ATP: ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2 పరీక్ష జరగనుంది. జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,960 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పదో తరగతి అర్హతతో GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అనంతపురం డివిజన్లో 66, హిందూపురం డివిజన్లో 50 ఉద్యోగాలు ఉన్నాయి. 18-40ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. ఈ నెల 3లోపు దరఖాస్తు చేసుకోవాలి. https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేయొచ్చు.
ASR :రేపు నిర్వహించనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంచినట్లు గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్టీపీ రాఘవాచార్యులు తెలిపారు. ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, చింతూరులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.
VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లి వద్ద ఉన్న తాండ్రపాపారాయ పాలిటెక్నికల్ కళాశాలలో మార్చి 1వ తేదీన క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ భాస్కరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ చదువుతున్న వారంతా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చన్నారు.
VSP: గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీలలో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. సుమారు 49ఐటి కంపెనీలలో 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. 2024-25లో పాస్ అయిన వారు మార్చి 3లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
ప్రకాశం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జె.రవితేజ తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్, సింధూజా మైక్రో క్రెడిట్ లిమిటెడ్, పేటీఎం తదితర కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం రెడ్డి పేట ఎంపీపీ స్కూల్లో అన్యమత ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ఎం సుబ్రహ్మణ్యంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హెచ్ఎం ను సస్పెండ్ చేసేదాకా విద్యార్థులను స్కూలుకు పంపమని తల్లిదండ్రులు వివరించారు. దీనిపై విచారణ అనంతరం హెచ్ఎం ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రకాశం: త్వరలో పబ్లిక్ పరీక్షలు రాయనున్న పదవ తరగతి విద్యార్థులకు మార్చి 3వ తేదీ నుంచి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. 13వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాలన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలను మరింత ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాయి. సెన్సెక్స్ 851.56 పాయింట్ల నష్టంతో 74,459 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 250.55 పాయింట్లు తగ్గి 22,545 వద్ద కొనసాగుతోంది.
PPM: 3,4,5వ తరగతులు గల ప్రాథమిక పాఠశాల నుంచి ప్రైమరీ పాఠశాలకు తరగతుల విద్యార్థులను విలీనం చేయటం వలనవిద్యా వ్యవస్థ కుంటుపడుతోందని ట్రైబుల్ రైట్స్ ఫారం అధ్యక్షులు ఇంటికుప్పల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఎలిమెంటరీ స్కూల్ లేకపోతే విద్యార్థులు చదువుకు దూరమవుతారు అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలి అన్నారు.
ఆర్థిక అంశాలపై నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత.. ఆర్థిక రంగ సంస్థలకు ఉందని RBI డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర రావు అన్నారు. హామీరహిత రుణాల మంజూరు పెరగటం, డెరివేటివ్స్ ట్రేడింగ్తో చిన్న మదుపర్లు నష్టాలపాలవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాల కోసం ఆశపడితే ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https:// www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని సూచించారు.
W.G: నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ కె.శైలజ శనివారం తెలిపారు. మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 5,6,7,8,9వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు
వినియోగదారులకు SBI గుడ్న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునేవారికి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)ను తగ్గించింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. RBI రెపో రేటును 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు SBI తెలిపింది.
HYD: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్థానిక ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ తో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇతర సందేహాల కొరకు office@des.iith.ac.in మెయిల్ చేయాలన్నారు.