• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

6,300mAh బ్యాటరీతో పోకో ఫోన్

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ పోకో.. సీ85x 5G పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత  హైపర్ ఓఎస్ 3, 6.9 అంగుళాల డిస్ ప్లే, 120Hz, వెనక వైపు 32 MP డ్యుయెల్ కెమెరా, 08 MP సెల్ఫీ కెమెరా, 6,300mah బ్యాటరీ, IP52 రేటింగ్‌తో వస్తుంది. 4GB+64GB వేరియంట్ ధరను రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది.

March 11, 2026 / 04:40 AM IST

LPG కొర‌త‌…ఉపాధి కోల్పోనున్న‌ ఫుడ్ డెలివ‌రీ బాయ్స్ !

దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరతతో బెంగళూరులో హోటల్స్, రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటోలకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తుంది. హోటల్స్ మూసివేయడంతో ఆయా ప్లాట్ ఫామ్స్‌లకు ఆర్డర్లు తగ్గే అవకాశం ఉంది. తద్వారా పని చేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉపాధి తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 11, 2026 / 04:10 AM IST

మ్యూచువల్‌ ఫండ్లలోకి పెరిగిన పెట్టుబడులు

యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నా.. భారత మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. FEBలో ఈక్విటీ ఫండ్లలోకి నికరంగా రూ.25,978 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరితో పోలిస్తే ఈ మొత్తం 8 శాతం అధికమని భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం తెలిపింది. అదే సమయంలో SIPలో జనవరిలో రూ.31 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. ఫిబ్రవరిలో రూ.29,845 కోట్లకే పరిమితమయ్యాయి.

March 11, 2026 / 03:55 AM IST

LPG కొరత.. మొబైల్స్, ఇంటర్నెట్ సేవలపై ప్రభావం!

LPG కొరత మొబైల్స్, ఇంటర్నెట్ సేవలపై కూడా తీవ్ర ప్రమాదం పడనుంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై ఆగిపోవడమే ఇందుకు కారణమని సమాచారం. టెలికాం టవర్లు తుప్పు పట్టకుండా తయారీ సమయంలో జింక్‌తో వేసే రక్షణ పొరకోసం LPGని వాడతారు. అయితే LPG కొరతతో ఈ ఆపరేషన్స్ నిలిపివేయాలని ప్రొడక్షన్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే నెట్ వర్క్ కనెక్టివిటీ తగ్గే ప్రమాదం ఉంది.

March 11, 2026 / 03:10 AM IST

FDIల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా మిగిలిన సరిహద్దు దేశాల FDIల విషయంలో ఉన్న నిబంధనలను సులభతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న ‘ముందస్తు అనుమతి’ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. తాజాగా దీన్ని తొలగించారు.

March 10, 2026 / 10:22 PM IST

రూ.11 వేల కోట్ల వసూలు

మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన పేరుతో ఖాతాదారుల నుంచి గత మూడేళ్లలో ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు వసూలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. HDFC బ్యాంక్ అత్యధికంగా రూ.3800 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.2,700 కోట్లు, ICICI బ్యాంక్ రూ.1200 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.

March 10, 2026 / 08:42 PM IST

‘తాడిపత్రి కేజీబీవీలో ప్రవేశాలకు ఆహ్వానం’

ATP: తాడిపత్రి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మంగళవారం తెలిపారు. 6వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరేందుకు విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు.

March 10, 2026 / 06:30 PM IST

‘తాడిపత్రి కేజీబీవీలో ప్రవేశాలకు ఆహ్వానం’

ATP: తాడిపత్రి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మంగళవారం తెలిపారు. 6వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరేందుకు విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు.

March 10, 2026 / 06:30 PM IST

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 639.82 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 233.55 పాయింట్ల లాభంతో 24,261.60 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు రాణించడంతో మార్కెట్లు పరుగులు తీశాయి. గత కొన్ని రోజులుగా ఒడిదొడుకుల మధ్య సాగుతున్న మార్కెట్లలో ఈ లాభాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి.

March 10, 2026 / 03:56 PM IST

ముంబైలో 20 శాతం హోటళ్లు బంద్

వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడుతాయని పేర్కొంది. ఢిల్లీ, బెంగళూరులో ఇప్పటికే కొన్ని హోటళ్లలో వంటగ్యాస్ అందుబాటులో లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు.

March 10, 2026 / 10:58 AM IST

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన స్పైస్‌జెట్ ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 7:25 గంటలకు బయలుదేరాల్సిన విమానం రీషెడ్యూల్ చేసినట్లు స్పైస్‌జెట్ సిబ్బంది ప్రయాణికులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

March 10, 2026 / 10:28 AM IST

BREAKING: ఒకే రోజు రూ.10 వేలు పెరిగిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 పెరిగి రూ.1,48,850 పలుకుతోంది. అటు కిలో వెండి ధర ఒక్కరోజే రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

March 10, 2026 / 09:52 AM IST

12 కాలేజీల్లో సాయంత్రం బీటెక్‌ కోర్సులు

TG: రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో విద్యాశాఖ జీవో 30 జారీ చేసింది. ఒక్కో కాలేజీకి 1 నుంచి 5 కోర్సులకు అనుమతి దక్కింది. ఒక్కో కోర్సులో కనిష్ఠంగా 15 నుంచి గరిష్ఠంగా 60 సీట్లున్నాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.

March 10, 2026 / 09:25 AM IST

ఇంజినీరింగ్ కళాశాలలకు భారీ షాక్

TG: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఫార్మసీ, లా, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. అనేక కళాశాలలకు ఫీజు పెంచకపోవడంతో పాటు కొన్ని కళాశాలలకు ఇప్పటివరకు ఉన్న ఫీజునే తగ్గించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈసారి ట్యూషన్‌ ఫీజు తప్ప.. ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదని GO జారీ చేసింది.

March 10, 2026 / 07:23 AM IST

ఆ ఖాతాలకు కనీస నిల్వ అక్కర్లేదు: కేంద్రమంత్రి

పీఎం జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన 75 కోట్ల పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ నిబంధన లేదని కేంద్రమంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. కనీస బ్యాలెన్స్ లేకపోయిన వీటికి ఎలాంటి జరిమాన పడదన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే సున్నా-నిల్వ ఖాతా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే డిపాజిట్, నగదు ఉపసంహరణ, ఏటీఎం సేవలకు కూడా ఛార్జీలు ఉండవని తెలిపారు.

March 10, 2026 / 03:35 AM IST