భారత తయారీ రంగ వృద్ధికి పశ్చిమాసియా యుద్ధం, పోటీ పరిస్థితులు అవరోధంగా మారుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ఉద్రిక్తతల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి తయారీ రంగంపై ప్రభావం చూపుతోందని HSBC ఆర్థికవేత్త ప్రంజుల్ భండారి తెలిపారు. క్లయింట్లు కొటేషన్లను ఆమోదించడానికి విముఖత చూపడం కూడా వృద్ధి వేగాన్ని తగ్గించిందని, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు నెలకొన్నాయని తాజా సర్వే వెల్లడించింది.
భారత తయారీ రంగ వృద్ధి ఏప్రిల్లో స్వల్పంగా పెరిగింది. కొత్త ఆర్డర్ల రాక ఇందుకు ప్రధాన కారణమని HSBC ఇండియా వెల్లడించింది. పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(PMI) సూచీ మార్చిలో 53.9 పాయింట్ల వద్ద ఉండగా, ఏప్రిల్లో 54.7 పాయింట్లకు చేరుకుంది. గిరాకీలో స్థిరత్వం, ప్రకటనల వల్ల ఉత్పత్తి పెరిగినప్పటికీ.. గత నాలుగేళ్లలో ఇది రెండో కనిష్ఠ పెరుగుదలగా నమోదైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 293 పాయింట్ల నష్టంతో 76,976 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్లు నష్టంతో 24,024 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.34 వద్ద ప్రారంభమైంది.
AP: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల నియామక ప్రకటన విడుదలకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈనెల 15న 1,500 పోస్టులకు ప్రకటన విడుదల కానుంది. విశ్వవిద్యాలయాలకు మంజూరు చేసిన పోస్టుల్లో బ్యాక్లాగ్లు మినహాయించి మిగతా వాటిల్లో 43 శాతం ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటికి రిజర్వేషన్ రోస్టర్ను ఖరారు చేసే ప్రక్రియను విశ్వవిద్యాలయాలు చేపట్టాయి.
AP: రాష్ట్రంలో పాలిటెక్నిక్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలు విడుదల చేయనున్నారు. పాలిసెట్కు మొత్తం 1,77,581 మంది దరఖాస్తు చేయగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ఫలితాలను polycetap.ap.gov.in, మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లాభపడి 77269.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121.75 పాయింట్ల లాభంతో 24119.30 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.18గా ఉంది.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే వైఫల్యం సన్టీవీ నెట్వర్క్పై తీవ్ర ప్రభావం చూపింది. విజయ్ TVK ప్రభంజనంతో DMK మూడో స్థానానికి పడిపోవడంతో, సన్టీవీ షేర్లు ఒక దశలో 9.5 శాతం మేర పతనమయ్యాయి. DMK అధినేత స్టాలిన్కు సన్టీవీ యజమాని కళానిధి మారన్ దగ్గరి బంధువు కావడమే ఈ పతనానికి ప్రధాన కారణం. రాజకీయ మార్పుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.
ఆంథ్రోపిక్ ‘క్లాడ్ మిథోస్’ ఏఐ వల్ల బ్యాంకింగ్ డేటాకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో బ్యాంకులు ఐటీ వ్యయాన్ని పెంచుతున్నాయి. సాఫ్ట్వేర్ లోపాలను 72 గంటల్లోపే అటాక్ చేసే ఈ ఏఐని ఎదుర్కోవాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు. దీనిపై అధ్యయనం కోసం ఎస్బీఐ చైర్మన్ సి.ఎస్. శెట్టి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
బాపట్ల: సంతమాగులూరు మండలం ఏల్చూరులోని చారిత్రాత్మక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (1942) శిథిలావస్థకు చేరడంతో, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 84 ఏళ్ల పాత భవనాల కూల్చివేత పూర్తయి, అత్యాధునిక వసతులతో కొత్త పాఠశాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
మామిడి ధరలు రైతులకు షాక్ ఇస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్ను తోతాపురి ధర రూ. 1.10 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.4-7 వేలకు పడిపోయింది. అదేవిధంగా బంగినపల్లి మామిడి ధర రూ.1.75 లక్షల నుంచి రూ.50-60 వేలకు కుప్పకూలింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలు అమాంతం పడిపోయాయి.
TG: టీజీఎప్ సెట్- అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రవేశ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. JNTUH ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 106 సెంటర్లను అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 4న రెండు సెషన్స్, 5న ఉదయం సెషన్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 90,958 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
TG: పదోతరగతి ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియం విద్యార్థుల్లో 89.14 శాతం, ఇంగ్లీష్ మీడియం 95.86 శాతం, ఉర్దూ మీడియం విద్యార్థుల్లో 86.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 86.18 శాతం, ZP పాఠశాలల్లో 93.53 శాతం, మోడల్ పాఠశాలల్లో 97.83 శాతం, KGVB పాఠశాల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు.
TG: ఇవాళ విడుదలైన పదోతరగతి ఫలితాల్లో మొత్తం95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 5,731 పాఠశాలల్లో 100 శాతం పాస్ అవగా.. 6 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 99.30 శాతం పాస్ అవగా.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
శ్రీవేంకటేశ్వర బాలమందిరం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు TTD దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SV అనాథాశ్రమం పేరుతో 1943లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వివరాలను ఏఈవో, శ్రీవేంకటేశ్వర బాలమందిరం, టీటీడీ భవానీనగర్, తిరుపతి – 517501 అడ్రస్కు పంపించాలి. దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ మే 16. వివరాలకు 0877-2264613 సంప్రదించాలి.
TG: టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మా HIT TV తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, ఈ విజయం మీ ఉన్నత విద్యాభ్యాసానికి, కెరీర్కు బలమైన పునాది కావాలని ఆకాంక్షిస్తున్నాం. అదే సమయంలో, ఫలితాల విషయంలో నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.