ఒప్పంద ప్రాతిపదికన IIT మద్రాస్లో 3 సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు సప్లై డిజైన్, మాగ్నెటిక్ కాంపోనెంట్ డిజైన్ PCB లేఔట్ తయారీలో నైపుణ్యం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు కనీస జీతం రూ.లక్ష. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
TG: హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఫిన్టెక్ సంస్థ ఫోన్ పే రూపే ఆన్-ది-గో కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్డు ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. దీనిని హైదరాబాద్ మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద విక్రయించవచ్చు. ఈ కార్డులో గరిష్టంగా రూ.2000 వరకు బ్యాలెన్స్ వేసుకోవచ్చు. ఒకేసారి రూ.500 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు.
అమెరికాలో రిలయన్స్ తన తొలి రిఫైనరీని నిర్మించనుంది. ఈ మేరకు US ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ప్రకారం 125 బిలయన్ డాలర్ల విలువైన 1.2 మిలియన్ బ్యారెళ్ల అమెరికా లైట్ షెల్ చమురును కొనుగోలు చేసి ప్రాసెస్ చేయనుంది. రోజుకు 18.4 మి బ్యారెళ్లను ప్రాసెస్ చేసేలా రిఫైనరీని నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
టెక్ బ్రాండ్ ఐటెల్ కొత్త బడ్జెట్ ఫోన్ ఐటెల్ జెనో 100ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మిలిటరీ-గ్రేడ్ ఫోన్ 1.2 మీటర్ల ఎత్తు నుండి కిందపడ్డ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నెట్వర్క్ లేకుండా కూడా కాల్స్ చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్లో 5000mAh బ్యాటరీ అందించింది. Itel Zeno 100 భారతదేశంలో 2 వేరియంట్లలో వస్తుంది.
* 18001801503 లేదా 1500 నంబర్కు కాల్ చేయండి.* కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ను కవచ్ ఫీచర్ యాక్టివేట్ చేయాలని అడగండి.* వారు మీకు 10 అంకెల తాత్కాలిక నంబర్ ఇస్తారు.* మీఫోన్ రీఛార్జి కోసం ఈ తాత్కాలిక నంబర్ను వాడండి.* BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
ప్రభుత్వరంగ సంస్థ IRCONలో 13 వర్క్స్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి(MAR 13)తో ముగియనుంది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ గల 30 ఏళ్లలోపువారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ వివరాలతో నింపి, గెజిటెడ్ సంతకం ఉన్న ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఢిల్లీలోని ICRON కార్యాలయానికి ఈ నెల 20 లోపు పోస్ట్ చేయాలి. ప్రారంభ జీతం రూ.36 వేలు(ఏటా 5% ఇంక్రిమెంట్.
ప్రభుత్వ రంగ సంస్థ RITES లిమిటెడ్లో 3 డైనమిక్ ప్రొఫెషనల్స్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు రేపటితో ముగియనుది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా నెలకు రూ.40,000-1,40,000 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం రూ.7 నుంచి రూ.10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో రూ.913కు చేరింది. 1990లో రూ.120, 2010లో రూ.400గా ఉన్న ధర ఇవాళ సామాన్యుడిపై భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు, ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది.
నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ(GMC)లో 62 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ తదితర పోస్టులు ఉండగా.. MD/MS/DNB/NMC రూల్స్ ప్రకారం అర్హత, TG మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ గలవారు అర్హులు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారంలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ నెల 16న ప్రిన్సిపాల్ ఛాంబర్లో ఇంటర్వ్యూ ఉంటుంది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.850 పెరిగి రూ.1,49,700గా పలుకుతోంది. మరోవైపు వెండి ధర కిలోపై రూ.100 పెరిగి రూ.3,00,100కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా అరికట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈనెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. అందులో ప్రధానంగా ఫీజుల నియంత్రణపై ఉన్నట్లు సమాచారం.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో 3 జాయింట్ అడ్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళే ఆఖరు రోజు. డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 65 ఏళ్లు కాగా ఎంపికైనవారికి నెలకు రూ.1,75,000 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సత్యసాయి: పరిగి మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ నరేంద్ర తెలిపారు. 5వ తరగతి, ఇంటర్లో చేరాలనుకునే విద్యార్థులు ఈనెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 24న నిర్వహించే ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లోని ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(IS) ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ విభాగాల్లో 116 పోస్టులకు అప్లికేషన్ గడువు ఈ రోజుతో ముగియనుంది. 12 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, 104 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉండగా.. BE/BTech/CAలో ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం గలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. UR/EW/OBCలకు పరీక్ష ఫీజు రూ.750. SC/ST/PwBDలకు ఫీజు లేదు.