KRNL: ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ పోస్టులకు అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ S.శివారెడ్డి తెలిపారు. PGలో 55% మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి కళాశాలలో డెమో ఇవ్వాలన్నారు.