సోషల్ మీడియాలో వచ్చే సిబిల్ స్కోరు పెంచుతామనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ స్కోరు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వారు డబ్బు వసూలు చేస్తారు. నిజానికి సిబిల్ స్కోరు మీ ఆర్థిక క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుంది. పాత బాకీలు, ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తేనే స్కోరు పెరుగుతుంది తప్ప, ఎవరూ డబ్బుతో స్కోరును పెంచలేరని గ్రహించి అప్రమత్తంగా ఉండాలి.