KNR: ఓటరు జాబితా నుంచి అక్రమంగా పేర్ల తొలగింపునకు BJP చేస్తున్న కుట్రలను ఎండగడతామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రణవ్ బాబు హెచ్చరించారు. హుజురాబాద్ పట్టణ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకులతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలను వలసవాదులుగా చిత్రీకరిస్తూ ఓట్లు తొలగించడం దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు BLOల వెంట ఉండి అక్రమాలను అడ్డుకుంటామన్నారు.