వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ LPG సిలిండర్ ధర రూ.60, కమర్షియల్ వాణిజ్య సిలిండర్ ధర రూ.115 పెరిగింది. హైదరాబాద్లో LPG సిలిండర్ ధర రూ.965కు చేరింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఉజ్వల పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలు యథాతథం.
TG: ప్రజాసేవ చేసే అదృష్టం కలగడం గొప్ప అదృష్టమని, నిజాయితీగా ప్రజాసేవ చేస్తేనే గుర్తింపు వస్తుందని మల్కాజ్గిరి GJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్ధతుతో గెలిచిన అభ్యర్థులు హూందాగా వ్యవహరించాలని, గెలుపు గర్వం తలకెక్కించుకోకుండా నిజాయితీగా ప్రజాసేవ చేయాలని సూచించారు. లేదంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. అధికార మదంతో BRS ఒకప్పుడు విర్రవీగిందన్నారు.
TG: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. కుంభాభిషేకానికి వచ్చిన హైదరాబాద్ భక్తురాలి బ్యాగులోంచి రూ. 50 లక్షల బంగారాన్ని దుండగులు అపహరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆలయ సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
AP: విద్యార్థులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. హాల్ టికెట్ చూపించిన ప్రతీ విద్యార్థి ఫ్రీగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.
ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో రాజస్థాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఇతడు జోధ్పుర్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2023లో యూనియన్ టెరిటరీస్ సివిల్ సర్వీసెస్ సాధించాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఎస్డీఎంగా ప్రొబేషన్లో ఉన్నాడు. మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు.
SRPT: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ సూచించారు. శుక్రవారం అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కింద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలు నిపుణులైన వైద్య సేవలు, ఉచిత పరీక్షలు మరియు మందులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారామెడికల్ పోస్టులకు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీలలో జరగనున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పరీక్షలు నేటి నుండి మార్చి 13 వరకు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు సూచించింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ సాయంత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉదయంతో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,61,130కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.900 తగ్గి రూ.1,47,700గా నమోదైంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
TG: తెలంగాణలో ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులే.. ఇవాళ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో చాలా మంది సత్తా చాటారు. గుడెల్లి సృజన గ్రూప్1 లో డీఎస్పీ పదవి సాధించి.. ఇప్పుడు యూపీఎస్సీలో 55వ ర్యాంకుతో మెరిసింది. కొలిపాక శ్రీ కృష్ణ 150వ ర్యాంకు, ఎం. వెంకటేష్ 358వ ర్యాంకు, బి. విక్రమ్ 472వ ర్యాంకు, విక్రమ్ సింహా రెడ్డి 541వ ర్యాంకు, నవీన్ 715వ ర్యాంకు సాధించారు.
దేశ అత్యున్నత ఉద్యోగమైన సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకుతో మెరిశాడు. రాజేశ్వరి సువే రెండో ర్యాంకు, ఆకాన్ష్ ధుల్ మూడో ర్యాంకు సాధించగా.. రాఘవ్ ఝన్ఝన్ వాలాకు నాలుగో ర్యాంకు వచ్చింది. తెలుగువారిలో సృజన 55వ ర్యాంకు, DSK ప్రచేత్ 193, వర్షిత్ రెడ్డికి 259, పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకు సంపాదించాడు.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా.. తన ఎడ్జ్ 70 ఫ్యూజన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హోలోయూఐ, 6.78 అంగుళాల సూపర్ HD 1.5K అమోలెడ్ డిస్ ప్లే, 144Hz, వెనక వైపు 50 MP+13 MP కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, 7000mah బ్యాటరీతో వస్తుంది. 8GB+128GB వేరియంట్ ధరను రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది.
టాటా మెమోరియల్ సెంటర్(TMC)లో 3 క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినెన్స్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. బీ ఫార్మాసీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గల 35 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.27,000 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. రిలయన్స్ పవర్తో పాటు దాని అనుబంధ సంస్ధలపై ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది. నగదు అక్రమ చలామణి కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఈడీ అధికారిక ప్రకటనను విడుదలు చేసే అవకాశం ఉంది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC)లో 14 స్పెషలిస్ట్ గ్రేడ్-3(పబ్లిక్ హెల్త్) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. డిప్లొమా, డిగ్రీ, MBBSలో ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు తమ అప్లికేషన్ను ఢిల్లీలోని NCDC కార్యాలయానికి ఆఫ్లైన్లో పంపాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,23,500 జీతంగా చెల్లిస్తారు.
సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగే ఈ మేళాలో 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.