MDCL: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో బోడుప్పల్లో ఆదివారం 372వ జ్ఞానమాల కార్యక్రమం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అమోఘమని, ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మైసయ్య కొనియాడారు.