ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న నాగోబా జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కేస్లాపూర్ దర్బార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం వార్డ్ నెంబర్ 2 కళ్యాణి లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రియల్ ఛైర్మన్ కాసుల బాలరాజు సహకారంతో కోటగల్లి కార్యకర్తల సమక్షంలో పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతిఒక్కరికీ సంక్షేమపథకాలు అందుతున్నాయని తెలిపారు.
టాటా పంచ్ ఇప్పుడు ఫేస్లిఫ్ట్ 2026 వెర్షన్లో విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.5.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ అప్డేట్లో కొత్తగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పరిచయం చేయడం ప్రధాన ఆకర్షణ. ఇది 120 పీఎస్ పవర్ 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగ్లు స్టాండర్డ్గా అందిస్తున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.380 పెరిగి రూ.1,42,530కు, 22 క్యారెట్ల పసిడి రూ.350 పెరిగి రూ.1,30,650కు చేరింది. ఇక కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగి రూ.2,92,000కు చేరడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నట్లు సమాచారం.
NZB: జిల్లా రెంజల్ మండలంలో ఆన్లైన్ బెట్టింగులతో నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కూనేపల్లి గ్రామానికి చెందిన పెరుమండ్ల సంజయ్(28) అప్పుల బాధ భరించలేక సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందినట్లు రెంజల్ ఎస్సై కే. చంద్రమోహన్ సోమవారం తెలిపారు. రెండున్నర లక్షల వరకు అప్పుచేసి, ఆ నగదుతో ఆన్లైన్ బెట్టింగులు పెట్టి, నష్టపోయాడని తెలిపారు.
ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ITI)లో 215 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM, BMS ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం గలవారు జనవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
సోషల్ మీడియా వేదికలో అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ను తొలగించాలని కేంద్రం ‘X’కు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ నేతృత్వంలోని ఎక్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అశ్లీల కంటెంట్కు సంబంధించిన 3500 పోస్టులు, 600 ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
NLG: శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వీ. దర్శిష్ భార్గవ్ “తెలంగాణ ఆంగ్లం ఒలంపియాడ్” పోటీలో రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్లు గైడ్, జిల్లా ఇంగ్లీష్ డీఆర్పీ చిత్తలూరి సత్యనారాయణ తెలిపారు. ఎంపికైన దర్శిష్ భార్గవ్ ను పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, ఉపాధ్యాయులు శ్రీరాములు, రవికుమార్తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం గల 20-42 ఏళ్ల వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ రూ.750. SC, ST, PwBDలకు ఫీజ్ లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP: లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు సంబంధించిన ఏపీ సెట్-2025ను మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. జనరల్ అభ్యర్థులు రూ.1600, బీసీ EWS రూ.1300, ఎస్సీ, ఎస్టీ, ఇతరులు రూ.900 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
TG: ప్రమాదబీమాపై బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.02 కోట్ల ప్రమాద బీమాను కల్పించేందుకు బ్యాంకులు ఒప్పుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. కాగా, ఇప్పటికే సింగరేణి, విద్యుత్ సంస్థల ఉద్యోగులకు బీమా అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
AP: ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో (టెట్) 39.27 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని విద్యాశాఖ వెల్లడించింది. 31,886 మంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షలు రాశారు. ఇందులో 47.82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. టెట్ ఫలితాలను tet2dsc.apcfss.in, cse.ap.gov.inలో చూసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి గడువు మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. పోస్టును బట్టి BTech, BE, డిప్లొమా, ITI ఉత్తీర్ణత గల 18-26 ఏళ్లలోపు వారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.710 పెరిగి రూ.1,38,710కు చేరగా, 22 క్యారెట్ల పసిడి రూ.650 పెరిగి రూ.1,27,150 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధర మాత్రం నిన్నటితో పోల్చితే పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.4,000 తగ్గి రూ.2,68,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నట్లు సమాచారం.
బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) 400 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిగ్రీ అర్హత గల 20-28 ఏళ్ల అభ్యర్థులు ఈ నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.