BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మహనీయుల జయంతోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ గతిని మార్చిన ముగ్గురు గొప్ప నేతలు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు.