కోనసీమ: ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో ఇవాళ ఉపాధి హామీ పనులలో పాల్గొన్న మెర్ల సత్యనారాయణకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఉపాధి సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఉపాధి హామీ అధికారులు Ch. విజయ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.