• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ALERT: అప్లై చేశారా?.. ఇంకా కొన్ని గంటలే!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET – 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ గత నెల ప్రారంభమవగా.. గడువు ఇవాళ రాత్రితో ముగియనుంది. అభ్యర్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 8, 2026న నిర్వహిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

December 18, 2025 / 02:59 PM IST

ట్రాయ్ కీలక నిర్ణయం

స్కామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్ అన్నీ తప్పనిసరిగా 1600 సిరీస్ నంబర్లతోనే రావాలని ఆదేశించింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమలవుతాయని చెప్పింది. దీని ద్వారా అనేక నెంబర్ల నుంచి కాల్స్ రావడంతో తలెత్తే సైబర్ మోసాలను అరికట్టవచ్చని ట్రాయ్ వెల్లడించింది.

December 18, 2025 / 02:53 PM IST

ALERT: మొబైల్ రీఛార్జ్‌లపై 20% పెంపు?

రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు Airtel, Jio, VI రెడీ అవుతున్నాయి. 2026 నాటికి ఈ కంపెనీలు ప్రీపెయిడ్, పోస్టు‌పెయిడ్ టారిఫ్‌లను 16-20% వరకు పెంచే ఛాన్స్ ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ ‘మోర్గాన్ స్టాన్లీ’ పేర్కొంది. 2024 జూలైలో ధరలు పెరగగా రెండేళ్ల తర్వాత 2026లో మరోసారి పెరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

December 18, 2025 / 11:09 AM IST

సత్యసాయి పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం

సత్యసాయి: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ పాఠశాలలో 2026-27లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఒకటో తరగతి (బాలబాలికలు), 11వ తరగతి (బాలురు) ప్రవేశాలకు జనవరి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 11వ తరగతికి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అర్హులు. మరిన్ని వివరాలకు www.ssshss.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.

December 18, 2025 / 09:35 AM IST

19న మడకశిరలో జాబ్ మేళా

సత్యసాయి: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న మడకశిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రముఖ కంపెనీలు పాల్గొని 500 మందికి అవకాశాలు కల్పిస్తాయని జిల్లా అధికారి హరికృష్ణ తెలిపారు. పది నుంచి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15-25 వేల వరకు వేతనం అందుతుందన్నారు.

December 18, 2025 / 06:20 AM IST

త్వరలో రైల్వే నోటిఫికేషన్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో 311 ఖాళీలతో ఐసోలేటెడ్ కేటగిరీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈనెల 30 నుంచి జనవరి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. వివిధ రైల్వే రిజియన్లలో సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయనుంది.

December 18, 2025 / 06:05 AM IST

కొత్త ప్రైవేట్ బడుల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ

AP: వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభించేందుకు ఈనెల 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. cse.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, నిబంధనలు అనుసరించి అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 31లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.

December 18, 2025 / 05:46 AM IST

వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త ఫోన్

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 15 సిరీస్‌లో వన్‌ప్లస్ 15కు కొనసాగింపుగా 15Rను లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ క్వాలిటీ, ప్రీమియం ఫీచర్లతో బిగ్‌బ్యాటరీతో ఈ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. దీని ధర 12GB+25GB స్టోరేజీ ధర ఇండియాలో రూ.47,999 నుంచి ప్రారంభం కానుంది. 

December 17, 2025 / 09:44 PM IST

134 కోట్ల మంది ఆధార్ డేటా సేఫ్

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) డేటా బేస్ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. అధునాతన భద్రతా చర్యల కారణంగా పౌరుల ఆధార్ డేటా సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

December 17, 2025 / 08:28 PM IST

టాటా సియెర్రా రీ-ఎంట్రీ: అదిరిపోయిన బుకింగ్స్!

టాటా మోటార్స్ ఐకానిక్ SUV సియెర్రా రీఎంట్రీ భారత మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. బుకింగ్స్ నిన్న ప్రారంభమవగా.. మొదటిరోజే 70వేలకు పైగా కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకున్నారు. మరో 1.35 లక్షల మంది తమకు నచ్చిన వేరియంట్లను సెలక్ట్ చేసుకున్నారు. ఈ కారు ధర(Ex.Showroom) రూ.11.49 లక్షల నుంచి 21.29 లక్షల వరకు ఉంది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఈ కార్లు రోడ్లెక్కనున్నాయి.

December 17, 2025 / 05:37 PM IST

ALERT: అడ్మిట్‌ కార్డులు విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ-2 2024(CEN 06/2024) పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈనెల 20 నుంచి సీబీటీ-2 పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులు పొందచచ్చు. మొత్తం 51,978 మంది అభ్యర్థులకు సీబీటీ-2కు ఎంపికయ్యారు.

December 17, 2025 / 06:26 AM IST

BREAKING: పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

TG: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఇంటర్‌ బోర్డు స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్‌ సెకండియర్‌ మ్యాథ్స్‌ 2ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 3న హోలీ ఉండటంతో పరీక్షల తేదీలో మార్పు చేసినట్లు వెల్లడించింది. మిగతా పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది.

December 16, 2025 / 06:32 PM IST

గ్రామాభివృద్ధికి నిరంతర కృషి చేయాలి: బీఆర్ఎస్

GDWL: గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని బీఆర్ఎస్ గద్వాల జిల్లా అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు పేర్కొన్నారు. గట్టు మండలం సల్కాపురం గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్ బోయ తిమ్మప్ప, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌దే రాజ్యమని ఆయన అన్నారు.

December 16, 2025 / 06:30 PM IST

BREAKING: టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: టెట్ పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి జనవరి 20, 2026 వరకు నిర్వహించనుంది. పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు.

December 16, 2025 / 01:17 PM IST

మస్క్‌ మరో చరిత్ర.. 600 బిలియన్‌ డాలర్ల సంపద

స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఇప్పటికే ప్రపంచ కుబేరుడుగా కొనసాగుతున్న మస్క్ సంపదన తాజాగా మరింత పెరిగింది. స్పేస్‌ఎక్స్ సంస్థ IPOకు వెళ్లనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన సంపదను 600 బిలియన్ డాలర్లకు పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే 168 బిలియన్ డాలర్లు పెరిగి.. 600 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

December 16, 2025 / 10:52 AM IST