29, 2025 / 10:04 AM IST

రాజవొమ్మంగిలో రేపు జాబ్ మేళా

ASR: రాజవొమ్మంగిలో ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ఉపాధి APO రెడ్డిబాబు శుక్రవారం తెలిపారు. టెన్త్ ఆపై చదివిన, 18 -35 లోపు వయసు కలిగిన యువతీ యువకులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. ఉపాధి పనులు 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

March 28, 2025 / 04:40 PM IST

దేశవ్యాప్తంగా ర్యాపిడో పింక్ మొబిలిటీ సేవలు

దేశవ్యాప్తంగా ర్యాపిడో పింక్ మొబిలిటీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో 2 లక్షల మంది మహిళలను కెప్టెన్లుగా మార్చాలని యోచిస్తోంది. రాబోయే మూడేళ్లలో ఈ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మహిళా డ్రైవర్లతో ఈ సేవలను ప్రారంభించగా.. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

March 28, 2025 / 11:28 AM IST

పది పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద కట్టు దిట్టుమైన నిగా

NDL: జిల్లా కేంద్రమైన నంద్యాలలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద వన్ టౌన్, టు టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ఇందుకోసం ఆయా పరీక్ష కేంద్రాల వద్ద డోన్ కెమెరాలను ఉపయోగించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు.

March 27, 2025 / 05:20 PM IST

28న జాబ్ మేళా

ATP: జిల్లా నలంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నలంద కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హు లన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

March 26, 2025 / 10:51 AM IST

కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

NLR: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి జిల్లా సమగ్ర శిక్షా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తులు చేసుకుని అర్హులైన బాలికలు ఆరో తరగతి, ఇంటర్‌లో ప్రవేశం పొందవచ్చు. కోర్స్‌ను కేటాయించి 40 సిట్లు కేటాంచారు.

March 24, 2025 / 10:18 AM IST

ఈనెల 26న నర్సీపట్నంలో మెగా జాబ్ మేళా

అనకాపల్లి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 26న నర్సీపట్నం ఋషి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 15కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. పదవ తరగతి నుంచి ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగులు హాజరుకావాలని తెలిపారు.

March 23, 2025 / 08:17 AM IST

‘యువికా’కు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు: ఈ నెల 23వ తేదీలోపు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇస్రో ఆధ్వర్యంలో యువికా(యువ విజ్ఞాన కార్యక్రమం)కు దరఖాస్తు చేసుకోవాలని సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన వారికి స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్‌పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.

March 22, 2025 / 09:32 AM IST

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు.. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ పరీక్షకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

March 21, 2025 / 05:29 AM IST

కస్టమర్లకు షాకిచ్చిన రెనాల్ట్

ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నుంచి 2 శాతం దాకా ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

March 20, 2025 / 11:26 AM IST

పాలిటెక్నిక్ కళాశాలలో 21న జాబ్ మేళా

ATP: ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఆశ్రఫ్ అలీ చెప్పారు. ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పదో తరగతి నుంచి పీజీ దాకా చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాకు హాజరవుతారని తెలిపారు.

March 20, 2025 / 07:33 AM IST

రేపటి నుంచే 10th ఎగ్జామ్స్

NTR: జిల్లాలో టెన్త్ ఎగ్జామ్స్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు DEO U.V సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 31,231 మంది విద్యార్థులు 168 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. మొబైల్/ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

March 16, 2025 / 09:37 AM IST

నేటి నుంచి ఒక పూట బడులు ప్రారంభం

HYD: హైదరాబాదులో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలను ఒంటి పూట నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. అటు పాఠశాలలు కూడా నేటి నుంచి ఒంటి పూట నడవనున్నాయి.

March 15, 2025 / 08:09 AM IST