NZB: కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ ప్రభుత్వ ITIలో ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఎం.కోటిరెడ్డి తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్స్ CNC మెషినింగ్ టెక్నీషియన్లో అడ్మిషన్లు జరుగుతాయన్నారు.
KMR: తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11గం.లకు ఫార్మా కంపెనీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన 2022, 23, 24, 25 సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో హాజరు కావాలన్నారు.
AP: వైద్యారోగ్యశాఖలో185 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. MBBS అర్హతతో 155 మంది వైద్యుల పోస్టులు, స్పెషలిస్టు వైద్యుల పోస్టులు 30తో పాటు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు వచ్చే నెల 10నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
AP: DSC అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో రేపు మధ్యాహ్నం నుంచి కాల్లెటర్లు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులకు కేటాయించిన రోజు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. హాజరుకాని వారి అభ్యర్థిత్వం రద్దవుతుందని పేర్కొన్నారు. వారి స్థానంలో మెరిట్ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థులకు అవకాశమిస్తామని స్పష్టం చేశారు.
NRPT: నారాయణపేట మినీ స్టేడియం మైదానంలో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు చేశారు. అనంతరం MLA ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి ఖోఖో ఆడారు. ఆటలో విద్యార్థులకు చిక్కకుండా చాలా సమయం వరకు ఖోఖో ఆడి ఆటలో తన ప్రతిభను చూపారు. క్రీడలు అంటే ఇష్టామని ఆమె అన్నారు.
AP: DSC ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన విద్యార్థిని సంచలనం సృష్టించింది. వేలేరుపాడు మండలం కోయమాదారం గ్రామానికి చెందిన నాగుల మంగారాణి ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్లో ఫస్ట్ ర్యాంక్, TGTలో ఫిజిక్స్ ఫస్ట్ ర్యాంక్, సైన్స్ సెకండ్ ర్యాంక్, మ్యాథ్స్ ఫోర్త్ ర్యాంకు సాధించింది.
VSP: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025కు దేశవ్యాప్తంగా 45 మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. విశాఖకు చెందిన తిరుమల శ్రీదేవి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. అవార్డుతో పాటు రూ.50 వేలు, వెండి పతకం అందజేస్తారు. విశాఖకు చెందిన ఉపాధ్యాయురాలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించినందుకు పలువురు అభినందనలు తెలిపారు.
టెస్లా అధినేత మస్క్ ఏఐ చాట్ బాట్ గ్రోక్ కొంపముంచింది. దాదాపు 3 లక్షల 70 వేల మంది గ్రోక్ వినియోగదారుల చాట్ ఇంటర్నెట్లో లీక్ అయింది. యూజర్ల పర్సనల్ చాట్ గూగుల్ వంటి మరికొన్ని సెర్చ్ ఇంజిన్లలో బహిరంగంగా అందుబాటులో ఉంది. గ్రోక్ షేర్ ఆప్షన్ వల్ల ఈ డేటా లీక్ అయింది. దీంతో సంభాషణ నేరుగా పబ్లిక్ వెబ్పేజీలోకి వెళ్లిపోయాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
TG: హైదరాబాద్ బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్.. అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లను సెప్టెంబర్ 09 వరకు సమర్పించవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య 96 కాగా, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, బి.కామ్, బీఎస్సీ, బి.టెక్ లేదా బీఈ, డిప్లొమా, బి.లైబ్రరీ సైన్స్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ పెద్ద ఎత్తున తాత్కాలిక నియామకాలను చేపట్టింది. బిగ్ బిలియన్ డేస్ సమయంలో కస్టమర్ల తాకిడిని తట్టుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. సప్లయ్ చైన్, లాజిస్టిక్స్, లాస్ట్ మైల్ డెలివరీ రంగాల్లో 2,20,000కు పైగా తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. లాజిస్టిక్ నెట్ వర్క్ టైర్-2, టైర్-3 నగరాల్లో ఓన్లీ డెలీవరీలు హబ్లు ఏర్పాటు చేయనుంది.
సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. HCL- TEC-B ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భారత తపాలా శాఖ ఇవాళ్టి నుంచి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనుంది. US ఇటీవల విధించిన కస్టమ్స్ నిబంధనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. US విధించిన కొత్త సుంకాల ప్రకారం, అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది. తద్వారా పోస్టల్ సేవలపై అధిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
AP: రాష్ట్రంలో మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రేపటికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటికే డీఎస్సీ మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాల్ లెటర్లను ఇవాళ ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో ఉంచనున్నారు.
ASR: కొయ్యూరు మండలం వైఎన్ పాకలు గ్రామానికి చెందిన సెగ్గే తేజస్ రామాంజనేయ స్వరూప్ ఎన్ఐటీలో సీటు సాధించాడు. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన స్వరూప్కు మిజోరం ఎన్ఐటీలో మెకానికల్లో సీటు లభించిందని స్వరూప్ తండ్రి సతీష్ ఆదివారం తెలిపారు. మారుమూల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు ఎన్ఐటీలో సీటు సంపాదించడం పట్ల పలువురు అభినందించారు.