అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షల భద్రతను ఎస్పీ ధీరజ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. రాయచోటి జూనియర్ కళాశాల, సంబేపల్లి గురుకుల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, 144 సెక్షన్ అమలును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద అపరిచిత వ్యక్తులు ఉండరాదని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.