HYD: Ed.CET-2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైనట్లు HYD ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నవారు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొనాల్సిన అవసరం లేదని, డైరెక్ట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లికేషన్లు కోరుతోంది. ఆయా పోస్టులకు డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. సెప్టెంబర్ 4న ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు PGIMER.EDU.IN వెబ్ సైట్లో సంప్రదించగలరు.
నిన్నటితో పోల్చితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై కేవలం రూ.10 పెరగటంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,610గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.94,060 ఉంది. కాగా, కిలో వెండి స్వల్పంగా రూ.100 తగ్గటంతో రూ.1,29,900గా ఉంది.
RR: గచ్చిబౌలిలోని మనూలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీవో ఈ డైరెక్టర్ ప్రొఫెసర్ మహమ్మద్ రజౌల్లాఖాన్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం కోసం ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నామని, ఈనెల 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.
KKD: జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. అపోలో ఫార్మసీ, టాటా ఏఐఏ, న్యూ ఎన్నోలెర్న్ సంస్థల్లో 123 ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయన్నారు. 18-35 సంవత్సరాల వయసు కలిగి, టెన్త్ నుంచి డిగ్రీ అర్హత ఉన్నవారు తమ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.
HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ, ఎంఈ, ఎంటెక్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ వచ్చే నెల 2వ తేదీ, ఎంఈ, ఎంటెక్ వచ్చే నెల 9వ తేదీలోగా అన్నిసెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలని www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
KKD: కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. అపోలో ఫార్మసీ, టాటా ఏఐఏ, న్యూ ఇన్నోలెర్న్ సంస్థల్లో 123 ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయన్నారు. 18-35 సంవత్సరాల వయసు గల టెన్త్ నుంచి డిగ్రీ అర్హత ఉన్నవారు తమ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.
TG: భారీ వర్షాల నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(JNTU) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రద్దు చేసిన పరీక్షల రీషెడ్యూల్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
TG: భారీ వర్షాల కారణంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటన విడుదల చేశారు. ఇవాళ, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే KU అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్481.44 పాయింట్లు నష్టపోయి 80,305.10 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 138.75 పాయింట్ల నష్టంతో 24,573.30 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.60 గా ఉంది.
ADB: సాత్నాల ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. బుధవారం ప్రాజెక్టు వరద గేట్లు నుంచి ఎప్పుడైనా నీళ్లను దిగువకు వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతం దిగువన పశువులు, గొర్రెలు వెళ్లకుండా జాగ్రత్త ఉండాలని సూచించారు.
W.G: వినాయక చవితి సందర్భంగా భీమవరం మండలంలోసరి శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పిల్లలచే మట్టి వినాయక ప్రతిమలు చేయించి, వాటితో ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపాల్ తిరుమాని బాబా చంద్రిక తెలిపారు.
ATP: ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ పరీక్ష ఫలితాలలో గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండ గ్రామానికి చెందిన రాజేష్ నాయక్ SGT పోస్ట్ కైవసం చేసుకున్నాడు. రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజేష్ నాయక్ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు.
VSK: సీఎం చంద్రబాబు 29న జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్లో జరగనున్న ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిటికి హాజరవుతారు. అనంతరం 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్వర్క్ మీటింగ్లో పాల్గొంటారు.
జూలై, ఆగస్టు నెలల్లో ఐపీఓలతో మార్కెట్లో జోష్ కొనసాగింది. ఇందుకు సంబంధించి గూగుల్లో గత నెల వ్యవధిలో సెర్చ్ చేసిన టాప్ ఐదు ఐపీఓలను వెల్లడించింది. ఆదిత్య ఇన్ఫోటెక్, ఎన్ఎస్డీఎల్, జీఎన్జీ ఎలక్ట్రానిక్స్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగల్ రిసోర్సెస్లు టాప్-5లో ఉన్నట్లు తెలిపింది.