• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

‘టెట్ పరీక్ష ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి’

CTR: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు బూరగమంద, చెరుకువారిపల్లి, సదుం పాఠశాలలను మంగళవారం ఆయన పరిశీలించి, ఉపాధ్యాయుల సమస్యలను ఆరా తీశారు. అనంతరం బోధ నేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు.

November 4, 2025 / 06:53 PM IST

ఈనెల 7న కాకినాడలో ఉద్యోగ మేళా

కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నవంబర్ 7న ఇసుజు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ M.V.G. వర్మ తెలిపారు. 2022-2025 మధ్య ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 9848738841 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

November 4, 2025 / 03:07 PM IST

10వేల మంది మిగులు ఉపాధ్యాయులు!

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 24,238 పాఠశాలల్లో 1.08లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. టీచర్ల సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో గణాంకాలను విద్యాశాఖ సేకరిస్తోంది. అయితే గతేడాది కంటే ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల మంది విద్యార్థులు తగ్గారు.

November 4, 2025 / 09:59 AM IST

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గి రూ.1,22,460కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 తగ్గి రూ.1,12,250 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.3,000 తగ్గి రూ.1,65,000లకు చేరింది. రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

November 4, 2025 / 09:59 AM IST

రెండో రోజు కొనసాగుతున్న బంద్

TG: రాష్ట్రంలో రెండో రోజు కాలేజీల బంద్ కొనసాగుతోంది. దాదాపు 2వేలకు పైగా ప్రైవేట్ కాలేజీలు బంద్‌లో పాల్గొన్నాయి. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ విద్యార్థి సంఘాలు కూడా ప్రైవేట్ కాలేజీల ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి.

November 4, 2025 / 09:26 AM IST

మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు?

మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమయ్యాయి. మరోసారి రీఛార్జ్ ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొబైల్ వినియోగదారులపై 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ ఛార్జీలు పెంచాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(VI), జియో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

November 4, 2025 / 06:48 AM IST

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పులు లేవు. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,23,000 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇవాళ కూడా రూ.1,23,000గా ఉంది. అలాగే, నిన్న రూ.1,12,750 ఉన్న 22 క్యారెట్ల గోల్డ్.. నేడు రూ.1,12,750గా ఉంది. ఇక వెండి ధర కూడా రూ.1,66,000గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

November 2, 2025 / 10:50 AM IST

2 నెలల వ్యవధిలో ముగ్గురు మహిళల హత్యలు

NZB: నవీపేట PS పరిధిలో 2 నెలల వ్యవధిలో 3 హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపుతున్నాయి. గత నెలలో గుర్తుతెలియని మహిళను హత్య చేసి గోనె సంచిలో ఉంచి శివారులో పడేశారు. ఈ ఘటనలో మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. వారం రోజుల క్రితం ముదక్ పల్లికి చెందిన శ్యామల లక్ష్మి నవీపేట శివారులో హత్యకు గురైంది. ఈ ఘటనలు మరువకముందే శనివారం మరో మహిళ తల, చేతులు నరికేసి నగ్నంగా పడి ఉండడం కలకలం […]

November 2, 2025 / 09:35 AM IST

జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్‌

కేంద్రీయ విద్యాసంస్థల్లోని యూజీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదలయింది. మొదటి సెషన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య నిర్వహించనుంది. NIT, IIITల్లో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరగనుంది. విద్యార్థుల సౌకర్యార్థం JEE మెయిన్ పరీక్షను రెండు సేషన్లలో నిర్వహిస్తున్నారు.

November 2, 2025 / 07:32 AM IST

రూ. 2000నోట్లు ఇప్పటికీ రాలేదు: RBI

రూ.2000 నోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో తిరిగి చేరలేదని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికీ రూ. 5,817 కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణిలోనే ఉన్నాయని పేర్కొంది. ఈ నోట్లను దేశంలోని 19 ఆర్బీఐ ఆఫీసుల్లో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉందని వెల్లడించింది. లేకపోతే ఏ పోస్టాఫీసు నుంచైనా.. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని చెప్పింది.

November 2, 2025 / 07:10 AM IST

టీచర్ల సర్దుబాటుపై విద్యాశాఖ ఆదేశాలు

TG: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో టీచర్లను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. కొంతమంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు రావడంతో.. వారి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వేరే చోట ఉన్న మిగులు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

November 1, 2025 / 07:04 PM IST

ఊపందుకున్న ఇళ్ల అమ్మకాలు

2025 మూడో త్రైమాసికంలోనూ ఇళ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 87,603 యూనిట్ల మేర ఇళ్లు అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. నగరాల వారీగా ఇళ్ల అమ్మకాల్లో 24,706 యూనిట్లతో ముంబై టాప్‌లో ఉంది. తర్వాత స్థానాల్లో బెంగళూరు(14,538 యూనిట్లు), ఢిల్లీ(12,955 యూనిట్లు), చెన్నై(4,617 యూనిట్లు) ఉన్నాయి.

November 1, 2025 / 06:15 PM IST

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు

TG: ఎడిటర్ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు అప్లై చేయాలనుకునేవారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. తెలుగు సాహిత్యంలో డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అఫ్‌లైన్ ద్వారా నవంబర్ 4 లోపు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలకు tshc.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు.

November 1, 2025 / 03:01 PM IST

JEE MAIN 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం

JEE MAIN పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2026లో జరగనున్న పరీక్షల కోసం https://jeemain.nta.nic.in/లోకి వెళ్లి దరఖాస్తులు సమర్పించుకోవాలని NTA వెల్లడించింది. సెషన్ 1 రిజిస్ట్రేషన్ కోసం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు అవకాశం కల్పించింది. జనవరి 21-30 తేదీల మధ్య సెషన్ 1, ఏప్రిల్ 1-10 తేదీల మధ్య సెషన్ 2 పరీక్షలు జరుగుతాయని NTA ప్రకటించింది.

November 1, 2025 / 02:42 PM IST

పాక్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. లీటరు పెట్రోల్ ధర రూ.265.45గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.278.44 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఈ పెంపు జరిగింది. దీని వల్ల పాక్ ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు ఇది మరింత నష్టం కలిగించనుంది.

November 1, 2025 / 10:29 AM IST