BDK: అశ్వాపురం మండలం చింతిర్యాల గోదావరిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని సోమవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి అక్రమ ఇసుక రవాణా గురించి తీసుకువెళ్లినా పట్టించుకునే నాధుడే లేరని అన్నారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించాలని అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.