PLD: రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామ పరిసరాల్లో మహిళపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్న కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ముప్పాళ్లకు చెందిన చైతన్యపై మార్చి 16 రాత్రి దాడి జరగగా, బంగారం, సిల్వర్ రింగ్స్ దోచుకెళ్లినట్లు వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకుని నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.