KDP: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి స్థానిక 1-టౌన్ PS హోంగార్డ్ రఫీ నైట్ రౌండ్స్ చేస్తుండగా.. గాంధీ రోడ్డులో మందుబాబులు మద్యం బాటిళ్లతో దాడిచేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మద్యం దుకాణాలు రాత్రి 10లోగా మూసివేయాలని జిల్లా SP విశ్వనాధ్ ఆదేశించారు.