NLR: ASపేటలో ఉన్న ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 2026-27 ఏడాది ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ కే. శ్రీదీప్ కోరారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ రూ. 200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 125 ఆన్ లైన్లో రుసుము చెల్లించి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.