• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

పసిడి ప్రియులకు GOOD NEWS

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొంతమేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గగా రూ.70,900 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో రూ.77,350 ఉంది. ఇక కిలో వెండి ధర స్థిరంగా రూ.98,900 ఉంది.

December 24, 2024 / 04:15 PM IST

‘భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు’

KDP: రెవెన్యూ అధికారులు భూ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బోరెడ్డిగారిపల్లిలోని స్వగృహంలో మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని, వీఆర్ నుండి తహసీల్దార్ వరకు గ్రామాలలో పర్యటించి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.

December 24, 2024 / 02:57 PM IST

యువజన సమ్మేళనకు అరకు విద్యార్ధులు

VSP: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు NYK ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు కడపలో జరిగే అంతర జిల్లాల యువజన సమ్మేళనంలో పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ డా. నాయక్ తెలిపారు. యువ సమ్మేళనంలో విద్యార్ధులు పాల్గొనటం వలన వివిధ అంశాలపై అవగాహన కలుగుతుందని వైస్ ప్రిన్సిపాల్స్ డా పుష్పరాజు అన్నారు. ఎన్వైకే అధికారులకు కృతజ్ఞత తెలిపారు.

December 24, 2024 / 12:19 PM IST

టాటా గ్రూప్ నుంచి మరో ఐపీఓ!

టాటా గ్రూప్ నుంచి మరో ఐపీఓ రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనే టాటా క్యాపిటల్‌ను ఐపీఓకి తీసుకురానున్నట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ ఐపీఓ ద్వారా రూ.15 వేల కోట్లు సమీకరించనున్నట్లు సమాచారం. టాటా టెక్నాలజీస్ బంపర్ లిస్టింగ్ తర్వాత ఈ గ్రూప్ నుంచి రానున్న మరో సంస్థ ఇదే కావటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓపై మదుపర్లలో ఆసక్తి నెలకొంది.

December 24, 2024 / 12:10 PM IST

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..!

KRNL: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతూ సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు అధికారులు తెలిపారు. ‘నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించారు. వివిధ కారణాల వల్ల పరీక్ష ఫీజు చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సూచించారు.

December 24, 2024 / 07:46 AM IST

డిగ్రీ విద్యార్థులకు స్పెషల్ డ్రైవ్

SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 2015, 2016, 2017, 2018 అడ్మిట్ విద్యార్థుల 1వ, 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలకు గాను స్పెషల్ డ్రైవు నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఈ పరీక్షలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా జనవరి 18వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటాయని డీన్ పేర్కొన్నారు.

December 24, 2024 / 05:47 AM IST

నేటి నుండి యూనివర్సిటీకి పండగ సెలవులు

SKLM: ఎచ్చెర్ల లో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి ఈ నెల 24 నుంచి జనవరి 17 వరకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పి.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 18 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

December 24, 2024 / 05:18 AM IST

విద్యార్థులకు సైన్స్ పోటీలు

SKLM: టెక్కలిలో యురేకా సైన్స్ ఎక్స్పో-2025 పేరిట జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.కామేశ్వర రావు తెలిపారు. 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం-సుస్థిరాభివృద్ది, మూఢ నమ్మకాలు-శాస్త్రీయ దృక్పథం అనే అంశాలపై ప్రయోగాలను చేసి వీడియో రూపంలో 8500960840 పంపించాలని సూచించారు.

December 24, 2024 / 04:34 AM IST

నేటి నుంచి వర్సిటీకి పండుగ సెలవులు

SKLM: ఎచ్చెర్లలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి ఈ నెల 24 నుంచి జనవరి 17 వరకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ పి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 18 నుంచి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.

December 24, 2024 / 04:30 AM IST

జియో, వొడాఫోన్‌ ఐడియాకు మళ్లీ షాక్

జియో, వొడాఫోన్ ఐడియాకు మరోసారి షాక్ తగిలింది. జూలైలో చేపట్టిన ధరల పెంపు కారణంగా.. ఆ కంపెనీలు అక్టోబర్‌లోనూ మరోసారి పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయాయి. ఎయిర్‌టెల్ మాత్రం కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోగలిగింది. అలాగే, BSNL మరోసారి స్వల్పంగా  సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది. అక్టోబర్ నెలకు గానూ ట్రాయ్ వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది.

December 24, 2024 / 04:28 AM IST

ఎల్.ఎల్.బిలో 13 మందికి స్పాట్ అడ్మిషన్‌లు

SKLM: ఎచ్చెర్లలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో మూడేళ్ల ఎల్.ఎల్.బిలో 13 మిగులు సీట్లకు ఈ నెల 20న స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. 52 మంది దరఖాస్తు చేసుకోగా వీసీ కె.ఆర్. రజిని సోమవారం సీట్లు ఎలాట్ చేశారు. 13 సీట్లలో ఈడబ్ల్యూఎస్ సీట్లు రెండు ఉన్నాయి. లాసెట్ 2024 ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారం గా ప్రవేశాలు కల్పించారు.

December 24, 2024 / 04:27 AM IST

డ్యూయల్‌ సిమ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్!

టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వాయిస్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా సంస్థలకు ఆదేశించింది. ఇందుకోసం స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలంటూ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, BSNL సంస్థలకు సూచించింది. డ్యూయల్ సిమ్ వాడేవారికి ట్రాయ్ తాజా ఆదేశాల నేపథ్యంలో తక్కువ ధరలో ప్యాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

December 24, 2024 / 02:15 AM IST

పాప్‌కార్న్‌పై GST.. నెట్టింట మీమ్స్‌!

పాప్‌కార్న్‌పై GST కింద మూడు వేర్వేరు ట్యాక్స్ రేట్లు అమలు చేయడంపై నెట్టింట చర్చకు దారి తీసింది. ‘సాల్ట్ పాప్‌కార్న్ 5శాతం, క్యారమెల్ 18శాతం.. మరి రెండూ కలిసుంటే పరిస్థితి ఏంటి’ అంటూ నెటిజన్లు Xలో పోస్ట్ చేశారు. ‘ఇకపై సాల్ట్ పాప్‌కార్న్ కొనండి. మిగిలిన డబ్బు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టండి. 30 ఏళ్ల తర్వాత సంపదను ఊహించుకోండి’ అంటూ మరొకరు రాసుకొచ్చారు.

December 24, 2024 / 01:37 AM IST

నేడు బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామాలు బంగారం ధర రూ.71,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,450 ఉంది. అదేవిధంగా విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రామాలు బంగారం ధర రూ.71,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,450 ఉంది. కిలో వెండి ధర రూ.99,000గా ఉంది.

December 22, 2024 / 11:55 AM IST

అన్ని రంగాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న గణితం: ఎంఈవో

ASR: కొయ్యూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్‌లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కంప్యూటర్ నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో గణితం ప్రాధాన్యత సంతరించుకుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈవో ఎల్.రాంబాబు తెలిపారు. ముందుగా ఆయన ఉపాధ్యాయులతో కలిసి ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

December 22, 2024 / 09:06 AM IST