• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయిన మీషో షేర్లు

మీషో షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. NSEలో 46 శాతం ప్రీమియంతో, BSEలో 45.23 శాతం ప్రీమియంతో రూ.161.20 వద్ద లిస్ట్ అయ్యాయి. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు కలిగిన ఇ-కామర్స్ సంస్థ మీషో రూ.5,421 కోట్ల ఐపీఓ డిసెంబర్ 3 నుంచి 5 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చింది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.105-111గా నిర్ణయించింది.

December 10, 2025 / 10:33 AM IST

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 84,789 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 25,856 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.07గా ఉంది.

December 10, 2025 / 09:29 AM IST

ALERT: నేటి నుంచి టెట్ పరీక్షలు

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(TET) ప్రారంభం కానున్నాయి. రోజూ 2 సెషన్ల(9:30AM-12PM, 2:30PM-5PM)ల్లో ఈ నెల 21 వరకు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గంట ముందుగానే తమ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

December 10, 2025 / 07:08 AM IST

మిధానిలో పోస్టులు.. ఇవాళే ఆఖరు

హైదరాబాద్‌లోని మిశ్రమ ధాతు నిగమ్‌లో 210 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, డిప్లొమా, BE ,BTech అర్హత గల 30 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATSలో నమోదు చేసుకోవాలి. ఎంపికైన ITI అప్రెంటిస్‌లకు నెలకు రూ.9600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12300, టెక్నీషియన్‌లకు రూ.10900 స్టైఫండ్ చెల్లిస్తారు.

December 10, 2025 / 06:47 AM IST

BREAKING: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు పరీక్షకు మధ్య మూడు రోజుల గ్యాప్ ఉండనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ విధంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

December 9, 2025 / 06:16 PM IST

ఏడాదిలో 20% పడిపోయిన IPL వాల్యూ

ఏడాదిలోనే IPL బ్రాండ్ వాల్యూ 20% పడిపోయినట్లు బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టులో వెల్లడైంది. 2024లో $12 బిలియన్లుగా ఉన్న  IPL వాల్యూ.. 2025 నాటికి $9.6Bకి పతనమైంది. అటు ఫ్రాంచైజీల పరంగా $108 మిలియన్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. RCB($105M), CSK($93M) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నాయి. స్ట్రాంగెస్ట్ IPL ఫ్రాంచైజీలుగా CSK(92.6), RCB(89.5), MI(85) టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి.

December 9, 2025 / 11:01 AM IST

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 636.96 పాయింట్లు నష్టపోయి 84465.73 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 199.25 పాయింట్ల నష్టంతో 25761.30 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.02 గా ఉంది.

December 9, 2025 / 09:43 AM IST

25,487 SSC పోస్టులు.. అప్లై చేశారా?

టెన్త్ అర్హతతో కేంద్ర బలగాల్లో 25,487 పోస్టులకు SSC దరఖాస్తులు స్వీకరిస్తోంది. BSFలో 616, CISF 14595, CRPF 5490, SSB 1764, ITBP 1293, ARలో 1706 పోస్టులు ఉండగా.. ఆసక్తిగల 23 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చు. PET, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

December 9, 2025 / 09:03 AM IST

39 పోస్టులు.. నేడే ఆఖరు తేదీ

బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్(BVFCL)లో 39 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. మేనేజ్మెంట్ ట్రైనీ, నాన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఉండగా.. సంబంధిత అకడమిక్ అర్హతతో పాటు పని అనుభవం కలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bvfl.com

December 9, 2025 / 06:23 AM IST

వడ్డీ రేట్లు తగ్గించిన HDFC, PNB

రెపో రేటులో RBI కోత విధించిన నేపథ్యంలో HDFC, PNB బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో HDFCలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు(MCLR) కాల వ్యవధిని బట్టి 8.30 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గాయి. అలాగే PNB తన రెపో లింక్డ్ లెండింగ్ రేటు(RLLR)ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి కుదించింది.

December 9, 2025 / 03:00 AM IST

గూగుల్‌తో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం

గూగుల్‌ సంస్థతో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS)కు ప్రత్యామ్నాయంగా రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS)ను అందించేలా ఈ డీల్ ఉండనుంది. రీడ్ రిసీప్ట్‌లు, ఫైల్ షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఫీచర్లను యూజర్లకు RCS అందించనుంది. అటు గూగుల్ ఇంటెలిజెంట్ స్పామ్ ఫిల్టర్‌లో భాగస్వామి అయ్యేందుకు ఎయిర్‌టెల్ అంగీకరించింది.

December 8, 2025 / 05:31 PM IST

సైబర్ మోసాలు.. సెబీ కీలక నిర్ణయం

గత కొంత కాలంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను టార్గెట్ చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల రక్షణ కోసం సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ మధ్యవర్తులు చెప్పే లాభాల గణాంకాలను స్వతంత్రంగా ధృవీకరించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ‘పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్’ ఏజెన్సీ‌ని ఆవిష్కరించింది.

December 8, 2025 / 04:29 PM IST

భారీగా పతనమైన ఇండిగో షేర్లు

ఇండిగో (ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ మొదట్లో 7 శాతం విలువ కోల్పోయాయి. ఉదయం 10 గంటల సమయానికి 4.08 శాతం నష్టంతో రూ.5,151 వద్ద షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో మదుపర్లు అభద్రతా భావంతో ఈ షేర్ల నుంచి పెట్టుబుడులు వెనక్కి తీసుకుంటున్నారు.

December 8, 2025 / 10:11 AM IST

పదోతరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు 

AP: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 9 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.

December 8, 2025 / 07:15 AM IST

3 కోర్ బ్రాంచీలుంటేనే అదనపు బీటెక్ సీట్లు

బీటెక్ సీట్లు పెంచుకోవాలంటే కచ్చితంగా మూడు కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్ కోర్సులు తప్పనిసరిగా ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతుల విధాన పత్రాన్ని తాజాగా విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌కు సంబంధం లేనివి కనీసం రెండు కోర్ బ్రాంచీలు ఉంటేనే అదనపు సీట్లు మంజూరు చేస్తామని పేర్కొంది.

December 8, 2025 / 06:27 AM IST