BHNG: ధర్మారెడ్డిపల్లి గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని కాలువలపై బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే బ్రిడ్జి నిర్మించి తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని కోరారు.