CTR: “సురక్షిత చిత్తూరు” కార్యక్రమంలో భాగంగా కుప్పం సబ్డివిజన్లో మహిళల భద్రత, డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ బి. పార్థసారధి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు నేరాల నివారణ, మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు.