• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

రేపే మెగా జాబ్ మేళా

ఏలూరు: కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాలలో జనవరి 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్‌లో సుమారు 180 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివి  వయసు 18-35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు.

January 24, 2025 / 01:43 PM IST

పుత్తడి ప్రియులకు షాక్!

TG: హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌‌పై 10 గ్రాములకు రూ. 750 పెరిగి రూ. 75250కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.860 పెరిగి రూ.82090కి చేరింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కిలో వెండి ధర రూ.104000గా కొనసాగుతోంది.

January 22, 2025 / 11:17 AM IST

BREAKING: గ్రూప్-1 పరీక్ష తేదీలు విడుదల

AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించింది. 

January 21, 2025 / 05:22 PM IST

‘నవోదయ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి’

ATP: నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసే 9, 11వ తరగతుల విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకోవలని నవోదయ ప్రధాన ఆచార్యులు నాగరాజు సోమవారం తెలిపారు. 9వ తరగతి ప్రవేశానికి 1,084 మంది, ఇంటర్ (11) ప్రవేశానికి 1,225 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. హాల్ టికెట్లు www.navodaya.nic.inలో పొందవచ్చని తెలిపారు.

January 20, 2025 / 02:00 PM IST

నేడు జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్ష

ప్రకాశం: జిల్లాలో జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహిస్తున్నట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 4,547 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు.

January 18, 2025 / 07:05 AM IST

నవోదయ ప్రవేశ పరీక్షకు రెండు పరీక్షా కేంద్రాలు

VSP: చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగే నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి జరిగే పరీక్షలకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఒక కేంద్రానికి తను, రెండవ కేంద్రానికి పాఠశాల టీచర్ స్వామి ఇన్చార్జిగా వ్యవహరిస్తామన్నారు.

January 18, 2025 / 05:53 AM IST

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,048 పాయింట్ల నష్టంతో 76,330 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 346 పాయింట్ల నష్టంతో 23,085 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.61 వద్ద స్థిరపడింది.

January 13, 2025 / 04:05 PM IST

ఈనెల 18న నవోదయ ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

KMM: కూసుమంచి మండలంలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయలో 2025-26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. నవోదయలో 80 సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరించారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం సహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,213 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

January 12, 2025 / 10:56 AM IST

తగ్గనున్న పుస్తకాల బరువు

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సెమిస్టర్ల వారీగా అన్నింటిని కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురానుంది. ఒకటి, రెండు తరగతులకు మొదటి సెమిస్టర్ అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా, రెండో సెమిస్టర్‌లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక పాఠ్యపుస్తకంగా ఇవ్వనుంది. 3-5 తరగతుల పుస్తకాల బరువు కూడా తగ్గనుంది.

January 11, 2025 / 11:29 AM IST

మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు

CTR: తిరుచానూరు రోడ్డులోని నందమూరి తారక రామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో మహిళలకు టైలరింగ్, నర్సింగ్ విభాగంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా తెలిపారు. రెండునెలల కాలవ్య వధిలో జరిగే శిక్షణకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 వయసుగల మహిళలు అర్హులన్నారు. వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

December 31, 2024 / 06:05 AM IST

అదానీ గ్రూప్‌ కీలక నిర్ణయం

సింగపూర్‌కు చెందిన ‘విల్మర్ ఇంటర్నేషనల్‌’ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ నుంచి అదానీ గ్రూప్‌ నిష్క్రమించనుంది. తన వాటాలో విల్మర్ ఇంటర్నేషనల్‌కు 31.06 శాతం, ఓపెన్ మార్కెట్‌లో మరో 13 శాతం విక్రయించేందుకు నిర్ణయించింది. దాని మొత్తం విలువ 2 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా.

December 30, 2024 / 04:09 PM IST

BREAKING: సత్య నాదెళ్లతో సీఎం భేటీ

TG: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లను ఆయన నివాసంలో సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ, AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం కోరారు. US తర్వాత మైక్రోసాఫ్ట్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉందన్నారు.

December 30, 2024 / 03:09 PM IST

యాపిల్ ఐఫోన్ 14, ఎస్‌ఈ నిలిపివేత

వరల్డ్ నెంబర్ 1 కంపెనీ యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. యూరప్‌లో ఐఫోన్ 14, ఎస్‌ఈ ఫోన్లను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది.

December 30, 2024 / 11:32 AM IST

పెరిగిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరగటంతో రూ.78,000 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.71,500కు చేరింది. కాగా.. కిలో వెండి ధర రూ.99,900గా ఉంది.

December 30, 2024 / 11:20 AM IST

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 187.86 పాయింట్ల నష్టంతో 78,520 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 23,762 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.53గా ఉంది.

December 30, 2024 / 09:48 AM IST