• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

పది పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద కట్టు దిట్టుమైన నిగా

NDL: జిల్లా కేంద్రమైన నంద్యాలలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద వన్ టౌన్, టు టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ఇందుకోసం ఆయా పరీక్ష కేంద్రాల వద్ద డోన్ కెమెరాలను ఉపయోగించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు.

March 27, 2025 / 05:20 PM IST

28న జాబ్ మేళా

ATP: జిల్లా నలంద డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, నలంద కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హు లన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

March 26, 2025 / 10:51 AM IST

కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

NLR: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి జిల్లా సమగ్ర శిక్షా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తులు చేసుకుని అర్హులైన బాలికలు ఆరో తరగతి, ఇంటర్‌లో ప్రవేశం పొందవచ్చు. కోర్స్‌ను కేటాయించి 40 సిట్లు కేటాంచారు.

March 24, 2025 / 10:18 AM IST

ఈనెల 26న నర్సీపట్నంలో మెగా జాబ్ మేళా

అనకాపల్లి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 26న నర్సీపట్నం ఋషి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 15కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. పదవ తరగతి నుంచి ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగులు హాజరుకావాలని తెలిపారు.

March 23, 2025 / 08:17 AM IST

‘యువికా’కు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు: ఈ నెల 23వ తేదీలోపు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇస్రో ఆధ్వర్యంలో యువికా(యువ విజ్ఞాన కార్యక్రమం)కు దరఖాస్తు చేసుకోవాలని సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన వారికి స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్‌పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.

March 22, 2025 / 09:32 AM IST

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు.. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ పరీక్షకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

March 21, 2025 / 05:29 AM IST

కస్టమర్లకు షాకిచ్చిన రెనాల్ట్

ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నుంచి 2 శాతం దాకా ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

March 20, 2025 / 11:26 AM IST

పాలిటెక్నిక్ కళాశాలలో 21న జాబ్ మేళా

ATP: ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఆశ్రఫ్ అలీ చెప్పారు. ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పదో తరగతి నుంచి పీజీ దాకా చదివిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాకు హాజరవుతారని తెలిపారు.

March 20, 2025 / 07:33 AM IST

రేపటి నుంచే 10th ఎగ్జామ్స్

NTR: జిల్లాలో టెన్త్ ఎగ్జామ్స్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు DEO U.V సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 31,231 మంది విద్యార్థులు 168 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. మొబైల్/ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

March 16, 2025 / 09:37 AM IST

నేటి నుంచి ఒక పూట బడులు ప్రారంభం

HYD: హైదరాబాదులో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలను ఒంటి పూట నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. అటు పాఠశాలలు కూడా నేటి నుంచి ఒంటి పూట నడవనున్నాయి.

March 15, 2025 / 08:09 AM IST

ఈనెల 17న చిత్తూరులో జాబ్ మేళా

CTR: APSSDC ఆధ్వర్యంలో చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి. పద్మజ తెలిపారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా ప్రకటించారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 14, 2025 / 07:50 PM IST

గ్రేడ్ 3 ఏఎన్ఎంల కౌన్సెలింగ్ 17వ తేదీకి వాయిదా

ప్రకాశం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఏఎన్ఎం గ్రేడ్-3లకు ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న ఉద్యోగోన్నతుల కౌన్సె లింగ్‌ను వాయిదా వేశామని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు చెప్పారు. కౌన్సెలింగ్ ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తామన్నారు. తేదీ మార్పును అభ్యర్థులు అందరూ గమనించాలని ఆయన సూచించారు.

March 12, 2025 / 07:02 AM IST

1వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: గుత్తిలోని కేంద్రీయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ మల్కి సాబ్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీలోపు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్రీయ విద్యాలయం వెబ్ సైట్‌ను ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

March 10, 2025 / 01:28 PM IST

ఈనెల 17నుంచి దూరవిద్య హాల్‌టికెట్లు పంపిణీ  

పల్నాడు: ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈనెల 17 నుంచి టెన్త్ దూర విద్య హాల్‌టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్ల ద్వారా పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మన మిత్ర వాట్సప్ నంబర్ ద్వారా కూడా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్ హాల్‌టికెట్ల వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.

March 10, 2025 / 08:05 AM IST

ఈ నెల 16న ఈఎంఆర్ఎస్ ప్రవేశ పరీక్ష

ADB: జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్ నగర్‌లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు.

March 9, 2025 / 09:18 AM IST