ప్రకాశం: ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఈనెల 4న క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎంవీ నాగేశ్వరరావు తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేళా జరుగుతుందని చెప్పారు.
కోనసీమ: రామచంద్రాపురంలోని ఉపాధి భవన్లో ఈనెల 3న ఉదయం 9:30 గంటలకు ప్రముఖ కంపెనీలైన కోజెంట్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, మెక్వన్, బెర్గెన్ పైప్ సపోర్ట్ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్, ఉపాధి భవన్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాలో భాగంగా నిర్వహించబడుతుందని పేర్కొంది.
ELR: వేసవి విరామం అనంతరం సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 137 జూనియర్ కళాశాలలున్నాయి. 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన 1,919 మంది విద్యార్థులతోపాటు, కొత్తగా ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు హాజరుకావాలని డీఐఈవో టి. శేఖర్ బాబు తెలిపారు.
KRNL: జిల్లాలో ఈనెల 2న జరగనున్న డీఈఈ సెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9885716544 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని కోరారు. హాల్ టికెట్లను apdeecet.apcfss.inవెబ్సైట్ నుంచి పొందొచ్చని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో శనివారం నుంచి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల కేంద్రంలో సుమారు మూడు రోజులపాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ మూల్యానికి ప్రక్రియ చీఫ్ ఎగ్జామినర్స్ వంటి 250 మంది అధికారులను నియమించారు.
AP: ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APEDCET-2025) హాల్టికెట్స్ విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్, హాల్టికెట్ నంబర్ నమోదు చేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది. హాల్టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TG: రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి నీట్ కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా నెల రోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేయనుంది. నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తుల నమోదుకు మూడు వారాల గడువు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు.
AP: PGCET-2025 ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదలైంది. పరీక్ష తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో పొందుపరిచింది. జూన్ 9 నుంచి 12 వరకు ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు పరీక్ష తేదీలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
VZM: బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి డిగ్రీ కలేజీలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-35 ఏళ్లలోపు యువత ఉదయం 9గంటలకు కాలేజీకి చేరుకోవాలన్నారు. 18 కంపెనీలు ఈ మేళాకు హాజరవుతున్నాయన్నారు.
AP: రాష్ట్రంలో టీచర్ నియామకాలకు సంబంధించి టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా.. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
బంగారం ధరలు ఇవాళ స్పల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గి రూ.97,530కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.89,400 వద్ద కొనసాగుతుంది. అటు కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.1,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
అల్లూరి: రంపచోడవరం,చింతూరు ఐటీడీఏల పరిధిలోని 8(బాలురు-4,బాలికలు-4)గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,030సీట్లకు(బాలురు-540, బాలికలు-490)అడ్మిషన్ కౌన్సెలింగ్ శనివారం నిర్వహించనున్నట్లు ఇరు ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బాలికలకు రంపచోడవరం గురుకుల బాలికల కళాశాల, బాలురకు రంపచోడవరం గురుకుల బాలుర కళాశాలలో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
KMM: జిల్లాలో 8 మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి పురందర్ అన్నారు. 2025-26 విద్యా సం. రానికి గాను అడ్మిషన్ల పక్రియ ఈనెల 31తో ముగుస్తుందని చెప్పారు. 5 నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆయా విద్యా సంస్థలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
JEE అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. ఈ నెల 18న పరీక్ష నిర్వహించగా.. తాజాగా రెస్పాన్స్ షీట్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. JEE అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు. కాగా, జూన్ 2న తుది కీ, ఫలితాలు విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. షీట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NTR: ఈ నెల 25న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడలోని కలెక్టరేట్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.