MBNR: ఉమ్మడి జిల్లాలోని గురుకులాలలో 5 వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరీక్షల కన్వీనర్ వర్షిని శనివారం పేర్కొన్నారు. 2025-26 విద్యా ఏడాదికి 5 తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ దరఖాస్తులు ఈనెల 21 నుండి ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
SRPT: తుంగతుర్తిలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అరుణ శ్రీ శుక్రవారం తెలిపారు. జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్-1, ఇంగ్లీష్ పీజీటీ-1, మాథ్స్ టీజీటీ-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
BDK: జిల్లా కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలలో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి బోధనా సిబ్బంది పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధనా సిబ్బంది ఔట్ సోర్సింగ్ పోస్టింగ్ కింద నియామకం ఉంటుందని, అభ్యర్థులను డెమో ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
SKLM: శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో టీచర్ పదోన్నతుల సీనియారిటీ జాబితాను డిఈఓ అధికారిక వెబ్ సైట్లో సిద్ధంగా ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్. తిరుమల చైతన్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో పాఠశాల సహాయకుల పోస్టుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు జాబితాను పొందుపరిచామన్నారు.
KMM: తిరుమలాయపాలెం FPCలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా తాత్కాలిక పద్ధతిన పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని FPC ఛైర్మన్ గోవింద కవిత ఓ ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ డిప్లొమా, తత్సమాన అర్హత కలిగి ఉండలన్నారు.
W.G: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, నేషనల్ కెరీర్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో నరసాపురంలోని వై.ఎన్ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోకమాన్ తెలిపారు. ఈ మేళాలో 70 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులైన వారిని అర్హులుగా పేర్కొన్నారు.
గ్లోబల్ టెక్ జెయింట్ గూగుల్ లేఆఫ్స్ ప్రకటించింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన సిబ్బందితో కొంతమందిని తొలగిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 10శాతం మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులపై కోతలు ఉంటాయని గూగుల్ సర్వ సభ్య సమావేశంలో పిచాయ్ సూచించినట్లు తెలుస్తోంది.
CAT 2024 ఫలితాలు విడుదలయ్యాయి. క్యాట్ 2024 ఫలితాలను IIM ప్రకటించింది. తుది ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను వెలువరించారు. అభ్యర్థులు https://iimcat.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 24, 2024న దేశవ్యాప్తంగా 389 సెంటర్లలో CAT 2024 పరీక్ష నిర్వహించారు.
అల్లూరి: అరకులోయ మండలంకు నాలుగు ఆయా పోస్టులు మంజూరైనట్లు సీడీపీవో కె శారదా తెలిపారు. మండలంలోని పద్మాపురం పంచాయితీ బొండంగూడ, లోతేరు పంచాయితీలో తోటవలస, లండిగుడ, మాదల పంచాయితీ కమలతోట గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఆయా గ్రామాల్లో స్ధిర నివాసితులైన వివాహితులు ఈనెల 31లోపు ధరఖాస్తులను ఐసిడిఎస్ ఆఫీసులో అందజేయాలన్నారు. ఈ పోస్టులకు పదవ తరగతి పాసైన వారు అర్హులన్నారు.
సూర్యపేట జిల్లా చివ్వెంలకు చెందిన సోమిరెడ్డి తెలంగాణా సంక్షేమ గిరిజన మినీ బాలికల గురుకుల పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. శుక్రవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వేముల చిన్న, జాఫర్ ఖాన్, కొణతం వెంకట్ రెడ్డి, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.
సంగారెడ్డిలోని బాబానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి విద్యాసాగర్ శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల చదువు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM మనోహర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. నిన్నటితో పోల్చితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,400గా ఉంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.76,860గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ మేరకు కిలో వెండి ధర రూ.1000 తగ్గడంతో రూ.98వేలుగా కొనసాగుతోంది.
KKD: ఏలేశ్వరం వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మినీ ఉద్యోగ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కొండలరావు, ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులై 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 8688977277 నంబర్ను సంప్రదించాలన్నారు.
ASF: కాగజ్నగర్ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్లం, చరిత్ర, కంప్యూటర్ సైన్స్, బోటనీ, కామర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హులైన వారు ఈనెల 27న సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కృష్ణా: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబర్-2024లో నిర్వహించిన M.SC. నానోటెక్నాలజీ 1వ సెమిస్టర్, సెప్టెంబర్-2024లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.