VZM: రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో రోడ్లు, కాలువల సమస్య గురించి ఆయనకు టౌన్ BJP ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ వివరించారు. తక్షణమే స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చి పని పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పాల్గొన్నారు.