• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

పాక్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. లీటరు పెట్రోల్ ధర రూ.265.45గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.278.44 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఈ పెంపు జరిగింది. దీని వల్ల పాక్ ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు ఇది మరింత నష్టం కలిగించనుంది.

November 1, 2025 / 10:29 AM IST

‘ఎస్సీ విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి’

KMR: తెలంగాణ ప్రభుత్వం పేద SC విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య PG/PhD కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని KMR జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్ సూచించారు. వెబ్‌సైట్‌లో NOV 19 వరకు దరఖాస్తుచేసుకోవాలని పేర్కొన్నారు.

November 1, 2025 / 09:34 AM IST

నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ

TG: ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజును ఇవాళ్టి నుంచి స్వీకరించనున్నారు. ఈనెల 14 వరకు చెల్లించాలి. రూ.100 ఫైన్‌తో ఈనెల 14-24, రూ.500తో ఈనెల 26-DEC 1 వరకు, రూ.2 వేల జరిమానాతో DEC 10-15 వరకు చెల్లించాలి. ENG ప్రాక్టికల్స్‌కు రూ.100 చెల్లించాలి. జనరల్ విద్యార్థులు రూ.630, ఫస్టియర్ ఒకేషనల్ రూ.870, సెకండియర్ ఆర్ట్స్ రూ.630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్‌ రూ.870 చెల్లించాలి.

November 1, 2025 / 07:00 AM IST

నిరుద్యోగ యువతకు ఉచితంగా ట్యాలీ శిక్షణ

ATP: నిరుద్యోగ యువతకు బెంగళూరులో ఉచితంగా ట్యాలీ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఉన్నతి ఫౌండేషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివి 18-28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఈనెల 10 నుంచి 35 రోజుల పాటు బెంగళూరులో ఇచ్చే ఉచిత శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.

November 1, 2025 / 06:21 AM IST

పదవి విరమణ చేసిన హెచ్ఎంకు సత్కారం

AKP: ఏటికొప్పాక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తూ శుక్రవారం పదవి విరమణ చేసిన హెచ్ఎం కేవీ సూర్యనారాయణకు పలువురు ఉపాధ్యాయులు ఘనంగా వీడ్కోలు పలికారు. విద్యా కమిటీ ఛైర్మన్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎంను ఘనంగా సత్కరించారు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన హెచ్ఎంను ఆదర్శంగా తీసుకోవాలని రామకృష్ణ సూచించారు.

October 31, 2025 / 06:59 PM IST

‘ఉత్తమ పౌరులుగా ఎదగండి’

VSP: విద్యార్థులు బాగా చదువుకుని ఉత్తమ పౌరులుగా గుర్తింపు పొందాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేఖ అన్నారు. శుక్రవారం కళాశాల వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని పేర్కొన్నారు. గొప్ప సంస్కరణలు చేసిన సర్దార్ అడుగుజాడల్లో నడవాలన్నారు.

October 31, 2025 / 06:50 PM IST

నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 465.75 పాయింట్లు నష్టపోయి 83,938.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 155.75 పాయింట్లు నష్టపోయి 25,722.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో ఎటెర్నల్, NTPC, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. BEL, L&T, TCS, ITC, SBIN లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.77గా ఉంది.

October 31, 2025 / 04:16 PM IST

BREAKING: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఇవాళ బంగారం ధరలు రెండో సారీ భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగ్గా.. మళ్లీ రూ.1,800 పెరిగి 1,23,280కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.1,100 పెరగ్గా.. మరోసారి రూ.1,650 పెరుగుదలతో రూ.1,13,000గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర స్థిరంగా రూ. 1,65,000గా ఉంది.

October 31, 2025 / 03:35 PM IST

ఏయూలో ‘విజిలెన్స్ అవేర్నెస్ వీక్’

VSP: అవినీతి నిరోధక, నిజాయితీ ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏయూలో ‘విజిలెన్స్ అవేర్నెస్ వీక్’ను నిర్వహించారు. CVC ఆధ్వర్యంలో విద్యార్థులకు అవినీతి గూర్చిన అవగాహన కల్పించి, సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి క‌ృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, ఆచార్యులు, సహ ఆచార్యులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూ అన్ని విభాగాలు పాల్గొన్నాయి.

October 31, 2025 / 03:08 PM IST

BREAKING: పరీక్షల షెడ్యూల్ రిలీజ్

TG: ఇంటర్ బోర్డు పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. FEB 21న ఫస్టియర్, FEB 2-21 సెకండియర్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ ఉ.9 నుంచి 12, మ.2 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లలో జరుగుతాయి. FEB 25 నుంచి MAR 15 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలుంటాయి. FEB 25న ఫస్టియర్, 26న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

October 31, 2025 / 12:19 PM IST

ALERT: 2,569 ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2,569 జూనియర్ ఇంజినర్(JE) పోస్టులకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 103 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. వివరాలకు http://www.rrbapply.gov.in/#/auth/landingను సందర్శించాలి.

October 31, 2025 / 11:03 AM IST

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరిగి రూ.1,22,680కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,12,450గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర స్థిరంగా రూ.1,65,000 వద్ద కొనసాగుతోంది.

October 31, 2025 / 09:55 AM IST

పీఎం శ్రీ పాఠశాలల్లో నియామకాలు!

TG: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 794 పీఎం శ్రీ పాఠశాలల్లో పార్ట్ టైం యోగా ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. యోగా టీచర్లు, స్పోర్ట్స్ కోచ్‌ల నియామకానికి ప్రభుత్వం రూ. 6.59కోట్లు విడుదల చేసింది. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే లక్ష్యం.

October 31, 2025 / 08:48 AM IST

‘నేటితో ఇంటర్ పరీక్ష ఫీజుకు గడువు పూర్తి’

KKD: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు శుక్రవారంతో ముగియనుందని కాకినాడ జిల్లా ఇంటర్ విద్య అధికారిణి (డీఐఈవో) ఐ. శారద తెలిపారు. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో నవంబర్ 6 వరకు అవకాశం కల్పించారన్నారు.

October 31, 2025 / 08:00 AM IST

జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌

జియో తమ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. జియో టెలికాం యూజర్లకు 18 నెలల పాటు గూగుల్ AI ‘జెమినీ ప్రో’ ప్లాన్ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. దీని విలువ రూ.35,100 ఉంటుందని తెలిపింది. ఇవాళ్టి నుంచే ఈ ఫ్రీ ప్లాన్ ప్రారంభమవుతుంది. తొలుత 18 నుంచి 25 ఏళ్ల వయసున్న కస్టమర్లకు అందించనుంది. అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ కలిగిన వారిని అర్హులుగా పేర్కొంది.

October 30, 2025 / 07:20 PM IST