MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని 4 సంవత్సరాల బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధికారి రాజకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. పరీక్షల తేదీలను త్వరలో వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు.
ADB: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం DOST నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ADB జిల్లా విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె. సంగీత తెలిపారు. మే 3 నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ సెంటర్ను సందర్శించాలన్నారు.
SKLM: ప్రాథమిక స్థాయి నుంచే జాతీయ నాయకుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని రిసోర్స్ పర్సన్ లంకలపల్లి సూర్యనారాయణ అన్నారు. సోమవారం లావేరు గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి జాతీయ నాయకుల జీవిత చరిత్ర క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అలాగే ప్రతిరోజు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
W.G: ఉండి ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12వ తేదీ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐల జిల్లా ప్రధానాధికారి శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐలలో 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో వివిధ కోర్సులు పూర్తి చేసి అప్రెంటిస్షిప్ చేయని అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు అన్నిధ్రువపత్రాలతో తీసుకొని రావాలని సూచించారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఈ నెల 21వ తేదీ వరకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ అరుణ బాయి శనివారం ప్రకటనలో తెలిపారు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పారు. 29వ తేదీన సీట్లు కేటా ఇస్తామని, 30వ తేదీన కళాశాలలో చేరాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జీబ్లీ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ ట్రెండ్ను ఓపెన్ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ ఫాలో అయ్యారు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లతో తాను దిగిన ఓ ఫొటో జీబ్లీ వెర్షన్ను శామ్ నెట్టింట పోస్ట్ చేశారు. నాదెళ్లకు తన కొత్త ఆఫీస్ను చూపించానని, ఆయన సరదాగా గడిపారని తెలిపారు. దీనిపై స్పందించిన నాదెళ్ల.. ఆ ఆఫీస్ తనకు బాగా నచ్చిందని పేర్కొన్నారు.
TG: డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేయనున్నారు. దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈసారి మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు.
NTR: రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం జాయింట్ డైరెక్టర్ తెహ్రీ సుల్తానా విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, రెడ్డిగూడెంలో ఈ ఆదర్శ పాఠశాలలు ఉన్న సంగతి విధితమే. మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రకటించవలసినదిగా DEO ఉత్తర్వులు జారీ చేశారు.
ISC, ICSE 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5 వరకు 12వ తరగతి, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు 10వ తరగతి పరీక్షలు జరగగా.. తాజాగా CISCE రిజల్ట్స్ రిలీజ్ చేసింది. విద్యార్థులు CISCE.ORG వెబ్సైట్లో వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
TG: పదో తరగతి పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు రవీంద్రభారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి జీపీఏ విధానాన్ని తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారు. అయితే మీ ఫలితాలను HIT TV యాప్లో హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేసి.. అందరికంటే ముందుగా తెలుసుకోండి.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం బద్రగిరి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ సీహెచ్ సునీల్ కుమార్ బుధవారం తెలిపారు. ఏడాది తొలి విడత ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి మే 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రిషియన్ 20, ఫిట్టర్ 20, కంప్యూటర్ 48, వెల్డర్ 20, డ్రెస్ మేకింగ్ 40 సీట్లు చొప్పున భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
TG: రేపు పది ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈసారి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. రేపు దాదాపు 5 లక్షల మంది భవితవ్వం తేలనుంది. కాగా, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిపిందే. మీ ఫలితాలను HIT TV యాప్లో అందరికంటే ముందుగా తెలుసుకోండి.
కృష్ణ: నూజివీడు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధాన అధికారి దేవరకొండ భూషణం తెలిపారు. నూజివీడులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. 8వ తరగతి నుండి టెన్త్ క్లాస్ వరకు అర్హత కలిగిన వారు ఈ నెల 29 నుండి మే 24వ తేదీలోపు https//itiadmissions.ap.gov.in/iti/login.do ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చన్నారు.
BHPL: గణపురం క్రాస్ గాంధీనగర్ మహాత్మ జ్యోతిబా ఫూలే (ప్రస్తుతం లింగాల వద్ద) ఉన్న పాఠశాలలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ జీ.విజయ తెలిపారు. జిల్లాలోని 5 ఇంటర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో వివిధ గ్రూపులల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రకాశం: కంభంలోని మండల పరిషత్ కార్యాలయంలో కిషోర బాలిక వికాసం మీటింగ్ను సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సమ్మర్ క్యాంపు May 2నుండి జూన్ 10 వరకు బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించుటకు మరియు బాల్యవివాహాలను నిరోధించేలా పిల్లలు, తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరభద్రచారి, ఎంఈఓ మాల్యాద్రి పాల్గొన్నారు.