KDP: నగరంలోని ఎర్రముక్కపల్లి–విశ్వనాధపురం మధ్య పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సీఎం పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన లభించింది. రెండు సంవత్సరాలుగా పనులు పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బ్రిడ్జిని పూర్తి చేయాలని సాధన కమిటీ డిమాండ్ చేశారు.