ELR: జిల్లాలో మంగళవారం నిర్వహించిన డీఈఎల్ఈడీ 3వ సెమిస్టర్ పరీక్షకు 46 అభ్యర్థులకు 45 మంది అభ్యర్థులు హాజరవ్వగా 1 గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అలాగే డీఈఎస్ఈడీ 1వ సెమిస్టర్ పరీక్షకు 92 మంది విద్యార్థులకు 89 మంది హాజరయ్యారని 3గురు అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు HIT TV తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకుండా.. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు కూడా అవకాశం ఉంది. కాగా, మీ ఫలితాలను HIT TV యాప్లో చెక్ చేసుకోండి.
బంగారం పేరు వింటేనే సామాన్యులు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇవాళ గరిష్ట పెరుగుదల నమోదు చేసి రూ.లక్ష దాటింది. కేవలం 15 రోజుల్లో రూ.10వేలకుపైగా బంగారం ధర పెరిగింది. ఈ నెల 8న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,730 ఉండగా.. ఇవాళ రూ.1,01,350కి చేరింది. అయితే ధరలు విపరీతంగా పెరగటంతో కొనుగోలుదారులు తగ్గిపోయారని వ్యాపారులు వాపోతున్నారు.
NZB :మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాల కొరకు HIT TV యాప్ను చూడండి.
KDP: ముద్దనూరులోని గజ్జల చిన్న రంగారెడ్డి ఐటీఐ కళాశాల ఆవరణలో నేడు జాబ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని జువారి సిమెంట్ కంపెనీ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన వారు అర్హులని ఆయన వెల్లడించారు. ఈ ఆకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
VZM: JEE మెయిన్స్లో వంగర మండలం విద్యార్థి ప్రతిభకనబరిచాడు. గ్రామానికి చెందిన పారిశర్ల భరద్వాజ్ JEE మెయిన్స్ ఫలితాల్లో 99.59 శాతంతో సత్తా చాటాడు. ఆలిండియా జనరల్ ర్యాంక్ 6,306, ఆల్ ఇండియా ఓబీసీలో 1,326 ర్యాంక్ సాధించాడు. భరద్వాజ్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా విశాఖలో ఉంటున్నారు. భరద్వాజ్ను పలువురు అభినందించారు.
CTR: గ్రీమ్స్ పేటలోని డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
కడప: ప్రభుత్వ పురుషుల కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు సంయుక్తంగా ఏపీఎస్ఎస్ఈసీ సౌజన్యంతో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో 21న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.
W.G: గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి. వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ,హెచ్డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.
KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరకు నిర్దేశించగా.. ప్రస్తుతం ఈ నెల 21వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు.
SRD: మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు సమీపంలోని మైనార్టీ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.
NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ లో చూడాలన్నారు.
కోనసీమ: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా BC సంక్షేమ సాధికారత అధికారి సత్యరమేష్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్ధులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ప్రపంచ ఆర్థిక దృక్పథం వేగంగా మారుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ‘ప్రస్తుత వాణిజ్య చర్యలు అనిశ్చితులను తీవ్రతరం చేశాయి. ప్రపంచవ్యాప్త పరిస్థితులు రూపాయిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్థిరత్వం సాధించేందుకు ద్రవ్య పరపతి విధానం కీలకపాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద ప్రతిపాదికన దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ ఓ డాక్టర్ దేవి పేర్కొన్నారు. క్లినికల్ సైకాలజిస్ట్-1, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్-1, ఆప్టోమెట్రిస్ట్-1, ఫార్మసిస్ట్-1, డీఈవో-1, లాస్ట్ గ్రేట్ సర్వీస్-1 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.