HNK: శాయంపేట మండలంలోని కేజీబీవీ, MJP పాఠశాలలను నేడు తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులతో తహాసిల్దార్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదవాలని తహసిల్దార్ అన్నారు.