ASR: ఈగల్ ఆధ్వర్యంలో అరకులోయలోని పలు విద్యాసంస్థల్లో మంగళవారం విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు. గంజా వంటి డ్రగ్స్ వినియోగం వలన కలుగు శారీరక, మానసిక సమస్యలను, రవాణ, సాగు వలన కలుగు చట్టపరమైన శిక్షల గురించి ఈగల్ ఇన్స్స్పెక్టర్ డా కళ్యాణ్, ధనుంజయనాయుడులు వివరించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటు నినదించి, ప్రతిజ్ఞ చేయించారు.
SRD: సెప్టెంబర్ 1న పెన్షన్ వెధవ దినం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యోగుల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా ఛైర్మన్ జావీద్ ఆలీ కోరారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.
SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ డిమాండ్ చేశారు. కందిలోని సంఘ భవనంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. 30, 40 సంవత్సరాలు పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వకపోవడం సరికాదని అన్నారు.
SRD: విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందోలు పాలిటెక్నిక్ కళాశాలలో కళాశాలల అభివృద్ధిపై సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలలోని సమస్యలపై పరిశీల చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. అన్ని కళాశాలలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని కిల్లో గుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవ ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి కుమార్ రత్న మాట్లాడుతూ.. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు జరుగనున్నాయని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నేత్రదానపై అవగాహన కల్పించామని చెప్పారు.
SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల స్వచ్ఛ పురస్కార్ కోసం సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా అప్లోడ్ చేయాలని చెప్పారు.
భారత రైల్వే మంత్రిత్వశాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో https://www.rrbapply.gov.in దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా విధించిన అదనపు సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు లేకపోవడంతో మన సూచీలపై ప్రభావం చూపిస్తోంది. సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయి 81,036 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 24,788 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.87.83గా ఉంది.
బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే పెరిగాయి.22 క్యారెట్ల బంగారం: నిన్న 10 గ్రాముల ధర రూ.93,050 ఉండగా.. ఈ రోజు రూ.500 పెరిగి రూ.93,550కి చేరుకుంది.24 క్యారెట్ల బంగారం: నిన్న 10 గ్రాముల ధర రూ.1,01,510 ఉండగా.. ఈ రోజు రూ.550 పెరిగి రూ.1,02,060గా నమోదైంది.వెండి ధర: కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,30,000కి చేరుకుంది.
KKD: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి మంగళవారంతో గడువు ముగుస్తోందని ప్రిన్సిపల్ డి. సునీత ఓ ప్రకటనలో వెల్లడించారు. బీఎస్సీ వృక్ష శాస్త్రం, కంప్యూటర్స్, రసాయన శాస్త్ర కోర్సులు బీఏ ఎకానమిక్స్, బీకాం కంప్యూటర్ కోర్సులు కళాశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు సాయంత్రం 5 గంటల లోపు ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
TG: టీజీపీఈసెట్ 2025 కౌన్సెలింగ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలకు tgcetsadms@gmail.com, సందేహాలకు 9885622266 ఫోన్ చేయాలి. అభ్యర్థుల జాబితా ఆగస్టు 30, వెబ్ ఆప్షన్ ఆగస్టు 30, 31, వెబ్ ఆప్షన్ ఎడిట్ సెప్టెంబర్ 1, అభ్యర్థుల జాబితా విడుదల సెప్టెంబర్ 3, ట్యూషన్ ఫీజు చెల్లింపు సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు చెల్లించాలి.
NZB: కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ ప్రభుత్వ ITIలో ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఎం.కోటిరెడ్డి తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్స్ CNC మెషినింగ్ టెక్నీషియన్లో అడ్మిషన్లు జరుగుతాయన్నారు.
KMR: తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11గం.లకు ఫార్మా కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన 2022, 23, 24, 25 సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో హాజరు కావాలన్నారు.
AP: వైద్యారోగ్యశాఖలో185 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. MBBS అర్హతతో 155 మంది వైద్యుల పోస్టులు, స్పెషలిస్టు వైద్యుల పోస్టులు 30తో పాటు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు వచ్చే నెల 10నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
AP: DSC అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో రేపు మధ్యాహ్నం నుంచి కాల్లెటర్లు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులకు కేటాయించిన రోజు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. హాజరుకాని వారి అభ్యర్థిత్వం రద్దవుతుందని పేర్కొన్నారు. వారి స్థానంలో మెరిట్ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థులకు అవకాశమిస్తామని స్పష్టం చేశారు.