TG: యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి గంట సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అలాగే కొండకింద కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేసవి నేపథ్యంలో దర్శనమార్గాల్లో తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.