అన్నమయ్య: రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేతలు విమర్శించారు. గిట్టుబాటు ధరలు, ఎరువుల కొరత, మార్కెట్ దోపిడీతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.