తిరుపతిలోని శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, సినీ గాయకులు శ్రీకృష్ణ, శృతి రంజని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు, స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.