VZM: బొబ్బిలి కళింగ వైశ్యభవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం ప్రారంభించారు. ఈనెల 22వ తేదీన బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పాల్గొన్నారు.