హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.380 పెరిగి రూ.1,42,530కు, 22 క్యారెట్ల పసిడి రూ.350 పెరిగి రూ.1,30,650కు చేరింది. ఇక కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగి రూ.2,92,000కు చేరడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నట్లు సమాచారం.