మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. ‘జన గణ మన’ ఫేమ్ డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1950-60ల నాటి నేపథ్యంలో సాగుతుంది. ఏప్రిల్ 15న మలయాళంలో విడుదలైన ఈ సినిమాను, ఏప్రిల్ 17న ప్రముఖ నిర్మాత బన్ని వాస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. పక్కా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.