SRPT: చివ్వెంలలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఖాళీగా ఉన్న పోస్టులకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జీవి. విద్యాసాగర్ బుధవారం తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, ఇంగ్లీష్, సోషల్ ఆంగ్లంలో బోధించడానికి ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలని ప్రిన్సిపల్ తెలిపారు.
GNTR: ఏపి రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ సంస్థను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏపీ విద్యార్థులకు 20 % సీట్లు రానున్నాయి.
ప్రకాశం: ఒంగోలు సూర్య హైస్కూల్లో జరుగుతున్న ఓపెన్ టెన్త్ ఇంగ్లీష్ పరీక్షలో కాపీయింగ్ కలకలం రేగింది. DEO కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలో ఓ విద్యార్థి నకిలీ పత్రాలతో పట్టుబడ్డాడు. దీంతో సదరు విద్యార్థిని డిబార్ చేయగా, విధులు నిర్వర్తించడంలో విఫలమైన ఇన్విజిలేటర్ను విధుల నుంచి తప్పించారు.
KRNL: జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 27వరకు నిర్వహించనున్నారు. 69 కేంద్రాల్లో 17,129 మంది విద్యార్థులు హాజరుకానున్నారని విద్యాశాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ 10,865, ప్రైవేట్ 5,532, ఓపెన్ స్కూల్ 736 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి.
NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 9 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 2, కంప్యూటర్ ఆపరేటర్ – 4, డేటాఎంట్రీ ఆపరేటర్-9 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నామని, అభ్యర్థులు ఈనెల 31లోపు https:// drntr.uhsap.in/index/లో దరఖాస్తు చేయాలని వర్సిటీ అధికారులు సూచించారు.
భారత్ నుంచి ఆకాశ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్న తొలి దేశం ఏదీ?1. శ్రీలంక2. ఇజ్రాయెల్3. అర్మేనియా4. రష్యాGK: నిన్నటి ప్రశ్నకు జవాబు- రష్యాNOTE: పోటీ పరీక్షల ప్రత్యేకం
శ్రీకాకుళం జిల్లాలోని మోడల్స్ స్కూల్లలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు ఈ నెల 22వ తేదీ వరకు apms.ap.gov.in వెబ్సైట్ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయించనున్నారు. 27వ తేదీన వెరిఫికేషన్ నిర్వహించే జూన్లో తరగతులు ప్రారంభిస్తారు.
SKLM: రాష్ట్రంలో ఉన్న 4 RGUKT ట్రిపుల్ ఐటీ (IIIT)లోని ప్రవేశాలకు గత నెల 24వ తేదీని నోటిఫికేషన్ విడుదలైంది. 2025 – 26 ఏడాదికి పదో తరగతి పాసైన విద్యార్థులకు 6 ఏళ్ల బిటెక్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు www.rgukt.in వెబ్ సైట్, ఆన్లైన్లో ఈ నెల 20వతేదీ లోపు ఆప్లై చేసుకోవచ్చు. వివరాలకు అధికారిక వెబ్ సైట్ను చూడండి.
శ్రీకాకుళం జిల్లాకు డీఎస్సీలో 458 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ క్రమంలో జిల్లాలో 22,648 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి 39,235 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తంగా ఒక్కో పోస్టుకు 85 మంది పోటీపడుతున్నారు. కొంచెం కష్టపడితే జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు.
SBI డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలపరిమితుల డిపాజిట్లపై 20 బేసిక్ పాయింట్ల మేర తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని SBI తెలిపింది. 1-2 సంవత్సరాల కంటే తక్కువ 6.70%, 3-5 సంవత్సరాల కంటే తక్కువ 6.75%, 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ 6.85%, సీనియర్ సిటిజన్లకు అన్ని కాలపరిమితులపై అదనంగా 0.50% తగ్గింపు ఉండనుంది.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు 14వ రోజు బుధవారం సందడిగా, వినోదంగా కొనసాగాయి. ముందుగా విద్యార్థులతో లైబ్రరీన్ విజయభాస్కర్ రెడ్డి కథలు చదివించడం, కథల్లోని నీతిని వివరించడం పాటలు పాడించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాశక్తిని వెలికి తిసేందుకు, వారిలో దాగి ఉండే ప్రతిభను గుర్తించడం ఏర్పాటు చేశామన్నారు.
ప్రకాశం: డైట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్ -2025 కొరకు ఈ నెల 20వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని డైట్ కళాశాల ప్రిన్సిపల్ సామా సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా ఈ గడువును పొడిగించారని ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ వైపు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లడం.. మరోవైపు పసిడి కొనుగోళ్లు ఊపందుకోవడంతో.. మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.160 పెరిగి రూ.95,620గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరగ్గా రూ.87,650కి చేరింది. కాగా.. కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.1,09,000 ఉంది.
AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి జీతాలు పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375కు పెంచగా, నెలకు అత్యధికంగా రూ.27వేలుగా నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
AP: ఈఏపీసెట్(EAPCET) 2025 పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.