KNR: శంకరపట్నం మండలం లింగాపూర్లో సర్పంచ్ మొరే స్వరూప ఆధ్వర్యంలో సోమవారం ఉచితగాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని మొత్తం 330 పాడి పశువులకు టీకాలు వేసినట్లు పశువైద్యులు మాధవరావు తెలిపారు. పశువులలో సంక్రమించే వ్యాధులను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని చేపట్టిందని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.