KRNL: ఆస్పరిలో చెత్త సేకరణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన రిక్షాలు పంచాయతీ కార్యాలయంలో మూలనపడి వృధాగా మారాయి. నిర్వహణ లోపంతో ఇవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.