GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఎపీపీసెట్ -2025 పరీక్షల మొదటి రోజు సోమవారం 400 మంది పురుష అభ్యర్థులు హాజరయ్యారని వర్సిటీ VC గంగాధరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య కామన్ ఎంట్రన్స్ పరీక్షలు (APPE Set-2025) నేటి నుంచి ఈనెల 26 వరకు జరుగుతాయన్నారు. సుమారు 2 వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు.
SKLM: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed అలాగే B.P.Ed & D.P.Ed కోర్సులకు సంబంధించి 2వ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువు సోమవారంతో ముగిస్తుంది. ఈ సందర్భంగా వీటి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్ష ఫీజు రూ.1305తో కలిపి మొత్తం రూ.1,335/-లు చెల్లించాలని వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్. ఉదయ్ భాస్కర్ తెలిపారు.
MBNR: జడ్చర్ల పట్టణంలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న యాబై సెల్ ఫోన్లను సీఐ కమలాకర్ ఆదివారం బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్ ద్వారా ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా కేసులను పోలీసులు ఛేదించి ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు నేడు యజమానులకు అందజేశారు.
WG: మొగల్తూరు గ్రామంలో చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీ పెనుమత్స రంగరాజు జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొగల్తూరు మండల తాసిల్దార్ కే. రాజ్ కిషోర్, ఎంపీడీఓ సీహెచ్ త్రిశూల పాణి, ప్రధానోపాధ్యాయులు వర్గమాన రవిశంకర్ ఇతర ఉద్యోగులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
KMM: గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది నుంచి BBA(బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) అనే కొత్త గ్రూప్ను చేర్చినట్లు ప్రిన్సిపల్ రజిత తెలిపారు. ఈ గ్రూప్లో అడ్మిషన్ పొందడానికి ఇంటర్లో 40% మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దోస్త్ ద్వారా ఈనెల 25లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
NLG: దేవరకొండకి చెందిన బైక్ రైడర్ ఆజిజ్ను స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఏప్రిల్ 18న ఆల్ ఇండియా రైడ్ యాత్ర ప్రారంభించి 27 వేల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి దేవరకొండకు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు తిరిగి దేవరకొండకు చేరుకున్నాడని తెలిపారు.
WGL: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల డిగ్రీ మూడో సంవత్సరం 6వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డా.వి.పూర్ణచందర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో వెబ్ సైట్ సందర్శించి హాల్ టికెట్ పొందవచ్చని సూచించారు.
KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో LLB 3, 5 సంవత్సరాల సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 3వ సంవత్సరంలో 6వ సెమిస్టర్కు 245 మంది పరీక్షా దారుల్లో 243 హాజరయ్యారు. 5వ సంవత్సరంలో 10వ సెమిస్టర్కు 31 మందిలో 29 మంది హాజరయ్యారు. ఉస్మానియా బీఈడీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇద్దరు నకిలీ పరీక్షార్థులను గుర్తించి డిబార్ చేశారు.
SRPT: స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ అన్నారు. ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్లలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
MBNR: బాలికల ప్రభుత్వ పరిశ్రామిక శిక్షణ సంస్థ(ITI)లో నూతన విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోపాల్ నాయక్ తెలిపారు. అర్హత గలవారు ఈ నెల 21లోగా https://iti.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ACT, ITIలలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, బాలికలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KNR : జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఈసెట్ కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైంది. అని కళాశాల ప్రిన్సిపాల్ డి. శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈసెట్ కౌన్సిలింగ్ లో బాగంగా మొదటి రోజు స్లాట్ బుక్ చేసుకున్న 168 మంది విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినట్లుగా తెలిపారు.
KKD: ఈనెల 19న కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ పీడీ లచ్చారావు మంగళవారం తెలిపారు. తునిలో ఉద్యోగాలు కల్పించేందుకు డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీ ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందన్నారు. 2019-24 మధ్య బీఎస్సీ, డిప్లమో, బీటెక్లో ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.
ASR: అరకులోయ మండలం రవ్వలగూడ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శెట్టి అర్జున్ సోమవారం రాత్రి మృతి చెందాడు. డుంబ్రిగుడ మండలం గుంటగన్నెల జాకరవలస గ్రామానికి చెందిన ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరయ్యారు.
BHNG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా – ఈ కేసు విచారణకు వెళ్తూ ఏదో యుద్దానికి వెళ్లినట్లు KTR ట్వీట్లు చేస్తున్నారని తెలిపారు. జైలుకు వెళ్తే సింపతితో సీఎం అవుతా అని ఆయన కలలు కంటున్నారని, మహేష్ బాబు లాగా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు.
KMRD: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 3,453 మంది విద్యర్థులు పరీక్షలు రాయగా అందులో 1,957 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్లో 4,363 మంది పరీక్ష రాయగా 2,442 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.