గ్యాస్ సిలిండర్ బుకింగ్లో మార్పు చేస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఒక సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాతే రెండోది బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే దానిని సవరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. ఒక సిలిండర్ తీసుకున్నాక మరొకటి కావాలంటే 21 రోజుల గ్యాప్ ఉండాలని గ్యాస్ ఏజెన్సీలు వెల్లడించాయి.
భారత ప్రభుత్వ రంగ సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)లో 48 పర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళే లాస్ట్ రోజు. న్యూట్రీషియన్, సైకాలజీ, ఫిజియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిగ్రీతో పాటు స్పోర్ట్స్ సైన్స్ విభాగంలో ఏడాది అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. UG/EWS/OBSలకు పరీక్ష ఫీజు రూ.2000. SC/ST/ESM/మహిళలకు రూ.1500.
SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని, మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులైన ఉన్నత విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని మహిళలందరికీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ సునీత-రవీందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు సత్తా చాటుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్(IDBI) వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న 1100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లికేషన్లు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభం కాగా.. డిగ్రీ ఉత్తీర్ణత, కనీసం రెండేళ్ల పని అనుభవం గలవారు ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1050. SC/ST/PwBDలకు రూ.250.
HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(NIRDPR)లో 9 పోస్టలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్, ట్రైనింగ్ మేనేజర్ తదితర పోస్టులు ఉండగా.. డిగ్రీ, PG, PhD ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు సైట్:
దేశంలోని RBI కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళ్టితో గడువు ముగియనుంది. కేంద్రాల వారీగా హైదరాబాద్లో 11 పోస్టులు ఉండగా.. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వర్డ్ ప్రాసెసింగ్, స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. APR 4న, జూన్ 7న మెయిన్స్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.58,514(+అలవెన్సులు) జీతం చెల్లిస్తారు.
TG: గత ప్రభుత్వం తీసుకొచ్చిన GO 317 వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ జేఏసీ నాయకులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వారికి న్యాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బాధితులకు పరిష్కారం అందించాలని మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్ను కలిశారు. బాధితులకు పరిష్కారం చేస్తామని భరోసా కల్పించారు.
బ్యాంక్ వివరాలు, కేవైసీ(KYC) లేదా ఆధార్ లింక్ చేయడంలో తప్పులు ఉండటం వల్లే పీఎఫ్ క్లెయిమ్ పదేపదే తిరస్కరణకు గురవుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిపోలకపోయినా రిజెక్ట్ అవుతోంది. క్లెయిమ్ రిజెక్ట్ అయితే కారణాన్ని తెలుసుకుని, తప్పులను సరిచేసి మళ్లీ దరఖాస్తు చేయాలి. అవసరమైతే EPFiGMS పోర్టల్లో ఫిర్యాదు చేసి తమ సొమ్మును సులభంగా పొందవచ్చు
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ మీషోకు ఆదాయ పన్ను శాఖ రూ.1500కోట్ల పన్ను నోటీసులు పంపింది. 2023-25 మదింపు గానూ ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన మీషో.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ నోటీసు.. తమ సంస్థ ఆర్థిక కార్యకలాపాలు, ఫైనాన్షియల్ పొజిషన్పై ప్రతికూల ప్రభావాన్ని చూపదని పేర్కొంది.
HDFC బ్యాంక్ తన రుణగ్రహీతలకు తీపి కబురు అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వ్యక్తిగత రుణాలపై EMI భారం తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,300 పెరిగి రూ.1,50,000 మార్కును తాకింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,90,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
NIPERలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 1 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. PhD, MBBS, M.Pharm, BTech, MTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల 40 ఏళ్ల లోపువారు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1000. SC/ST/PwBDలకు ఫీజుల లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.78,000.. ఆఫీసర్కు రూ.56,100 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం సైట్: www.niper.gov.in
ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 29 టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. గ్రాడ్యుయేట్ టీచర్, PG టీచర్, ఇన్స్ట్రక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉండగా.. డిగ్రీ, BEd, MCom, MSc, BLiSc, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఈ నెల 29న ఆన్లైన్ పరీక్ష నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేస్తారు.