ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మెటాకు భారీ షాక్ తగిలింది. చట్ట విరుద్ధంగా వాకీ టాకీల విక్రయాలు చేపడుతున్నందుకు వాటిపై సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చర్యలు చేపట్టింది. ఆయా కంపెనీలపై రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది.
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మెటాకు భారీ షాక్ తగిలింది. చట్ట విరుద్ధంగా వాకీ టాకీల విక్రయాలు చేపడుతున్నందుకు వాటిపై సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చర్యలు చేపట్టింది. ఆయా కంపెనీలపై రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది.
సంగారెడ్డి జిల్లాలోని ఏరియాల్లో ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. చౌటకూర్ మండలంలో NH-161పై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పుట ప్రయాణం చేసేవారు కాస్త నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
కేంద్ర సాయుధ బలగాల్లో 53,690 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి SSC తుది ఫలితాలను విడుదల చేసింది. మెరిట్ జాబితాలో పురుషులు, మహిళల వివరాలను విడివిడిగా అధికారిక వెబ్సైట్ ssc.gov.inలో అందుబాటులో ఉంచారు. అన్ని దశల పరీక్షలు ముగిశాక అభ్యర్థులను తుది ఎంపిక చేశారు. విత్హెల్డ్లో ఉన్న వారి వివరాలను కూడా అధికారులు వెల్లడించారు.
కృష్ణా: గన్నవరం (M) కేసరపల్లిలో సంక్రాంతి కోడిపందేలు హైటెక్ హంగులతో సాగుతున్నాయి. పందెపు బరిలో జరిగే పోరును ప్రతి ఒక్కరూ స్పష్టంగా వీక్షించేందుకు నిర్వాహకులు భారీ LED స్క్రీన్లను ఏర్పాటు చేయడం విశేషం. ఈ డిజిటల్ తెరలపై పందేలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో పందెపు రాయుళ్లు, వీక్షకులు భారీగా తరలివస్తున్నారు. సాంకేతికతను జోడించి పందేలు నిర్వహిస్తున్నారు.
JGL: రోడ్డుపై వాహనాలను డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి సూచించారు. మేడిపల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలకు బ్రేక్ పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,43,180కు, 22 క్యారెట్ల ధర రూ.750 తగ్గి రూ.1,31,250కు చేరింది. అయితే వెండి మాత్రం ఇవాళ కూడా పెరిగింది. ఒక్కరోజే రూ.3,000 పెరిగి కిలో వెండి ధర రూ.3,10,000కు చేరింది. వెండి చరిత్రలో ఇదే ఆల్ టైమ్ రికార్డు కావడం గమనార్హం.
MDCL: ఘట్కేసర్ పరిధి మాదారంలో అనేక మంది ప్రజలు దేవతామూర్తులకు భక్తులుగా తీర్థప్రసాదాలు అభిషేకంగా అందించడం ఆనవాయితీగా వస్తుంది. కోరిన కోర్కెలు తీర్చిన దేవత మూర్తులను ఇంటి దైవంగా చేసుకొని కొలుస్తుంటారు. మాదారం పరిధిలో సత్యనారాయణ స్వామి టెంపుల్, కాలభైరవ టెంపుల్, శ్రీరామ టెంపుల్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి తదితర దేవాలయాలు ఫేమస్.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరగగా, వెండి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,090 పెరిగి రూ.1,43,620కు చేరగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1000 పెరిగి రూ.1,31,650కు చేరింది. వెండి ధర ఒక్కరోజే రూ.15,000 పెరిగి కిలో రూ.3,07,000 గరిష్టాన్ని తాకింది. చరిత్రలో వెండి ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి.
AP: బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఐదో తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSWREIS కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. అలాగే, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థులు https://apgpcet.apcfss.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. పాలపిట్ట ఏయే రాష్ట్రాలకు అధికారిక పక్షిగా ఉంది?2. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది?3. వైశాల్యం పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది?4. గోవా ఏ దేశ పాలన నుంచి 1961లో విముక్తి పొందింది?
AP: తెలంగాణలో ఈనెల 19 నుంచి 23 వరకు దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ ఫెయిర్లో ప్రదర్శించేందుకు ఏపీ నుంచి 35 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. గతేడాది డిసెంబరు 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థులు, టీచర్లు HYDకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
ఇరాన్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా భారత్ నుంచి బాస్మతీ బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ధరలు కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.99 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇరాన్కు వెళ్లాయి. అక్కడ చెల్లింపులు ఆగిపోవడంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి అలాగే కొనసాగితే ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గ్రూప్-3 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16న నియామక పత్రాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. HYDలోని శిల్పకళా వేదికలో సాయంత్రం 4PMకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేయనుంది. కాగా, గ్రూప్-3కి 1,370 మంది ఎంపికయ్యారు.
TG: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం రీకౌంటింగ్కు జనవరి 23 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్లో నిర్వహించగా వెబ్ మెమోలను జనవరి 13 నుంచి www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్దులకు సూచించారు.