SKLM: జిల్లాలో ఉన్న శాఖా గ్రంథాలయాలలో సిబ్బంది గ్రంథాలయ సెస్ వసూలకు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.కుమార్ రాజు అన్నారు. గురువారం లావేరు శాఖా గ్రంధాలయాలో వార్షిక తనిఖీ నిర్వహించారు. గ్రంథాలయ సెస్సు వసూలులతోపాటు పాటు గ్రంథాలయంలో ధరావత్తుల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు.
NDL: డోన్ పట్టణంలోని మోడల్ స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఓసీ, బీసీ విద్యార్థుల రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.
VZM: ప్యాసింజర్ వాహనాలపై పలు రకాల టాక్స్లు వేస్తూ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ భారీగా పెంచి డ్రైవర్ల రక్తాన్ని పిల్చేస్తూ రక్తమాంసాలతో కూటమి పాలకుల దాహం తీర్చుకుంటారాని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మోటార్ కార్మికులు ఇచ్చిన పిలుపుతో మంగళవారం మయూర జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.
NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 8 ,9 తరగతుల బాలికలకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. ఈ నెల 4న పాఠశాల స్థాయిలో, 5న మండల స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు.
నెల్లూరు: మర్రిపాడు మండలం నందవరంలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. అర్హులైన వారు మార్చి 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.
AP: రాష్ట్రంలో ఈరోజు నుంచి ఇంటర్ సెకండ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు 1,535 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రాల టాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ATP: ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2 పరీక్ష జరగనుంది. జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,960 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పదో తరగతి అర్హతతో GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అనంతపురం డివిజన్లో 66, హిందూపురం డివిజన్లో 50 ఉద్యోగాలు ఉన్నాయి. 18-40ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. ఈ నెల 3లోపు దరఖాస్తు చేసుకోవాలి. https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేయొచ్చు.
ASR :రేపు నిర్వహించనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంచినట్లు గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ ఎన్టీపీ రాఘవాచార్యులు తెలిపారు. ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, చింతూరులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.
VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లి వద్ద ఉన్న తాండ్రపాపారాయ పాలిటెక్నికల్ కళాశాలలో మార్చి 1వ తేదీన క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ భాస్కరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ చదువుతున్న వారంతా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చన్నారు.
VSP: గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీలలో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. సుమారు 49ఐటి కంపెనీలలో 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. 2024-25లో పాస్ అయిన వారు మార్చి 3లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
ప్రకాశం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జె.రవితేజ తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్, సింధూజా మైక్రో క్రెడిట్ లిమిటెడ్, పేటీఎం తదితర కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం రెడ్డి పేట ఎంపీపీ స్కూల్లో అన్యమత ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ఎం సుబ్రహ్మణ్యంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హెచ్ఎం ను సస్పెండ్ చేసేదాకా విద్యార్థులను స్కూలుకు పంపమని తల్లిదండ్రులు వివరించారు. దీనిపై విచారణ అనంతరం హెచ్ఎం ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రకాశం: త్వరలో పబ్లిక్ పరీక్షలు రాయనున్న పదవ తరగతి విద్యార్థులకు మార్చి 3వ తేదీ నుంచి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. 13వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాలన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలను మరింత ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాయి. సెన్సెక్స్ 851.56 పాయింట్ల నష్టంతో 74,459 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 250.55 పాయింట్లు తగ్గి 22,545 వద్ద కొనసాగుతోంది.