TG: రేపు పది ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈసారి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. రేపు దాదాపు 5 లక్షల మంది భవితవ్వం తేలనుంది. కాగా, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిపిందే. మీ ఫలితాలను HIT TV యాప్లో అందరికంటే ముందుగా తెలుసుకోండి.
కృష్ణ: నూజివీడు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధాన అధికారి దేవరకొండ భూషణం తెలిపారు. నూజివీడులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. 8వ తరగతి నుండి టెన్త్ క్లాస్ వరకు అర్హత కలిగిన వారు ఈ నెల 29 నుండి మే 24వ తేదీలోపు https//itiadmissions.ap.gov.in/iti/login.do ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చన్నారు.
BHPL: గణపురం క్రాస్ గాంధీనగర్ మహాత్మ జ్యోతిబా ఫూలే (ప్రస్తుతం లింగాల వద్ద) ఉన్న పాఠశాలలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ జీ.విజయ తెలిపారు. జిల్లాలోని 5 ఇంటర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో వివిధ గ్రూపులల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రకాశం: కంభంలోని మండల పరిషత్ కార్యాలయంలో కిషోర బాలిక వికాసం మీటింగ్ను సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సమ్మర్ క్యాంపు May 2నుండి జూన్ 10 వరకు బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించుటకు మరియు బాల్యవివాహాలను నిరోధించేలా పిల్లలు, తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరభద్రచారి, ఎంఈఓ మాల్యాద్రి పాల్గొన్నారు.
కృష్ణా: KRU పరిధిలోని కళాశాలల్లో MBA, MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. మే 8 నుంచి 22 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యూనివర్శిటీ పరిధిలోని 5 పరీక్షా కేంద్రాలల్లో నిర్వహిస్తామని యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 22న జరిగిన RRB జేఈ సీబీటీ-2 రెండో షిఫ్ట్ పరీక్షను RRB రద్దు చేసింది. తొలి షిఫ్టులో వచ్చిన ప్రశ్నలు కొన్ని 2వ దాంట్లో రిపీట్ కావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని వివరించింది. రద్దయిన పరీక్షను త్వరలో నిర్వహిస్తామని RRB వెల్లడించింది. 7,951 పోస్టులకు సంబంధించి సీబీటీ-1 పరీక్ష రాసి అర్హత సాధించిన 20,792 మంది తాజాగా సీబీటీ-2 రాశారు.
MBNR: తిరుమల హిల్స్లోని తెలంగాణ గిరిజన గురుకుల (మహిళ) డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాసంతి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. BZC, MBZC, MPC, MPCS, BA,B.COM ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభించామన్నారు. సమాచారం కోసం www.ttwrdcs.ac.in/mahabubnagar వెబ్సైట్కి, లేదా 8142259448 నంబర్ని సంప్రదించాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ 24 క్యారెట్ల, 22 క్యారెట్ల పసిడి ధరలు రూ.30 చొప్పున తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,210 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,020కు చేరింది. కాగా.. కిలో వెండి ధర రూ.1,10,900గా ఉంది.
W.G: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో కాపులకు EWS కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 103 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాపుల అభ్యున్నతికి తోడ్పడవల్సిందిగా ఆ వర్గం తరఫున కోరుతున్నానని పేర్కొన్నారు.
MHBD: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజిత తెలిపారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో డెలివరీ బాయ్స్గా పనిచేయుటకు ఉద్యోగాలు ఉన్నాయని.. పదవ తరగతి, ఆ పైన విద్యార్హత కల్గిన పురుష అభ్యర్థులకు జాబ్ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 8374054911 నెంబర్ ద్వారా సంప్రదించాలన్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తమ యూజర్లకు సరికొత్త ఫీచర్ పరిచయం చేసింది. ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వ్యక్తిగత, గ్రూప్ చాట్స్లో మరింత ప్రైవసీని మెయిన్టైన్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంచినట్లు వాట్సాప్ తెలిపింది.
ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక జారీ చేసింది. రిమోట్ ప్రాంతాల నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కోరింది. ఇకపై ఇంటి నుంచి పనిచేయటం కుదరని స్పష్టం చేసింది. రిపోర్టు చేయని పక్షంలో కంపెనీని వీడేందుకు సిద్ధం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. AIపై అత్యధికంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని కంపెనీ యోచిస్తోంది.
AP: కాసేపట్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. కాగా.. విద్యార్థులు తమ ఫలితాల వివరాలను HIT TV యాప్లో చూసుకోవచ్చు.
SKLM: ఈ ఏడాది UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా యువకుడు బన్న వెంకటేశ్ ఆల్ ఇండియా 15వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయనను ఫోన్లో అభినందించారు. వెంకటేశ్ తండ్రితో కూడా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకి గర్వకారణంగా ఉందని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలన్నారు.
HYD: ఉస్మానియా యూనివర్సిటీ, JNTUH, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీల్లో పలు పోస్టుల నియామకాల కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారి తెలిపారు. వర్సిటీల్లో ఈ మేరకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఎంపికలపై వీలైనంత త్వరగా చర్యలు చేపడుతున్నారు.