• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

BREAKING: గ్రూప్-1పై పిటిషన్లు కొట్టివేత

TGPSC గ్రూప్-1పై అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీవో 29పై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో ఫలితాలు విడుదల చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కాగా, జీవో 29 ప్రకారం గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. వీలైనంత త్వరగా హైకోర్టు విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.

December 26, 2024 / 12:12 PM IST

ప్రధాని మోదీతో చర్చకు విద్యార్థుల పేర్లు నమోదు

ప్రకాశం: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చలో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లను జనవరి 14వ తేదీలోపు ఆన్ లైన్‌లో నమోదు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు చెప్పారు. ఆరు నుంచి 12 తరగతుల విద్యార్థులందరూ అర్హులేనని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ చర్చలో పాల్గొని పరీక్షలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడతారన్నారు.

December 26, 2024 / 10:34 AM IST

రేపు అమలాపురంలో మినీ జాబ్ మేళా

కోనసీమ: అమలాపురం నల్లవంతెన వద్ద మిరియం కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ శుక్రవారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎమ్.తమ్మేశ్వరరావు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగులు ఇంటర్వ్యూకు బయోడేటా, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.

December 26, 2024 / 10:11 AM IST

అంగన్వాడీల్లో బోధనకు తొలగిన ఆటంకాలు

KRNL: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. గత వైకాపా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలకు కొత్త పుస్తకాలు, పలకలు ఇవ్వలేదు. ఇంతకాలం పాత వాటితోనే కాలం నెట్టుకొచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం చిన్నారుల్లో సృజనాత్మకత వెలికితీసేలా ముద్రించిన నూతన పుస్తకాలను సరఫరా చేస్తోంది.

December 26, 2024 / 10:03 AM IST

EPFO: కొత్తగా 7.50 లక్షల మందికి పీఎఫ్‌

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో మరింత మంది సభ్యులు పెరిగారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో 13.41 లక్షల మంది సభ్యుల నికర చేరికను EPFO నమోదు చేసింది. 2024 అక్టోబర్‌లో కొత్తగా దాదాపు 7.50 లక్షల మంది సభ్యులు చేరారు. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగి ప్రయోజనాలపై పెరిగిన అవగాహన వల్ల EPFO పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు.

December 25, 2024 / 10:30 PM IST

Whatsapp Update: సూపర్ ఫీచర్

వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ వచ్చింది. ఏదైనా డాక్యుమెంట్‌ను స్కాన్ చేయాలంటే నేరుగా వాట్సాప్‌లోనే స్కాన్ చేసి షేర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ రాగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ ఓపెన్ చేసి, ‘SCAN DOCUMENT’పై క్లిక్ చేస్తే స్కాన్ చేసుకోవచ్చు. PDF, బ్లాక్&వైట్ మోడ్ వంటి ఆప్షన్లు ఉంటాయి.

December 25, 2024 / 09:30 PM IST

లక్కీ ఉద్యోగులు.. ఒక్కొక్కరికి రూ.లక్ష

ఫిన్‌టెక్ యునికార్న్ రేజర్‌పే తన 3,000 మంది సిబ్బందికి రూ. 1 లక్ష విలువైన ఎంప్లాయీస్‌ స్టాక్ ఆప్షన్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. గతంలో పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు మాత్రమే స్టాక్ ఆప్షన్‌లను అందించామని, కానీ ఈ సారి మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్‌లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

December 25, 2024 / 04:53 PM IST

ALERT: ఇంటర్ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్

AP: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మరోసారి గడువు పొడిగించింది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు తేదీని ఈనెల 24 ఆఖరు గడువని స్పష్టం చేసింది. ఫీజు గడువు ముగియడంతో ఈనెల 31వ తేదీ వరకు తత్కాల్ పథకం కింద ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు.

December 25, 2024 / 03:46 PM IST

BUMPER OFFER: రూ.27వేలకే ఐఫోన్

ఐఫోన్ 15 128GB రూ.69,990. ఈ ప్రీమియం డివైజ్ పలు డిస్కౌంట్లు, ఎక్స్ఛ్ంజ్ ఆఫర్లు కలుపుకొని రూ.26,999కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్‌లో గరిష్ఠంగా రూ.31,500 వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. అందుకోసం మన ఐఫోన్ 14ను ఎక్స్ఛ్ంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.26,999కే మీ సొంతం చేసుకోవచ్చు.

December 25, 2024 / 02:40 PM IST

ఈనెల 30 వరకు ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు

KMM: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన ప్రస్తుత విద్యాసంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశముందని డీఈఓ సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎం. పాపారావు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల కోసం ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించినందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

December 25, 2024 / 10:39 AM IST

ALERT: నిరుద్యోగులకు శుభవార్త

W.G: పాలకొల్లులోని బి.ఆర్.ఆర్ & జి.వి.ఆర్ ఛాంబర్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 27న క్యాంపస్ ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దివిస్ లేబరేటరీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, బీటెక్ కెమిస్ట్రీ అర్హతలతో ట్రైనీ సూపర్వైజర్స్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయన్నారు.

December 25, 2024 / 09:17 AM IST

‘ప్రశాంతంగా ముగిసిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు’

SKLM: శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని యూనివర్సిటీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈనెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 54 పరీక్ష కేంద్రాలలో 1,0051 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వెల్లడించారు.

December 25, 2024 / 07:07 AM IST

28న ఐటీఐలో మినీ జాబ్ మేళా

KKD: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి సంస్థ, గవర్నమెంట్ ఐటీఐ ఆధ్వర్యంలో ఈ నెల 28న కాకినాడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రముఖ కంపెనీలు హాజరవుతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18-35 సంవత్సరాల వయసు గల వారు అర్హులన్నారు.

December 25, 2024 / 06:50 AM IST

గురుకుల విద్యార్థులకు బిగ్ అలర్ట్

TG: గురుకుల ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు 2025 ఫిబ్రవరి 5 ఆఖరు తేదీ కాగా.. పరీక్ష ఫిబ్రవరి 23న జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదల కాగా, 23వ తేదీ నుంచి ఆన్‌లైన్ అఫ్లికేషన్ ప్రారంభమైంది. కాగా.. ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

December 25, 2024 / 05:56 AM IST

ఈనెల 27న జిల్లాలో దివ్యాంగులకు ఉద్యోగ మేల

KNR: జిల్లాలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 27న దివ్యాంగుల కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నామని, జిల్లా సంక్షేమ అధికారి కె. సబితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని, 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.

December 25, 2024 / 04:34 AM IST