E.G: భారత రత్న Dr. B.R. అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి 108 ప్రధాన కార్యాలయంలో ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కేక్ కట్ చేసి జిల్లా ప్రజలు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా 108 సిబ్బంది, కొవ్వూరు నియోనేటల్ సిబ్బంది పాల్గొన్నారు.