E.G: గోకవరం మండలం తంటికొండ గ్రామంలో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భరత్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తంటికొండ గ్రామానికి చెందిన రైతులు అందరూ రైతు సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పంటలకు సరైన ధర పొందాలని సూచించారు.