AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.