• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

‘పాఠశాలలకు రాకున్నా టీచర్లకు జీతాలు’

TG: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలువురు టీచర్లపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మక్కరాజ్ పేట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయులు నెలల తరబడి పాఠశాలలకు రాకున్నా.. అధికారులతో కుమ్మక్కై పూర్తి వేతనాలు తీసుకున్నారట. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపించాలని హైదరాబాద్ ఆర్జేడీ, మెదక్ డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

November 7, 2025 / 09:52 AM IST

భారీగా పతనమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 534.85 పాయింట్లు నష్టపోయి 82776.16 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 159.85 పాయింట్ల నష్టంతో 25349.85 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.66గా ఉంది.

November 7, 2025 / 09:34 AM IST

కారే కొంటామంటున్నారు..!

TG: ప్రయాణాల విషయంలో రాష్ట్ర ప్రజల మనసు మారుతోంది. గతంలో ఎక్కడికైనా వెళ్లాలంటే.. బస్సులు, బైకులు, స్కూటీలపై వెళ్లేవారు. కానీ పరిస్థితి మారింది. ఇప్పుడు ఎక్కువగా కార్ల వైపే మొగ్గుచూపుతున్నారు. 2014-15తో పోలిస్తే.. 2024-25 సంవత్సరంలో ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్లు కేవలం 4.56 శాతం వృద్ధి చెందగా.. కార్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 69.76 శాతం పెరిగాయి.

November 7, 2025 / 09:04 AM IST

ఏఐ రేసులో అమెరికాను ఓడిస్తాం: చైనా

కృత్రిమ మేధస్సు రేసులో అమెరికాను ఓడిస్తామని చైనాకు చెందిన ఎన్విడియా సంస్థ సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. ఏఐలో అమెరికా కంటే చైనా నానో సెకన్లు వెనకబడి ఉందని వెల్లడించారు. దీనిని త్వరలోనే అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

November 7, 2025 / 06:45 AM IST

దేశంలో టాప్ దాతలు వీరే

➢ శివ్ నాడార్ కుటుంబం (రూ.2708 కోట్లు)➢ ముఖేష్ అంబానీ కుటుంబం(రూ.626 కోట్లు)➢ బజాజ్ కుటుంబం( రూ.446 కోట్లు)➢ కుమార్ మంగళం బిర్లా కుటుంబం(రూ.440 కోట్లు)➢ గౌతమ్ అదానీ కుటుంబం(రూ.386 కోట్లు)➢ నందన్ నీలేకని కుటుంబం(రూ.365 కోట్లు)

November 7, 2025 / 04:10 AM IST

GOOD NEWS: నాబార్డ్‌లో ఉద్యోగావకాశాలు

ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాబార్డ్ ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, గరిష్టంగా 33 ఏళ్లు ఉన్న అభ్యర్థులు అర్హులు అని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. పూర్తి వివరాలకు nabfins.orgను సంప్రదించాలని సూచించింది.

November 6, 2025 / 09:03 PM IST

11 నుంచి IPOకు ఫిజిక్స్ వాలా

ప్రముఖ ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ ఫిజిక్స్‌వాలా IPO వచ్చేందుకు సిద్ధమైంది. రూ.3480 కోట్లు నిధులు సమీకరించేందుకు NOV 11న సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. NOV13న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 10న బిడ్డింగ్‌ విండో తెరుచుకోనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.103- 109గా నిర్ణయించింది. రూ.31,500 కోట్ల మార్కెట్‌ విలువతో IPOకు వస్తోంది.

November 6, 2025 / 02:02 PM IST

మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా?

SBI తమ ఖాతాదారుల కోసం ‘పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ పాలసీని అందిస్తోంది. ఖాతాదారుడు ఏడాదికి రూ.2,000 ప్రీమియం చెల్లించాలి. రోజువారీగా లెక్కిస్తే రూ.5.48 మాత్రమే అవుతుంది. ఈ పాలసీ ద్వారా ఊహించని ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.40 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాముకాటు మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

November 6, 2025 / 01:35 PM IST

మీకు SBIలో అకౌంట్ ఉందా?

SBI తమ ఖాతాదారుల కోసం ‘పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ పాలసీని అందిస్తోంది. ఖాతాదారుడు ఏడాదికి రూ.2,000 ప్రీమియం చెల్లించాలి. రోజువారీగా లెక్కిస్తే రూ.5.48 మాత్రమే అవుతుంది. ఈ పాలసీ ద్వారా ఊహించని ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.40 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాముకాటు మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.

November 6, 2025 / 01:35 PM IST

నాలుగో రోజు కొనసాగుతున్న బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో నాలుగో రోజు బంద్ కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ బంద్‌ను చేపట్టాయి. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం వెంటనే సగం బకాయిలు విడుదల చేస్తేనే బంద్‌ను ఉపసంహరించుకుంటామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

November 6, 2025 / 09:59 AM IST

4.3 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.3గా నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్‌ల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.

November 6, 2025 / 09:22 AM IST

మోటో నుంచి G67 Power

మోటోరొలా మరో కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. తన ‘జీ’ సిరీస్‌లో మోటో జీ67 పవర్ 5జీ పేరిట దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. జీ సెగ్మెంట్‌లో బెస్ట్ 50 MP కెమెరాగా వెల్లడించింది. 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 2 ప్రాసెసర్ అమర్చారు. 7,000 mAH బ్యాటరీ, 30W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

November 5, 2025 / 02:46 PM IST

మధ్యాహ్న భోజనం.. రేట్లు పెంపు

TG: పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి అందించే ధరలను పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ. 5.45ను రూ. 6.19కి, ప్రాథమికోన్నత స్కూళ్లలో రూ. 8.17 నుంచి రూ. 9.29కి పెంచింది. 9, 10వ తరగతుల విద్యార్థులకు రూ. 10.67 నుంచి రూ. 11.79కి పెంచింది.

November 5, 2025 / 01:17 PM IST

GOOD NEWS: తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,21,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.900 తగ్గి రూ.1,11,350 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.2,000 తగ్గి రూ.1,63,000లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

November 5, 2025 / 09:50 AM IST

నిరుద్యోగులకు GOOD NEWS

TG: భారత సైన్యంలో చేరేందుకు ‘అగ్నివీర్’ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నెల 10 నుంచి 22 వరకు హన్మకొండలోని JN స్టేడియంలో నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పదో తరగతి పూర్తి చేసుకున్న అభ్యర్థులు పాల్గొనవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలకు 040-27740059, 27740205 నంబర్లను సంప్రదించవచ్చని సూచించింది.

November 4, 2025 / 07:02 PM IST