ఏలూరు డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు సహజ సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళాను కలెక్టర్ వెట్రి సెల్వి ఇవాళ ప్రారంభించారు. సహజ సేంద్రియ ఉత్పత్తులను ప్రతి ఒక్కరు వినియోగించి ఆరోగ్యంవంతులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.