నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1360 పెరిగి రూ.1,29,820కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1250 పెరిగి రూ.1,19,000 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.9000 పెరిగి రూ.1,92,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
అక్టోబరులో జియో ఖాతాలో కొత్తగా 19.97 లక్షల మంది మొబైల్ ఖాతాదారులు చేరారు. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 48.47 కోట్లకు చేరినట్లు ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. అయితే, ఇదే నెలలో ఎయిర్టెల్కు సైతం 12.52 లక్షల వినియోగదారులు పెరగడంతో 39.36 కోట్లకు చేరింది. ఇక BSNLలో 2.69 లక్షల చందాదారులు చేరడంతో మొత్తం సంఖ్య 9.25 కోట్లకు పెరిగింది.
NABARDలో 91 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. విభాగాన్ని బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. 21-30 ఏళ్ల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం డిసెంబర్ 20న ప్రిలిమ్స్, జనవరి 25న మెయిన్స్ జరగనున్నాయి. అనంతరం సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: www.nabard.org
రష్యా నుంచి చవకగా చమురు, సహజ వాయువు కొనడానికి హంగరీ ప్రధాని విక్తొర్ ఓర్బాన్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. రష్యా చమురు, గ్యాస్ను ఎవరూ కొనుగోలు చేయకూడదంటూ ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమతి తీసుకుని మరీ ఓర్బాన్ మాస్కో వెళ్లారు. రష్యా అందించే చవక ఇంధనం లేకపోతే తమ ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందని ఓర్బాన్ పేర్కొన్నారు.
అక్టోబరు నెలకు సంభందించిన పారిశ్రామికోత్పత్తి సూచీ (IIP) గణాంకాల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. సాధారణంగా ఐఐపీ గణాంకాలను ప్రతి నెలా 28న, ఒకవేళ ఆరోజు సెలవు ఉంటే మరుసటి రోజున విడుదల చేస్తుంటారు. అయితే, ఈనెల 28న రెండో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాల వెల్లడి ఉన్నందున, ఐఐపీ గణాంకాల విడుదల తేదీని డిసెంబరు 1కి మార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా విధించింది. పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ బ్యాంకుపై రూ.91 లక్షల ఫైన్ విధించినట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు మన్నకృష్ణ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కూడా రూ.3.10 లక్షల జరిమానా విధించింది. వినియోగదారుల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
తాజాగా నథింగ్ ఫోన్ కంపెనీ కొత్త మోడల్ ఫోన్ తీసుకువచ్చింది. నథింగ్ ఫోన్ 3ఏ లైట్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఫోన్ 3ఏ లైట్ 6.77 అంగుళాల AMOLED డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50MP (Main) + 8MP (UW) + 2MP (Macro) Rear Camera కూడా ఈ ఫోన్ కు అందిస్తున్నారు. ఇక సెల్ఫీల కోసం 16MP కెమెరా కూడా అందిస్తోంది […]
W.G: కాళ్ల మండలం కాళ్లకూరులో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శుక్రవారం సాయంత్రం సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉండగా ఇచ్చిన రూ.10 లక్షల నిధులతో ఈ రోడ్డు పూర్తయిందని తెలిపారు. అలాగే రూ. 35 లక్షల వ్యయంతో జిందాల్ పవర్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయనున్న వాటర్ పైప్ లైన్కు ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్లను శాసించే స్థాయికి భారత్ ఎదగబోతోంది. రానున్న 10 ఏళ్లలో భారత్ ఈ ఘనత సాధిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం దేశీయంగా బంగారు గనుల తవ్వకాలను భారీగా పెంచబోతున్నామని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత సీఈవో సచిన్ జైన్ తెలిపారు. ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడుతున్న మనం.. సొంతంగా మైనింగ్ పెంచితే.. బంగారం ధరల రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది.
TG: HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్ బాస్కెట్కు చెందిన 75 గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేశారు. అక్కడ ఎక్స్పైర్ అయిన సరుకులు, కుళ్లిన పండ్లు, కూరగాయలు చూసి అధికారులు షాక్ అయ్యారు. వాటిని సీజ్ చేసి, లాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్ సేకరించారు. నిబంధనలను పాటించని సంస్థలకు సీరియస్ వార్నింగ్తో పాటు నోటీసులు జారీ చేశారు.
నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,28,460కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,17,750 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,83,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
TG: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 268 గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎఫ్ఆర్ఎస్ మొబైల్ యాప్ ఆధారంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో హాజరు స్వీకరిస్తారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET – 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు CBSE అధికారిక వెబ్సైట్ ctet.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 8, 2026న నిర్వహిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) ఖాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 156 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తుకు డిసెంబర్ 8, 2025 చివరి తేదీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ మేళాలో 10 కంపెనీలు పాల్గొనగా.. 193 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 81 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి బీజేపీ నేత హరీశ్ బాబు నియామక పత్రాలు అందజేశారు.