పీఎం జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన 75 కోట్ల పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ నిబంధన లేదని కేంద్రమంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. కనీస బ్యాలెన్స్ లేకపోయిన వీటికి ఎలాంటి జరిమాన పడదన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే సున్నా-నిల్వ ఖాతా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే డిపాజిట్, నగదు ఉపసంహరణ, ఏటీఎం సేవలకు కూడా ఛార్జీలు ఉండవని తెలిపారు.
బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను RBI విడుదల చేసింది. ముందస్తు GST చెల్లింపుల నేపథ్యంలో బ్యాంకుల్లో భారీగా నగదు చలామణి అవుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు మార్కెట్ ఆపరేషన్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి బ్యాకింగ్ వ్యవస్థలోకి RBI రూ.50 వేల కోట్లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవస్థలో రూ.2.41-3.02 లక్షల కోట్ల వరకు మిగులు ఉన్నట్లు అంచనా.
ద్విచక్ర వాహనాన్ని కొనాలనుకునే వారికి ఓలా ఎలక్ట్రిక్ శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకున్న నేపథ్యంలో కంపెనీ ‘ఛాంపియన్ మహోత్సవ్’ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఓలాకు చెందిన అన్ని వాహనాలపై రూ.10 వేల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. 3 రోజుల పాటు ఈ ఆఫర్ అమలులో ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్ను అందిపుచ్చుకోవాలని వినియోగదారులకు సూచించింది.
వేసవిలో ఎండలతో పాటు ఏసీల ధరలు కూడా మండనున్నాయి. ఏసీ తయారీలో రాగి వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి తగ్గే కొద్దీ కంపెనీలకు భారం పెరుగుతోంది. దీంతో ఏసీల ధరలు 5-15% పెరిగే అవకాశం ఉంది. వోల్టాస్, బ్లూస్టార్, LG, హయర్, దైకిన్ వంటి కంపెనీలు తమ అన్ని మోడళ్ల ఏసీల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
భారీ నష్టాల వేళ ఐటీ స్టాక్స్ రాణించాయి. విప్రో, LTM, HCL టెక్నాలజీస్, కోఫోర్జ్ స్టాక్స్ లాభపడ్డాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం కావడం ఈ స్టాక్స్కు కలిసొచ్చింది. ఆయా కంపెనీలకు ఆదాయం డాలర్లలో ఉండడం, ఖర్చులు రూపాయల్లో ఉండడం ఇందుకు కారణం. అలాగే, గత నెల ఐటీ స్టాక్స్ భారీగా పతనమైన నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు కనిపించింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇటీవల 70 డాలర్లు ఉన్న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఇప్పుడు 110 డాలర్లు దాటింది. దీంతో 1973 నాటి చమురు సంక్షోభాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ప్రపంచ చమురు వాణిజ్యంలో అతిపెద్ద సంక్షోభంగా 1973ని వ్యవహరిస్తారు. అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. అప్పట్లో ఒక్కో బ్యారెల్ 3 డాలర్లు ఉండగా ఆంక్షల ఫలితంగా 12 డాలర్లకు చేరింది.
దేశవ్యాప్తంగా IITలలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 17వ తేదీన నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి విదేశీ విద్యార్థులు, ఏప్రిల్ 23 నుంచి భారతీయ విద్యార్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మే 2న రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ. హాల్టికెట్లు మే 11 నుంచి అందుబాటులో ఉంటాయి. jeeadv.ac.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
‘టెక్ మహీంద్రాలో భారీ లేఆఫ్లు’ అంటూ జరుగుతున్న ప్రచారంపై దిగ్గజ టెక్ సంస్థ స్పందించింది. ఉద్యోగులను తొలగించబోతున్నామనే వార్తల్లో వాస్తవం లేదని, కంపెనీ వద్ద ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనలేమీ లేవని స్టాక్ ఎక్ఛేంజీ ఫైలింగ్లో స్పష్టంచేసింది. కాగా AI ప్రభావంతో సదరు టెక్ కంపెనీ 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
AI కారణంగా గతేడాది 46 మంది కొత్త బిలియనీర్లు చేరారని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 4,020 మంది కుబేరుల్లో AI బిలియనీర్ల సంఖ్య 114కు చేరిందని, గతేడాది 700 మందికిపైగా కొత్త బిలియనీర్లు చేరారని రిపోర్టు తెలిపింది. అంటే రోజుకు ఇద్దరు చొప్పున సంపన్నులు జాబితాలో చేరారు. అత్యధికంగా NVDU ఫౌండర్ హువాంగ్ సంపద 34% పెరిగి 172 బిలియన్ డాలర్లకు చేరింది.
ముఖేష్ అంబానీ రూ.9.8 లక్షల కోట్లు, గౌతమ్ అదానీ రూ.7.5 లక్షల కోట్లు, రోష్నీ నాడార్ రూ.3.2 లక్షల కోట్లు, సైరస్ ఎస్ పూనావల్ల రూ.3.0 లక్షల కోట్లు, కుమార్ బిర్లా రూ.2.5 లక్షల కోట్లు, దిలీప్ షాంఘ్వీ రూ.2.3 లక్షల కోట్లు, అజీమ్ ప్రేమ్జీ రూ.2.3 లక్షల కోట్లు, నీరజ్ బజాజ్ రూ.2.2 లక్షల కోట్లు, అశోక్ హిందూజా రూ.2.2 లక్షల కోట్లు, రాధాకృష్ణ దమానీ రూ.1.5 లక్షల కోట్లు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై విజయం సాధించి టోర్నీని కైవసం చేసుకున్నది. కాగా, బ్రాడ్కాస్టర్ జియోస్టార్ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు యాడ్ ఎగ్జిక్యూటివ్లు తెలిపారు. టీవీలు, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఎక్కువమంది యూజర్లను ఆకర్షించవచ్చని కంపెనీలు భావించాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2,182 పాయింట్లు పడిపోయి 76,724కి, నిఫ్టీ 659 పాయింట్లు తగ్గి 23,747 స్థాయికి చేరుకున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.92.29గా ఉంది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ పడింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. జపాన్ సూచీ నిక్కీ 7శాతం పతనమైంది. 1000 పాయింట్లకు పైగా డౌ ప్యూచర్స్ పడిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లపైనా క్రూడాయిల్ ప్రభావం పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ నష్టాలు కనిపించే అవకాశం ఉంది. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.