ADB: జిల్లాలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు.
TPT: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఒక ఏడాదిపాటు గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ షిప్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. గ్రాడ్యు యేట్-19, డిప్లమా- 7 మొత్తం 27 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28గా వెల్లడించింది.
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. తాజాగా ఈఏపీసెట్ షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈనెల 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరగనుంది.
VZM: గరివిడి శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం నిరవధిక దీక్ష చేపట్టారు. స్టైఫండ్ వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని దీక్షకు దిగారు. మెడికల్ విద్యార్థులకు ఇచ్చే సౌకర్యాలు పశువైద్య విద్యార్థులకు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.
TG: వసంత పంచమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో పలు హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే స్కూళ్లకు నేడు సెలవు ఉండనుంది. అలాగే, సెలవు ఇవ్వాలా లేదా అనేది స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఏపీలో ఎలాంటి హాలీడే ప్రకటించలేదు.
NTR: కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో LLM పీజీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ శనివారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12 తేదీలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్లో చూడవచన్నారు.
MDK: హవేలిఘనపూర్ మండలం బ్యాతోల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
MDK: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పాపన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ప్రతి విద్యార్థి సబ్జెక్టుల వారీగా అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు.
NTR: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగించారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఫిబ్రవరి 5లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28తో గడువు ముగియగా.. వచ్చే నెల 5 వరకు పొడిగించామన్నారు.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2015, 2016, 2017, 2018 డిగ్రీలో ఫెయిల్ అయిన విద్యార్థులకి మరొక అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వీసీ నాయక్ తెలిపారు. అభ్యర్థులకి ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగంచుకోవాలన్నారు.
ఫోన్ పే యాప్ ‘హ్యాపీ మహాకుంభ్, మహాశుగున్’ పేరుతో క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ పేలో మొదటి ట్రాన్సక్షన్పై రూ.144 క్యాష్బ్యాక్ పొందవచ్చు. కేవలం రూ.1 పేమెంట్ చేసినా వినియోగదారులకు రూ.144 క్యాష్బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 26 వరకే అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ ఆఫర్ యూపీలోని ప్రయాగ్రాజ్ నగరానికే పరిమితం.
కృష్ణా: ఈనెల 28న గన్నవరం రోటరీ క్లబ్లో ఎమ్మెల్యే యార్లగడ్డ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది. 10th,(Pass/Fail), Inter, ITI వారు అర్హులన్నారు. ఉచిత భోజనం వసతి పాటు రూ.12వేలుకు పైగా వేతనం ఉంటుందన్నారు.
ఏలూరు: కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాలలో జనవరి 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లో సుమారు 180 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివి వయసు 18-35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు.
TG: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై 10 గ్రాములకు రూ. 750 పెరిగి రూ. 75250కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.860 పెరిగి రూ.82090కి చేరింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కిలో వెండి ధర రూ.104000గా కొనసాగుతోంది.