AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి జీతాలు పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375కు పెంచగా, నెలకు అత్యధికంగా రూ.27వేలుగా నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
AP: ఈఏపీసెట్(EAPCET) 2025 పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SKLM: జలుమూరు మండలం కరవంజ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని హెచ్ఎం టి. ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక పాఠశాలలో సైన్స్ తరగతుల సంబంధించి రెమిడీయల్ క్లాసులు నిర్వహించామన్నారు. సెలవు దినాలలో తప్ప మిగిలిన రోజులు ప్రతి సబ్జెక్టు పైన ఆయా ఉపాధ్యాయులతో క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
SKLM: హిరమండలం మండలం కూర్మ వైదిక గ్రామంలో వర్ణాశ్రమ కళాశాలలో చేతివృత్తులపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు ప్రభుదాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పూర్వ వృత్తుల పునరుద్ధరణ, సత్ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహణ, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడం వంటి అనేక అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు శిక్షణ పొందవచ్చు.
kMM: ఉమ్మడి జిల్లా పరిధిలో డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6 సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థులు సకాలంలో రుసుములు చెల్లించాలన్నారు. ఈనెల31లోగా పరీక్షల రుసుమును చెల్లించాలని ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డా.మొహ్మద్ జాకిరుల్లా, ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డా.బి.వీరన్న తెలిపారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ఉంటుందని శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ పరిశ్రమలో ఉపాధి, శిక్షణ పొందుటకు అర్హులని తెలిపారు. ఈ అవకాశం అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కృష్ణా: గుడివాడ పట్టణంలోని అక్కినేని నాగేశ్వరావు కళాశాలలో ఈనెల 14వ తేదీన ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
HYD: హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఇంటర్ పాసైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సురేశాబాబు గురువారం తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 840 సీట్లు ఉన్నాయని, దోస్త్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
W.G: నిడదవోలులోని SVRK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12వ తేదీ నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. నిరుద్యోగులతో పాటు, గృహిణులకు కంప్యూటర్ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్, ఇంటర్నెట్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తామన్నారు. 16-38 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టెలివిజన్, ఫిల్మ్ స్టడీస్లో మాస్టర్స్ కోర్సు కోసం మే 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ రైటింగ్లో శిక్షణ, ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్లుగా రూపొందించిన సిలబస్, ఇంటర్న్షిప్ అవకాశాలు ఈ కోర్సు ప్రత్యేకతలు. ప్రవేశాలు APPGCET ద్వారా జరుగుతాయి. వివరాలకు cets.apsche.ap.gov.in చూడండి.
NGKL: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో BZC, MZC, ఎంపీసీ, ఎంపీసీఎస్ కోర్సుల్లో సీట్లు ఉన్నట్లు తెలిపారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని 4 సంవత్సరాల బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధికారి రాజకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. పరీక్షల తేదీలను త్వరలో వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు.
ADB: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం DOST నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ADB జిల్లా విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె. సంగీత తెలిపారు. మే 3 నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ సెంటర్ను సందర్శించాలన్నారు.
SKLM: ప్రాథమిక స్థాయి నుంచే జాతీయ నాయకుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని రిసోర్స్ పర్సన్ లంకలపల్లి సూర్యనారాయణ అన్నారు. సోమవారం లావేరు గ్రంథాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి జాతీయ నాయకుల జీవిత చరిత్ర క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అలాగే ప్రతిరోజు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
W.G: ఉండి ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12వ తేదీ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐల జిల్లా ప్రధానాధికారి శ్రీనివాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐలలో 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో వివిధ కోర్సులు పూర్తి చేసి అప్రెంటిస్షిప్ చేయని అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు అన్నిధ్రువపత్రాలతో తీసుకొని రావాలని సూచించారు.