PPM: శిశు, బాలల ఆరోగ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించి వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదల ధ్యేయంగా కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమ జిల్లా అధికారి డా. టి.జగన్ మోహనరావు పేర్కొన్నారు. జగన్నాధపురం 30వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు తేదీకి టీకా అర్హుల జాబితా పరిశీలించారు.