KDP: స్వచ్ఛ గ్రామ లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛ రథాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాలాయపల్లె పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పోరుమామిళ్ల మండలం బాలాయపల్లె ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన, విద్యార్థులకు స్వచ్ఛ రథం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పాత సామాగ్రిని అందజేసి ప్రతిఫలంగా నిత్యావసర వస్తువులు పొందవచ్చని తెలిపారు.