KNR: అసంపూర్తిగా నిలిచిపోయిన డీ-8 ఉప కాలువ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి నీటిని అందించాలని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత రైతులు తహసీల్దార్ కనకయ్యకు వినతి పత్రం అందజేశారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయి నష్టపోయామన్నారు. కాలువ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగక పంటలకు నీరు అందడం లేదని, అన్నారు.