• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

SECLలో 543 పోస్టులు.. రేపే ఆఖరు

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్(SECL)లో 543 అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు రోజు. పోస్టును బట్టి డిప్లొమా, BE/బీటెక్ పాసైనవారు రేపటిలోగా అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://secl-cil.in/

November 8, 2025 / 09:52 AM IST

ఎస్సీ గురుకుల సొసైటీలో సెలవుల రద్దు

TG: HYDలోని ఎస్సీ గురుకుల సొసైటీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని రకాల సెలవులను అధికారులు రద్దు చేశారు. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల సమస్య పరిష్కరించే వరకు సెలవులు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయితే ఫేక్ ఉద్యోగులను గుర్తించేందుకు ప్రభుత్వం.. ఉద్యోగుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ మొదలుపెట్టింది.

November 8, 2025 / 07:24 AM IST

‘శ్రేష్ట’ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: ‘శ్రేష్ట’ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఉచితంగా సీటు లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.

November 7, 2025 / 12:45 PM IST

అనంతపురంలో మహిళల కోసం జాబ్‌ మేళా

ATP: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న జిల్లా మహిళల కోసం అంబికా ఫౌండేషన్, దగ్గుపాటి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నెల 11న అనంతపురంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నాయి. నగరంలోని మహర్షి వాల్మీకి భవన్‌లో ఉదయం 9 గంటలకు ఈ మేళా ప్రారంభం కానుంది. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18-30 ఏళ్ల మహిళలు అర్హులని నిర్వాహకులు తెలిపారు.

November 7, 2025 / 10:19 AM IST

BREAKING: పసిడి ప్రియులకు కాస్త ఊరట

బంగారం ధరలు నిన్న కొంత పెరిగినా.. ఇవాళ కాస్త తగ్గి ఊరట కలిగించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గి రూ.1,22,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అలాగే, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కిలో సిల్వర్ రేట్ రూ.1,65,000లు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

November 7, 2025 / 10:13 AM IST

‘పాఠశాలలకు రాకున్నా టీచర్లకు జీతాలు’

TG: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలువురు టీచర్లపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మక్కరాజ్ పేట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయులు నెలల తరబడి పాఠశాలలకు రాకున్నా.. అధికారులతో కుమ్మక్కై పూర్తి వేతనాలు తీసుకున్నారట. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపించాలని హైదరాబాద్ ఆర్జేడీ, మెదక్ డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

November 7, 2025 / 09:52 AM IST

భారీగా పతనమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 534.85 పాయింట్లు నష్టపోయి 82776.16 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 159.85 పాయింట్ల నష్టంతో 25349.85 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.66గా ఉంది.

November 7, 2025 / 09:34 AM IST

కారే కొంటామంటున్నారు..!

TG: ప్రయాణాల విషయంలో రాష్ట్ర ప్రజల మనసు మారుతోంది. గతంలో ఎక్కడికైనా వెళ్లాలంటే.. బస్సులు, బైకులు, స్కూటీలపై వెళ్లేవారు. కానీ పరిస్థితి మారింది. ఇప్పుడు ఎక్కువగా కార్ల వైపే మొగ్గుచూపుతున్నారు. 2014-15తో పోలిస్తే.. 2024-25 సంవత్సరంలో ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్లు కేవలం 4.56 శాతం వృద్ధి చెందగా.. కార్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 69.76 శాతం పెరిగాయి.

November 7, 2025 / 09:04 AM IST

ఏఐ రేసులో అమెరికాను ఓడిస్తాం: చైనా

కృత్రిమ మేధస్సు రేసులో అమెరికాను ఓడిస్తామని చైనాకు చెందిన ఎన్విడియా సంస్థ సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. ఏఐలో అమెరికా కంటే చైనా నానో సెకన్లు వెనకబడి ఉందని వెల్లడించారు. దీనిని త్వరలోనే అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

November 7, 2025 / 06:45 AM IST

దేశంలో టాప్ దాతలు వీరే

➢ శివ్ నాడార్ కుటుంబం (రూ.2708 కోట్లు)➢ ముఖేష్ అంబానీ కుటుంబం(రూ.626 కోట్లు)➢ బజాజ్ కుటుంబం( రూ.446 కోట్లు)➢ కుమార్ మంగళం బిర్లా కుటుంబం(రూ.440 కోట్లు)➢ గౌతమ్ అదానీ కుటుంబం(రూ.386 కోట్లు)➢ నందన్ నీలేకని కుటుంబం(రూ.365 కోట్లు)

November 7, 2025 / 04:10 AM IST

GOOD NEWS: నాబార్డ్‌లో ఉద్యోగావకాశాలు

ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాబార్డ్ ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, గరిష్టంగా 33 ఏళ్లు ఉన్న అభ్యర్థులు అర్హులు అని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. పూర్తి వివరాలకు nabfins.orgను సంప్రదించాలని సూచించింది.

November 6, 2025 / 09:03 PM IST

11 నుంచి IPOకు ఫిజిక్స్ వాలా

ప్రముఖ ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ ఫిజిక్స్‌వాలా IPO వచ్చేందుకు సిద్ధమైంది. రూ.3480 కోట్లు నిధులు సమీకరించేందుకు NOV 11న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. NOV13న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 10న బిడ్డింగ్‌ విండో తెరుచుకోనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.103- 109గా నిర్ణయించింది. రూ.31,500 కోట్ల మార్కెట్‌ విలువతో IPOకు వస్తోంది.

November 6, 2025 / 02:02 PM IST

మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా?

SBI తమ ఖాతాదారుల కోసం ‘పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ పాలసీని అందిస్తోంది. ఖాతాదారుడు ఏడాదికి రూ.2,000 ప్రీమియం చెల్లించాలి. రోజువారీగా లెక్కిస్తే రూ.5.48 మాత్రమే అవుతుంది. ఈ పాలసీ ద్వారా ఊహించని ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.40 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాముకాటు మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

November 6, 2025 / 01:35 PM IST

మీకు SBIలో అకౌంట్ ఉందా?

SBI తమ ఖాతాదారుల కోసం ‘పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ పాలసీని అందిస్తోంది. ఖాతాదారుడు ఏడాదికి రూ.2,000 ప్రీమియం చెల్లించాలి. రోజువారీగా లెక్కిస్తే రూ.5.48 మాత్రమే అవుతుంది. ఈ పాలసీ ద్వారా ఊహించని ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.40 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాముకాటు మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

November 6, 2025 / 01:35 PM IST

నాలుగో రోజు కొనసాగుతున్న బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో నాలుగో రోజు బంద్ కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ బంద్‌ను చేపట్టాయి. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం వెంటనే సగం బకాయిలు విడుదల చేస్తేనే బంద్‌ను ఉపసంహరించుకుంటామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

November 6, 2025 / 09:59 AM IST