• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

నేడు TG ECET-2026 ఫలితాలు విడుదల

TG: ఈసెట్ ఫలితాలను ఇవాళ మ.3:30 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వెల్లడించారు. పాలిటెక్నిక్ (డిప్లొమా), BSC (మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా BTech, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.ecet.tgche.ac.inలో చెక్ చేసుకోవాలని సూచించారు.

May 29, 2026 / 09:07 AM IST

BREAKING: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ 

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2230 తగ్గి రూ.1,56,060లకు చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.2050 తగ్గి రూ.1,43,050గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.5000 తగ్గి రూ.2,85,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

May 28, 2026 / 10:09 AM IST

రిలయన్స్ ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా

రిలయన్స్ ఇన్వెస్టర్లకు జూన్‌లో బిగ్ ధమాకా షురూ కానుంది. జూన్ 19న మ.2 గం.కు రిలయన్స్ AGM జరగనుంది. ఈ మీటింగ్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ IPOపై ముఖేష్ అంబానీ ప్రకటన చేసే అవకాశం ఉండటంతో మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ ఇచ్చేందుకు జూన్ 5ను రికార్డు డేట్‌గా ఫిక్స్ చేశారు. AGM ముగిసిన వారంలోనే ఈ డబ్బులు అకౌంట్‌లోకి వస్తాయి.

May 27, 2026 / 07:38 PM IST

ఇన్ఫోసిస్‌ను దాటేసిన అదానీ పవర్

గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ మరో మైలురాయికి చేరుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ను అదానీ పవర్ అధిగమించింది. దీంతో భారత్‌లో 11వ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కంపెనీ మార్కెట్ విలువ 68 శాతం వృద్ధి సాధించి రూ.4.85 లక్షల కోట్లకు చేరింది. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ (రూ.4.72 లక్షల కోట్లు)ను దాటేసింది.

May 27, 2026 / 07:30 PM IST

లాభపడిన టాటా స్టీల్, ఇండిగో షేర్లు

సెన్సెక్స్ 30 సూచీలో HDFC బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాలు చవిచూశాయి. టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఎటర్నల్, ఎన్టీపీసీ, ఇండిగో షేర్లు లాభపడ్డాయి. అలాగే, అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 96.25 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4,484 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

May 27, 2026 / 04:10 PM IST

WOW: రూ.16,999కే కొత్త ఏసీ

భారత మార్కెట్‌లో ఓక్టర్ కంపెనీ సరికొత్త ఏసీని ఆవిష్కరించింది. స్టూడియో ఏసీ 5000- 2026 పేరిట విడుదలైన ఈ మోడల్ ధర రూ.14,499కే వచ్చేస్తుంది. అయితే, GSTతో కలిపి రూ.16,999కు లభ్యమవుతుంది. ఇది 75 చదరపు అడుగుల్లోపు విస్తీర్ణం ఉన్న చిన్నపాటి గదికి సరిపోతుందని సంస్థ తెలిపింది. దీని వినియోగానికి గంటకు రూ.4 మేర విద్యుత్తు ఖర్చు అవుతుందని తెలిపింది.

May 27, 2026 / 02:37 PM IST

జాక్‌పాట్‌.. ఒక్కో ఉద్యోగికి రూ.3.25 కోట్ల బోనస్‌

AI విప్లవంతో శాంసంగ్ చిప్ విభాగానికి భారీ లాభాలు వచ్చాయి. కంపెనీ ఆదాయం గత త్రైమాసికంలో 49 రెట్లు పెరిగింది. దీంతో సంస్థ తన చిప్ విభాగంలోని సుమారు 78,000 మంది ఉద్యోగులకు సగటున రూ.3.25 కోట్ల బంపర్ బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రణాళికాబద్ధమైన 18 రోజుల సమ్మెను నివారించేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారట.

May 27, 2026 / 01:48 PM IST

రూ.200లకే జియో కొత్త ‘ఓటీటీ పాస్’ ప్లాన్

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం రూ.200 ధరతో ‘జియో ఓటీటీ పాస్’ ప్లాన్‌ను తెచ్చింది. ఒకే రీఛార్జ్‌తో మొబైల్ కనెక్టివిటీతో పాటు మెరుగైన వినోదాన్ని అందించే లక్ష్యంతో 28 రోజుల ప్యాక్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ద్వారా 15 ప్రీమియం ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. జియోటీవీ యాప్ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను ఉచితంగా వీక్షించవచ్చు.

May 27, 2026 / 01:30 PM IST

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్

సిరిసిల్ల పట్టణం శాంతినగర్ 2వ వార్డులో మహిళా సమైక్య సంఘాల సభ్యులకు వార్డు కౌన్సిలర్ వేముల రాములు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సమైక్య సంఘాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు గడ్డం జయ, మెరుగు చంద్రకళ, కొక్కుల అర్చనతో పాటు సమైక్య మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

May 27, 2026 / 12:07 PM IST

ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లో మార్పులు

TG: ఇంటర్ బోర్డు ఫస్టియర్‌ సబ్జెక్టుల్లో రిపీటయిన పాఠాలను తొలగించింది. వీడియో, ఆడియో రూపంలో లెసన్స్ వినేలా పుస్తకాల్లో QR కోడ్‌లను పొందుపరిచింది. తెలుగులో రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించే పాఠ్యాంశాలు, Mathsలో ‘Do you know’ బాక్సులు, Physicsలో AI ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంశాన్ని ప్రవేశపెట్టింది. సైన్స్ సబ్జెక్టులను NCERT సిలబస్‌కు అనుగుణంగా మార్చింది.

May 27, 2026 / 10:58 AM IST

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 88.05 పాయింట్లు నష్టపోయి 75921.65 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 25.85 పాయింట్ల నష్టంతో 23887.85 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.68గా ఉంది.

May 27, 2026 / 09:43 AM IST

AP EAPCET ఫలితాలు ఎప్పుడంటే?

AP EAPCET ఫలితాలను జూన్ 10 తర్వాత రిలీజ్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకూ బెటర్‌మెంట్‌కు అవకాశం ఇవ్వగా, ఆ పరీక్షలు జూన్ 5న ముగియనున్నాయి. EAPCETలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో పరీక్షలు పూర్తయ్యే వరకు ఆగాల్సి ఉంది. వచ్చే అకడమిక్ ఇయర్‌కు EAPCETలో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించాలని విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.

May 27, 2026 / 06:46 AM IST

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్: మారుతీ సుజుకీ

వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఆ దిశగా అడుగులు వేసింది. ఆన్ ఫీల్డ్‌లో పనిచేయాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. వ్యాపార అవసరాలకు మాత్రమే విదేశీ పర్యటనలను పరిమితం చేయాలని.. ఆన్‌లైన్ సమావేశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించింది.

May 26, 2026 / 06:16 PM IST

మెటా నుంచి కొత్త యాప్‌

మెటా తన యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా రెడ్డిట్ తరహాలో ఫోరమ్ అనే స్టాండలోన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ గ్రూపులు, కమ్యూనిటీ యూజర్లే లక్ష్యంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. నచ్చిన అంశాలపై చర్చించేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఫోరమ్ యాప్‌లోనూ లాగిన్ అవ్వొచ్చు.

May 26, 2026 / 04:55 PM IST

చమురు కంపెనీలకు రోజూ రూ.600 కోట్ల నష్టం

పెట్రోల్ ధరలు ఈనెల 15 నుంచి ఇప్పటివరకు లీటరుకు రూ.7.50 వరకు పెరిగాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నష్టాలు రోజుకు   రూ.1,000 కోట్ల నుంచి రూ.600 కోట్లకు దిగొచ్చాయని పెట్రోలియం, సహజ వాయువు సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. దేశీయంగా వంటగ్యాస్ విక్రయాల్లో కలుగుతున్న నష్టాలు కూడా ఇందులో కలిసే ఉన్నాయని చెప్పారు.

May 26, 2026 / 04:32 PM IST