తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ 24 క్యారెట్ల, 22 క్యారెట్ల పసిడి ధరలు రూ.30 చొప్పున తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,210 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,020కు చేరింది. కాగా.. కిలో వెండి ధర రూ.1,10,900గా ఉంది.
W.G: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో కాపులకు EWS కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 103 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాపుల అభ్యున్నతికి తోడ్పడవల్సిందిగా ఆ వర్గం తరఫున కోరుతున్నానని పేర్కొన్నారు.
MHBD: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజిత తెలిపారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో డెలివరీ బాయ్స్గా పనిచేయుటకు ఉద్యోగాలు ఉన్నాయని.. పదవ తరగతి, ఆ పైన విద్యార్హత కల్గిన పురుష అభ్యర్థులకు జాబ్ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 8374054911 నెంబర్ ద్వారా సంప్రదించాలన్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తమ యూజర్లకు సరికొత్త ఫీచర్ పరిచయం చేసింది. ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వ్యక్తిగత, గ్రూప్ చాట్స్లో మరింత ప్రైవసీని మెయిన్టైన్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంచినట్లు వాట్సాప్ తెలిపింది.
ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక జారీ చేసింది. రిమోట్ ప్రాంతాల నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కోరింది. ఇకపై ఇంటి నుంచి పనిచేయటం కుదరని స్పష్టం చేసింది. రిపోర్టు చేయని పక్షంలో కంపెనీని వీడేందుకు సిద్ధం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. AIపై అత్యధికంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని కంపెనీ యోచిస్తోంది.
AP: కాసేపట్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. కాగా.. విద్యార్థులు తమ ఫలితాల వివరాలను HIT TV యాప్లో చూసుకోవచ్చు.
SKLM: ఈ ఏడాది UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా యువకుడు బన్న వెంకటేశ్ ఆల్ ఇండియా 15వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయనను ఫోన్లో అభినందించారు. వెంకటేశ్ తండ్రితో కూడా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకి గర్వకారణంగా ఉందని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలన్నారు.
HYD: ఉస్మానియా యూనివర్సిటీ, JNTUH, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీల్లో పలు పోస్టుల నియామకాల కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారి తెలిపారు. వర్సిటీల్లో ఈ మేరకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఎంపికలపై వీలైనంత త్వరగా చర్యలు చేపడుతున్నారు.
ELR: జిల్లాలో మంగళవారం నిర్వహించిన డీఈఎల్ఈడీ 3వ సెమిస్టర్ పరీక్షకు 46 అభ్యర్థులకు 45 మంది అభ్యర్థులు హాజరవ్వగా 1 గైర్హాజరు అయ్యారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అలాగే డీఈఎస్ఈడీ 1వ సెమిస్టర్ పరీక్షకు 92 మంది విద్యార్థులకు 89 మంది హాజరయ్యారని 3గురు అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు HIT TV తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందకుండా.. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు కూడా అవకాశం ఉంది. కాగా, మీ ఫలితాలను HIT TV యాప్లో చెక్ చేసుకోండి.
బంగారం పేరు వింటేనే సామాన్యులు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇవాళ గరిష్ట పెరుగుదల నమోదు చేసి రూ.లక్ష దాటింది. కేవలం 15 రోజుల్లో రూ.10వేలకుపైగా బంగారం ధర పెరిగింది. ఈ నెల 8న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,730 ఉండగా.. ఇవాళ రూ.1,01,350కి చేరింది. అయితే ధరలు విపరీతంగా పెరగటంతో కొనుగోలుదారులు తగ్గిపోయారని వ్యాపారులు వాపోతున్నారు.
NZB :మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాల కొరకు HIT TV యాప్ను చూడండి.
KDP: ముద్దనూరులోని గజ్జల చిన్న రంగారెడ్డి ఐటీఐ కళాశాల ఆవరణలో నేడు జాబ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని జువారి సిమెంట్ కంపెనీ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన వారు అర్హులని ఆయన వెల్లడించారు. ఈ ఆకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.
VZM: JEE మెయిన్స్లో వంగర మండలం విద్యార్థి ప్రతిభకనబరిచాడు. గ్రామానికి చెందిన పారిశర్ల భరద్వాజ్ JEE మెయిన్స్ ఫలితాల్లో 99.59 శాతంతో సత్తా చాటాడు. ఆలిండియా జనరల్ ర్యాంక్ 6,306, ఆల్ ఇండియా ఓబీసీలో 1,326 ర్యాంక్ సాధించాడు. భరద్వాజ్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా విశాఖలో ఉంటున్నారు. భరద్వాజ్ను పలువురు అభినందించారు.
CTR: గ్రీమ్స్ పేటలోని డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.