KMM: పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామంలో బుధవారం శ్రీ షిరిడి సాయిబాబా గుడి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమాయి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె వెంట సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు పాల్గొన్నారు.