నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, కనుపర్తిపాడు లో 22.50 లక్షల రూపాయల వ్యయంతో 2.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్.టి. కాలనీ శ్మశాన వాటికలో పనులు జరుగుతున్నాయి. మంగళవారం ప్రహరీ గోడ నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.