GDWL: జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ సంధ్యా కిరణ్మయి ఆదేశాల మేరకు, ప్రతిరోజూ సీహెచ్సీ, పీహెచ్సీ, జిల్లా ఆస్పత్రుల్లో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 14 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలికలందరు వినియోగించుకోవలన్నారు.