SDPT: జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 82 కేంద్రాల్లో మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.