ATP: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని శాఖల అధికారులు సహకరించి, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా 508 యూనిట్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు.