SKLM: అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో అడ్మిషన్లు ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కో-ఆర్డినేటర్ గుంపుల గ్రేస్ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇటీవల జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించడం జరుగుతుందన్నారు.
CTR: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. చిత్తూరు జిల్లాలో 5,294 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా.. 2,173 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,521 మంది పరీక్షలు రాయగా.. 2,048 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ 41%, సెకండ్ ఇయర్లో 58% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా 20వ స్థానంలో నిలిచింది.
NDL: నందికొట్కూరుకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఈ పురస్కారం అందించనున్నారు. అఖిల్ 990 (ఎంపీసీ), పి. మేఘన 989 (ఎంపీసీ), పి. సుహానా బేగం 986 (బైపీసీ), ఎం. నవీన్ 980(ఎంపీసీ) మార్కులతో ప్రతిభ చూపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో స్పోర్ట్స్ కోటా కింద 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇవాళ్టితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఇంటర్ పాసైన, 18-23 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.81,100 వరకు వేతనం ఇస్తారు. వెబ్సైట్ cisfrectt.cisf.gov.in
ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిభ అవార్డులకు పొదిలిలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థి షేక్ రబ్బానీ ముస్కాన్కు లభించిందని ఆమె తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో 1000 మార్కులకు 988 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ స్ధానంలో నిలిచింది. దీంతో ప్రతిభ అవార్డుకు ఆమెను ఎంపిక చేయడం జరిగింది.
KKD: ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీలకు అవకాశం ఏర్పడింది. బుధవారం వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ఆప్షన్ ఇచ్చుకోవాలని సూచించారు.
ప్రకాశం: ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఈనెల 4న క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎంవీ నాగేశ్వరరావు తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేళా జరుగుతుందని చెప్పారు.
కోనసీమ: రామచంద్రాపురంలోని ఉపాధి భవన్లో ఈనెల 3న ఉదయం 9:30 గంటలకు ప్రముఖ కంపెనీలైన కోజెంట్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, మెక్వన్, బెర్గెన్ పైప్ సపోర్ట్ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్, ఉపాధి భవన్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాలో భాగంగా నిర్వహించబడుతుందని పేర్కొంది.
ELR: వేసవి విరామం అనంతరం సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 137 జూనియర్ కళాశాలలున్నాయి. 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన 1,919 మంది విద్యార్థులతోపాటు, కొత్తగా ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు హాజరుకావాలని డీఐఈవో టి. శేఖర్ బాబు తెలిపారు.
KRNL: జిల్లాలో ఈనెల 2న జరగనున్న డీఈఈ సెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9885716544 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని కోరారు. హాల్ టికెట్లను apdeecet.apcfss.inవెబ్సైట్ నుంచి పొందొచ్చని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో శనివారం నుంచి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల కేంద్రంలో సుమారు మూడు రోజులపాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ మూల్యానికి ప్రక్రియ చీఫ్ ఎగ్జామినర్స్ వంటి 250 మంది అధికారులను నియమించారు.
AP: ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APEDCET-2025) హాల్టికెట్స్ విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్, హాల్టికెట్ నంబర్ నమోదు చేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది. హాల్టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TG: రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి నీట్ కౌన్సిలింగ్తో సంబంధం లేకుండా నెల రోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేయనుంది. నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తుల నమోదుకు మూడు వారాల గడువు ఇచ్చి ఆ తర్వాత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు.
AP: PGCET-2025 ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదలైంది. పరీక్ష తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో పొందుపరిచింది. జూన్ 9 నుంచి 12 వరకు ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు పరీక్ష తేదీలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
VZM: బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి డిగ్రీ కలేజీలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. 18-35 ఏళ్లలోపు యువత ఉదయం 9గంటలకు కాలేజీకి చేరుకోవాలన్నారు. 18 కంపెనీలు ఈ మేళాకు హాజరవుతున్నాయన్నారు.