NCERT సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 8వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేస్తూ కొత్త అంశాలను చేర్చింది. “న్యాయ వ్యవస్థ” అనే అధ్యాయంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని తొలిసారిగా పరిచయం చేసింది. విద్యార్థులకు దేశంలోని న్యాయ వ్యవస్థలో సవాళ్లు, లోపాలను కూడా వివరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.