KNR: డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డా. వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ఓపెన్ స్కూల్, IIT, డిప్లొమా అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి రశీదు పొందాలన్నారు. వివరాలకు 7382929755 ఈ నెంబర్ను సంప్రదించాలన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 677.73 పాయింట్ల లాభంతో 81245.44 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 200.95 పాయింట్లు లాభపడి 24916.00 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.03గా ఉంది.
ASR: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య మాజీ అధ్యక్షుడు స్వర్గీయ రాంపాల్ సింగ్ పేరు మీద నెలకొల్పిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తగరపువలసకు చెందిన రెడ్డిపల్లి అప్పలరాజు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ బాంధలోని స్వర్గీయ రాంపాల్ సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ సెలక్షన్ కమిటీ ఫౌండేషన్ ప్రకటించింది.
KDP: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని AP ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు అర్హులుగా నిలిచారు. పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె హైస్కూల్కు చెందిన హిందీ టీచర్ ఖాదీర్, కాశినాయన మండలం రెడ్డికొటాల MPUPS, SGT బీ.పరిమళ జ్యోతి, ప్రొద్దుటూరు పరిధిలోని లింగారెడ్డిపల్లె MPPS, SGT S.జవహర్ మునీర్లు ఎంపికయ్యారు.
కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం డాక్టర్ అంబేడ్కర్ గురుకులం ప్రిన్సిపాల్ గ్రేడ్-1 యశోద లక్ష్మి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లభించిన ఈ అవార్డు APSWREISకు ప్రతిష్టతను తీసుకువచ్చింది. తన కృషి, నిబద్ధతతో విద్యార్థుల అభ్యున్నతికి విశేష సేవలందించిన యశోద లక్ష్మికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
AKP: నర్సీపట్నం టౌన్ ఎస్సై జీ.ఉమామహేశ్వరరావు పెదబొడ్డేపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్ధులకు బుధవారం మహిళా భద్రత, మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్ధులకు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్ధాల వల్ల జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు.
కృష్ణా: పేద విద్యార్థులు ప్రతిభతో ఎదగాలని జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ అన్నారు. బుధవారం చల్లపల్లి ఎస్.ఆర్.వై.ఎస్.పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థి, ప్రవాస భారతీయులు మండవ శేషగిరిరావు పేద విద్యార్థులకు సగం ధరకే లాప్ టాప్స్ అందచేశారు. 9వ తరగతి విద్యార్థి పోతార్లంక ధనుష్, 8వ తరగతి విద్యార్థిని గంజాల అశ్వినిలకు ఈ లాప్ టాప్స్ అందచేశారు.
వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన కొత్త పన్ను రేట్లను నవరాత్రి నాటికి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో నిత్యావసరాలు, చిన్న కార్లు, హోటల్ సేవలు వంటివి చౌకగా మారనున్నాయి. అదే సమయంలో విలాసవంతమైన వస్తువుల ధరలు పెరగనున్నాయి. దసరా, దీపావళి పండగల ముందే ఈ కొత్త ధరల అమల్లోకి రావడం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుంది.
NLR: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఉర్దూ డీఐ షేక్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. బుధవారం వింజమూరులోని పాతూరు ఉర్దూ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను, బోధనా పరికరాలను పరిశీలించి పాఠశాలను చక్కగా నిర్వహిస్తున్న HM ఖాదర్ బాషాను అభినందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
KRNL: రైతు సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో ఆయన మాట్లాడారు. ఈ మేరకు పెట్టుబడి సాయం, క్రాఫ్ట్ ఇన్సూరెన్స్, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పల పాలవుతున్నారని అన్నారు. ఈ నెల 9న ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ధర్నాలు చేస్తున్నామన్నారు.
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కి చేరింది. కాగా, 9 రోజుల్లో రూ.5,460 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 పెరిగి రూ.98,050 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.900 పెరిగి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 4 స్లాబులను రెండు స్లాబులకు తగ్గించే అవకాశం ఉంది. చిరువ్యాపారుల పర్మిషన్లను సులభతరం చేయనుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే.. కేంద్రం జీఎస్టీ కొత్త రేట్లను తక్షణమే అమలు చేయబోతుందనే వార్తల నేపథ్యంలో వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
HYD: ఓయూ దూరవిద్య MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించిన్నట్లు PG అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. UGC-డెబ్ నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 25 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎంట్రన్స్ పరీక్ష 28న నిర్వహించనున్నామన్నారు.
ASF: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార ఆదేశాల మేరకు ASF జిల్లాలో వివిధ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడా పోటీల సెలక్షన్స్ ఈ నెల 4 నుంచి నిర్వహించడం జరుగుతుందని డీవైఎస్ఓ రమాదేవి తెలిపారు. HYDలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలు కోసమే ఈ సెలక్షన్స్ నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు 4 వ తారీకు ASF గిరిజన క్రీడా పాఠశాలలో హాజరుకావాలన్నారు.
HYD: Ed.CET 2025 ఫేజ్-2 పూర్తి షెడ్యూల్ విడుదల చేసినట్లు HYD తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. SEP 4న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన క్యాండిడేట్స్ వివరాలు అందుబాటులో ఉంచుతామని, SEP 5 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్స్, SEP 7న ఎడిట్ చేసుకునే అవకాశం,11వ తేదీన రిజల్ట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.