NLR: ఉదయగిరి మండల పరిధిలోని 17 పంచాయతీల్లో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీవో ఎస్.మోహన్ రావు ఇవాళ గ్రామసభలు నిర్వహించారు. మండల పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో పంచాయతీలు కేటాయించిన ఆర్థిక నిధుల పనులు చేపట్టే విధంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.