కృష్ణా: అవనిగడ్డ వాసి అలపర్తి నరేంద్ర స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో 88 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. జోన్ల వారీగా నిర్వహించిన ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలో 3 జిల్లాల అభ్యర్థులు పోటీ పడగా, 83 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. అలాగే, జోన్ల వారీగా నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో 7వ ర్యాంకు సాధించి, రాసిన మూడు పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించారు.
MBNR: జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుకన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్ఎస్వీ సొల్యూషన్స్ కంపెనీ,కెరీర్ గైడెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో అరబిందో ఫార్మా కంపెనీలో ఉద్యోగాల కోసం మేళా నిర్వహిస్తున్నామని, బీఎస్సీ ఉత్తీర్ణత, ఐటీఐ, డిప్లొమా కోర్సులు చేసిన వారు అర్హులన్నారు.
IIT గౌహతి GATE-2026 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ gate2026.iitg.ac.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 25 వరకు కొనసాగనుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 6 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో.. జూనియర్ ఇంటెలిజెన్స్(JIO) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫిషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 14 చివరి తేదీ. మొత్తం ఖాళీలు 394. అభ్యర్థి వయస్సు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, మాజీ సైనికులకు వయస్సులో సడలింపు ఉంటుంది. వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి.
GNTR: ఈ నెల 26న ఫిరంగిపురం MPDO కార్యాలయంలో జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవరావు ఆదివారం తెలిపారు. 10th, B.tech, ITI, ఇంటర్, డిప్లొమా చదివిన అభ్యర్థులు జాబ్ మేళాకు అర్హులని చెప్పారు. యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed 4వ సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్ లాగ్ 1, 2, 3 సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షల తేదీలు ఖరారు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. 1, 3 సెమిస్టర్లకు ఉదయం, 2, 4 సెమిస్టర్లకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు.
రామచంద్రపురంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 31వ తేదీ ఆదివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి సుభాష్ కార్యాలయ సిబ్బంది వెల్లడించాయి. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుందని అన్నారు. టెన్త్ నుంచి ఆపైన చదివిన వారందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చుని తెలిపారు. మరిన్ని వివరాలకు నెంబర్99489-19949ను సంప్రదించాలని తెలిపారు.
చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రదేశానికి పెట్టిన పేరు ఏమిటి? 1. విక్రమ్2. ప్రజ్ఞాన్3. శివశక్తి4. చంద్రశక్తి నిన్నటి ప్రశ్నకు జవాబు: ఆర్చరీNOTE: పోటీ పరీక్షల ప్రత్యేకం
NLR: ప్రతి విద్యార్థి హ్యాండ్ వాష్లో కచ్చితంగా ఆరు సూత్రాలు పాటించాలని DMHO డా. వి. సుజాత తెలిపారు. ఇవాల జిల్లాలో ప్రభుత్వ మోడల్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం కావటంతో నీరు కలుషితమైందని ప్రజలు అనారోగ్య సమస్యలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
సామాన్యుడి ఫెవరెట్ కంపెనీ మారుతి సుజుకీ ప్రతి ఏడాది కొత్త మోడళ్లను తీసుకొస్తుంటుంది. తాజాగా ఒక్క కొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 3న ఈ కొత్త మోడల్ను విడుదల చేయాలని చూస్తుంది. ముందు అందరూ దీనిని గ్రాండ్ విటారా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అనుకున్నప్పటికీ తర్వాత కొత్త పేరుతో వస్తున్న లేటెస్ట్ SUV అని తెలిసింది. అయితే ఇందులో 5 సీట్లే ఉండనున్నాయి.
TG: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల గడువు పొడిగిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు 20తో సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ ప్రక్రియ ముగిసింది. కానీ, తాజాగా ఆగస్టు 31వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్స్ కోసం ఇదే చివరి అవకాశం అని తెలిపింది. అర్హులైన విద్యార్థులు వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది.
కోనసీమ: ఆలమూరులోని ప్రభుత్వ బొబ్బ జయశ్రీ బాలికల ఉన్నత పాఠశాలను ఎంపీడీవో రాజు ఆకస్మిక పరిశీల చేపట్టారు. భోజన సదుపాయాలు. విద్యాబోధన వంటకాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. పాఠశాల ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచి నిలువ నీరు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
KKD: ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కాకినాడ జిల్లా SFI అధ్యక్షులు జి. శ్రీకాంత్ కోరారు. ఇవాళ విద్యారంగంలోని సమస్యలపై ప్రతిపాడు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం అందించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగింది.24 క్యారెట్ల బంగారం: నిన్న 10 గ్రాముల ధర రూ.1,00,530 ఉండగా.. ఈ రోజు రూ.1090 పెరిగి రూ.1,01,620గా నమోదైంది.22 క్యారెట్ల బంగారం: నిన్న 10 గ్రాముల ధర రూ.92,150 ఉండగా.. ఈ రోజు రూ.1000 పెరిగి రూ.93,150కి చేరుకుంది.వెండి ధర: కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ.1,30,000కి చేరుకుంది.
బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగాయి.24 క్యారెట్ల బంగారం: నిన్న 10 గ్రాముల ధర రూ.1,00,530 ఉండగా.. ఈ రోజు రూ.1090 పెరిగి రూ.1,01,620గా నమోదైంది.22 క్యారెట్ల బంగారం: నిన్న 10 గ్రాముల ధర రూ.92,150 ఉండగా.. ఈ రోజు రూ.1000 పెరిగి రూ.93,150కి చేరుకుంది.వెండి ధర: కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ.1,30,000కి చేరుకుంది.