అన్నమయ్య: జనగణన-2027లో భాగంగా స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఖచ్చితమైన జనగణనకు సహకరించాలని కోరారు.